Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారట.. ఎక్కడో తెలుసా? దాని కోసం ఏం చేయాలంటే?
మన దేశంలో పిల్లల కోసం నోములు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు. వివిధ గుడులకు వెళ్తూ.. కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో ఈ పూజలు అధికంగా ఉంటాయి. అయితే కొందరి ప్రయత్నాలు, పూజలు ఫలిస్తే మరికొందరు అలానే ఉండిపోతారు.
ఇంకొందరు వైద్యంతో సంతానంపై పొందాలని చూస్తూ ఉంటారు.
IVF పద్దతిలో ఇలా సంతానం పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారికోసం ఈ కథనంలో గురించి చెప్తాను. ఈ కొన్ని ఆలయానికి వెళ్లి, ఆ దేవుళ్లను పూజించి, ఆ శివుడి ప్రసాదాన్ని తింటే.. కచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. ఇది ఇప్పటి వరకు నిజమైంది కూడా. అయితే ఆ ఆలయం ఏమిటి? ఎప్పుడు దస్ర్శించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటుపల్లి గుహలు
కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలంలోని గుంటుపల్లి గుహలకు భక్తులు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసం మూడో సోమవారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు శివుడి విగ్రహం ముందు మహిళలు నిద్రపోతారు. అలా పడుకున్నప్పుడు వారి కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు, బొమ్మలు కనిపిస్తే సంతాన భాగ్య కలుగుతుందని నమ్మకం.

పశ్చిమ గోదావరిలో శివుడి ఆలయం
పశ్చిమ గోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామంలో ఉండే శివుడి దేవాలయంలో శివరాత్రి రోజు మొక్కలు నాటుతారు. కొబ్బరి మొక్కలు నాటితే మగ పిల్లాడు, గులాబీ మొక్కలు నాటితే ఆడపిల్ల పుడుతుందని ప్రతీతి ఉంది.
చిలుకూరు బాలాజీ ప్రసాదం
చిలుకూరు బాలాజీ ఆలయంలోని గరుడ ప్రసాదం కోసం మహిళలు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ ప్రసాదం లభిస్తుంది. ఈ ప్రసాదం తింటే కచ్చితంగా పిల్లలు పుడతారని నమ్ముతుంటారు.
ద్వారకా తిరుమలేశుడి ప్రసాదం
అయితే ద్వారకా తిరుమలలోని చినవెంకన్న ఆలయంలో ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గురుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆ పూజల కోసం అర్చకులు గరుడ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఆ గరుడ ప్రసాదాన్ని పూజ అనంతరం అందరికీ పంచుతారు.
ఎవరైతే సంతానం లేని మహిళలు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో, వారికి కచ్చితంగా సంచలనం కలుగుతుందనే నమ్మకం ఉంది. సంతానం లేని మహిళలకు సైతం అర్చకులు ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని అందిస్తుంటారు.
గరుడ ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తారో తెలుసా?
ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించే ముందు మహిళలు చాలా నిష్ఠతో ఉంటారు. ప్రసాదం స్వీకరించే ముందు మూడు రోజులు, స్వీకరించిన తరువాత మూడు రోజులు బాగా నిష్ఠతో ఉంటారు. నాన్ వెజ్ వంటలు అస్సలు ముట్టరు. దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.



Click it and Unblock the Notifications