Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారట.. ఎక్కడో తెలుసా? దాని కోసం ఏం చేయాలంటే?
మన దేశంలో పిల్లల కోసం నోములు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు. వివిధ గుడులకు వెళ్తూ.. కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో ఈ పూజలు అధికంగా ఉంటాయి. అయితే కొందరి ప్రయత్నాలు, పూజలు ఫలిస్తే మరికొందరు అలానే ఉండిపోతారు.
ఇంకొందరు వైద్యంతో సంతానంపై పొందాలని చూస్తూ ఉంటారు.
IVF పద్దతిలో ఇలా సంతానం పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారికోసం ఈ కథనంలో గురించి చెప్తాను. ఈ కొన్ని ఆలయానికి వెళ్లి, ఆ దేవుళ్లను పూజించి, ఆ శివుడి ప్రసాదాన్ని తింటే.. కచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. ఇది ఇప్పటి వరకు నిజమైంది కూడా. అయితే ఆ ఆలయం ఏమిటి? ఎప్పుడు దస్ర్శించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటుపల్లి గుహలు
కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలంలోని గుంటుపల్లి గుహలకు భక్తులు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసం మూడో సోమవారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు శివుడి విగ్రహం ముందు మహిళలు నిద్రపోతారు. అలా పడుకున్నప్పుడు వారి కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు, బొమ్మలు కనిపిస్తే సంతాన భాగ్య కలుగుతుందని నమ్మకం.

పశ్చిమ గోదావరిలో శివుడి ఆలయం
పశ్చిమ గోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామంలో ఉండే శివుడి దేవాలయంలో శివరాత్రి రోజు మొక్కలు నాటుతారు. కొబ్బరి మొక్కలు నాటితే మగ పిల్లాడు, గులాబీ మొక్కలు నాటితే ఆడపిల్ల పుడుతుందని ప్రతీతి ఉంది.
చిలుకూరు బాలాజీ ప్రసాదం
చిలుకూరు బాలాజీ ఆలయంలోని గరుడ ప్రసాదం కోసం మహిళలు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ ప్రసాదం లభిస్తుంది. ఈ ప్రసాదం తింటే కచ్చితంగా పిల్లలు పుడతారని నమ్ముతుంటారు.
ద్వారకా తిరుమలేశుడి ప్రసాదం
అయితే ద్వారకా తిరుమలలోని చినవెంకన్న ఆలయంలో ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గురుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆ పూజల కోసం అర్చకులు గరుడ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఆ గరుడ ప్రసాదాన్ని పూజ అనంతరం అందరికీ పంచుతారు.
ఎవరైతే సంతానం లేని మహిళలు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో, వారికి కచ్చితంగా సంచలనం కలుగుతుందనే నమ్మకం ఉంది. సంతానం లేని మహిళలకు సైతం అర్చకులు ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని అందిస్తుంటారు.
గరుడ ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తారో తెలుసా?
ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించే ముందు మహిళలు చాలా నిష్ఠతో ఉంటారు. ప్రసాదం స్వీకరించే ముందు మూడు రోజులు, స్వీకరించిన తరువాత మూడు రోజులు బాగా నిష్ఠతో ఉంటారు. నాన్ వెజ్ వంటలు అస్సలు ముట్టరు. దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.



Click it and Unblock the Notifications











