కలియుగం త్వరలోనే అంతం కాబోతోంది..! ఎప్పుడో తెలుసా..?

ప్రస్తుతం మనం వుంటుంది కలియుగమని శాస్త్రం చెబుతోంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా 5124 సంవత్సరాల క్రితం చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన లెక్కల ప్రకారం ద్వాపర యుగరం 2592 ఏళ్లు వుంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి కూడా అది ఎప్పుడో ముగిసిపోయింది. ద్వాపర యుగం 2592 ఏళ్లు, అది కూడా అయిపోయింది. ఈ లెక్కల ప్రకారం 2082లో కలియుగం ముగుస్తుంది. అంటే సుమారు 60 ఏళ్ల తరువాత కలియుగం అంతం కాబోతోంది. ఒకే సారి కలియుగం వచ్చి పూర్తిగా మారిపోదు. చలికాలం వచ్చే సమయంలో ముందు వాతావరణంలో చిన్న మార్పులు జరుగుతాయ్, వర్షాకాలం వచ్చే ముందు కూడా ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయ్. ఇలాంటి చిన్న మార్పులే కలియుగం అంతమయ్యే సమయంలో మనం చూస్తాం.

kaliyuga ending soon

ఈ భూమిపై చలికాలంలో జంతువులు ఒకలా వుంటాయ్, వర్షాకాలంలో మరోలా వుంటాయ్. అలాగే యుగాల్లో కూడా యుగాన్ని బట్టి మనుషులు వుంటారు. మనకు వున్నది ఒకటే శరీరమైన ఆధ్యాత్మిక పరంగా మనకు 5 శరీరాలుంటాయ్. ఒకటి భౌతిక శరీరం, మానసిక శరీరం, శక్తి శరీరం, విఘ్నానమయ శరీరం. ఇవన్నీ శరీరంలో ఎలా పనిచేస్తున్నయనేది ప్రధానంగా వుంటుంది.

ఎవరైనా దేనిగురించైనా అభిప్రాయం ఏర్పరుచుకున్న మరుక్షణం పాపులౌతారు, మహాత్ములౌతారు. ఎవరైనా ఆమేరకు జీవించలేకపోతే పాపులౌతారు. ఒక వేళ జీవించగలుగుతే మహాత్ములౌతారు. విలువలు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మారుతూ వుంటాయ్. అలాగే ఒక యుగానికి మరో యుగానికి మారుతూ వుంటాయ్. కాబట్టి ముఖ్యమైన విషయం ఇది కాదని మనం అర్థం చేసుకోవాలి. మనం లోపలి నుంచి ఏదైనా చేస్తున్నామంటే అది ఎరుకతో చేస్తున్నదైతే ఫలితం మనం కోరుకున్న విధంగా వుంటుంది, అదే అచేతనంగా చేస్తున్నటైతే ఫలితాలు యాదృచ్ఛికంగా వుంటాయ్. ఈ యాదృచ్ఛికమైన పర్యవసానాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయ్. ఈ ప్రభావాలు అధికమించలేనివి కావు, ఇవి అందరిపైన వుండే ప్రభావాలే.

kaliyuga ending soon

2వేల ఏళ్ల క్రితం ముగిసిన కలియుగ కాలాన్ని చీకటి యుగంగా పిలుస్తారు. ఎందుకంటే మనుషులు ఒకరిపై ఒకరు ఘోరంగా దాడి చేసుకున్నారు. ద్వాపర యుగంలో కూడా ఇలాంటి ఘోరాలు ఎన్నో జరిగాయ్. చేస్తున్న పనులు చాలా ఘోరమైనవని తెలిసి కూడా మనం చేసేశాము. అసలు మనుషులు చేయలేరు అనుకోని ఎన్నో విషయాలను మనం చాలా సాధారణంగా గతంలో ఎన్నో చేశాము. అవి సరైన పనులని ఆమోదింపబడ్డాయ్ కూడా. మనం త్రేతాయుగానికి చాలా దగ్గరగా వున్నాం. దాని కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. వెనకటి తరం మంచి పునాది వేస్తేనే తరువాత తరం దాని పై మంచి నిర్మాణం చేపడుతుంది. ఇది ఇంటి విషయంలో, దేశం విషయంలో, చైతన్యం విషయంలో చాలా వాస్తవం.

చాలా మంది ప్రపంచం చాలా నాశనమైపోతుందని బాధపడతారు. కానీ 500ల ఏళ్ల క్రితం మనిషి ఎలా జీవించాడో ఒకసారి పరిశీలన చేయండి. గతంలో కంటే ఇప్పుడు మనం చాలా మెరుగ్గా జీవిస్తున్నాం. మహిళల జీవితం కూడా చాలా మెరుగ్గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మెరుగుపడింది.

Story first published: Tuesday, July 9, 2024, 17:41 [IST]
Desktop Bottom Promotion