Latest Updates
-
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.!
ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారట.. ఎక్కడో తెలుసా? దాని కోసం ఏం చేయాలంటే?
మన దేశంలో పిల్లల కోసం నోములు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు. వివిధ గుడులకు వెళ్తూ.. కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో ఈ పూజలు అధికంగా ఉంటాయి. అయితే కొందరి ప్రయత్నాలు, పూజలు ఫలిస్తే మరికొందరు అలానే ఉండిపోతారు.
ఇంకొందరు వైద్యంతో సంతానంపై పొందాలని చూస్తూ ఉంటారు.
IVF పద్దతిలో ఇలా సంతానం పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారికోసం ఈ కథనంలో గురించి చెప్తాను. ఈ కొన్ని ఆలయానికి వెళ్లి, ఆ దేవుళ్లను పూజించి, ఆ శివుడి ప్రసాదాన్ని తింటే.. కచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. ఇది ఇప్పటి వరకు నిజమైంది కూడా. అయితే ఆ ఆలయం ఏమిటి? ఎప్పుడు దస్ర్శించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటుపల్లి గుహలు
కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలంలోని గుంటుపల్లి గుహలకు భక్తులు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసం మూడో సోమవారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు శివుడి విగ్రహం ముందు మహిళలు నిద్రపోతారు. అలా పడుకున్నప్పుడు వారి కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు, బొమ్మలు కనిపిస్తే సంతాన భాగ్య కలుగుతుందని నమ్మకం.

పశ్చిమ గోదావరిలో శివుడి ఆలయం
పశ్చిమ గోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామంలో ఉండే శివుడి దేవాలయంలో శివరాత్రి రోజు మొక్కలు నాటుతారు. కొబ్బరి మొక్కలు నాటితే మగ పిల్లాడు, గులాబీ మొక్కలు నాటితే ఆడపిల్ల పుడుతుందని ప్రతీతి ఉంది.
చిలుకూరు బాలాజీ ప్రసాదం
చిలుకూరు బాలాజీ ఆలయంలోని గరుడ ప్రసాదం కోసం మహిళలు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ ప్రసాదం లభిస్తుంది. ఈ ప్రసాదం తింటే కచ్చితంగా పిల్లలు పుడతారని నమ్ముతుంటారు.
ద్వారకా తిరుమలేశుడి ప్రసాదం
అయితే ద్వారకా తిరుమలలోని చినవెంకన్న ఆలయంలో ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గురుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆ పూజల కోసం అర్చకులు గరుడ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఆ గరుడ ప్రసాదాన్ని పూజ అనంతరం అందరికీ పంచుతారు.
ఎవరైతే సంతానం లేని మహిళలు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో, వారికి కచ్చితంగా సంచలనం కలుగుతుందనే నమ్మకం ఉంది. సంతానం లేని మహిళలకు సైతం అర్చకులు ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని అందిస్తుంటారు.
గరుడ ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తారో తెలుసా?
ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించే ముందు మహిళలు చాలా నిష్ఠతో ఉంటారు. ప్రసాదం స్వీకరించే ముందు మూడు రోజులు, స్వీకరించిన తరువాత మూడు రోజులు బాగా నిష్ఠతో ఉంటారు. నాన్ వెజ్ వంటలు అస్సలు ముట్టరు. దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.



Click it and Unblock the Notifications