Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
కార్తీకమాసంలో శివుడికి ఇలా ప్రదక్షిణలు చేస్తేనే కోరికలు నెరవేరుతాయి.. ఎలా చేయాలంటే?
హిందువులకు కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ కార్తీకమాసంలో హిందువులందరూ శివుడు, విష్ణువు ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. అలాగే దైవారాధన చేస్తుంటారు. ఈ దైవారాధనలో భాగంగా దేవుళ్ళ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం హిందూ సంప్రదాయంలో సర్వ సాధారణం. కోరికలు నెరవేరడానికి, సమస్యలు తీరడానికి ఈ ప్రదక్షిణాలు ఎంతగానో దోహదపడతాయి.
అయితే ఈ ప్రదక్షిణలు చేయడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందట. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణాలు చేస్తేనే కోరికలు నెరవేరడంతో పాటు దైవానుగ్రహం మనపైన ఉంటుందని పండిత నిపుణులతో పాటు భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో శివారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ప్రదక్షిణలు చేస్తేనే కార్యం సిద్ధిస్తుంది. అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎలాంటి నిమయాలు పాటించాలి? ఏ విధంగా ప్రదక్షిణాలు చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శివాలయంలో ప్రదక్షిణాలు చేయాల్సిన విధానం..
కార్తీకమాసంలో శివుడు చుట్టూ ప్రదక్షణాలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన పద్దతిలో చేయాలి. ఆ పద్దతిని వ్యాస మహర్షి తాను రచించిన లింగ పురాణంలో కూలంకుషంగా వివరించారు. ఆ లింగ పురాణం ప్రకారం.. శివుడికి ప్రదక్షిణలు చేసేటప్పుడు, శివాలయంలో శివుడి ధ్వజస్థంభం ముందు మొక్కుకొని ప్రదక్షిణలు ప్రారంభించాలి. ధ్వజస్థంభం నుంచి చండీశ్వరుడి వరకూ ప్రదక్షిణ చేయాలి.
అక్కడ చండీశ్వరున్ని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ ధ్వజస్థంభం వరకు వెళ్ళాలి. అక్కడ ఒక్క క్షణం ఆగిపోయి, అక్కడి నుంచి శివలింగం అభిషేక జలం బయటికి వెళ్లే సోమసూత్రం వరకు వెళ్లి, మళ్ళీ ధ్వజస్థంభం వరకు వెళ్ళాలి. అప్పుడే శివుడికి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి నందీశ్వరుడిని దర్శించుకుంటేనే శివుడి ప్రదక్షిణ పూర్తిగా చేసినట్లు అవుతుంది. దీనినే లింగ పురాణంలో సోమసూత్ర ప్రదక్షిణ, చండీ ప్రదక్షిణ అని చెప్తుంటారు. ఈ విధమైన ప్రదక్షిణ చేస్తే.. ఒక్క ప్రదక్షిణ పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో పేర్కొన్నారు. ఇలా మూడు ప్రదక్షిణలు చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై మెండుగా ఉంటుందట.
ఈ తప్పులు చేయకూడదు..
శివ ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అదేంటంటే శివ ప్రదక్షిణ చేసే సమయంలో శివుడి సోమసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు శివుడి అభిషేక జలం సోమసూత్రం నుంచి వెళ్తుంది. అక్కడ ప్రమాద గణాలు కొలువై ఉంటారట. వారిని దాటుకుంటూ వెళ్తే శివుడు కోపానికి గురవుతాడని చెప్తుంటారు.
సాధారణంగా ప్రతి శివాలయంలో శివుడి లింగానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. అయితే ప్రదక్షిణలు చేసే సమయంలో శివుడికి, నందికి మధ్యలో నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ నడవకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు. అలాగే విగ్రహాన్ని మొక్కుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి మొక్కుకోవద్దని, పక్కకు జరిపి మొక్కుకోవాలంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలువురు నిపుణుల సలహాలు, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించడం, విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications











