Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
Kartik Masam 2021: కార్తీక మాసంలో ఏ పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదో తెలుసా...
కార్తీక మాసంలో చేయాల్సిన మరియు చేయడకూని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 21వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. ఇది నెల రోజుల పాటు అంటే నవంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతుంది.

పురాణాల ప్రకారం ఈ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల నిద్ర నుండి మెళకువలోకి వస్తారని నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం ఈ నెలలో తారకాసురుడిని కార్తికేయుడు సంహరించారని, అదేవిధంగా మరో కథనం ప్రకారం.. సత్యభామ చేతిలో నరకాసురుని సంహారం జరగడంతో ఈ నెలలో పూజలు, ఉపవాసాలు, పండుగలు మరియు ఇతర మతపరమైన కార్యకలాపాలు పెరిగినట్లు సమాచారం. ఈ కార్తీక మాసం శరద్ పూర్ణిమ రోజు నుండి ప్రారంభమవుతుంది.

ఈ నెలలోనే ఉత్తర భారతంలో కార్వా చౌత్, ధంతేరాస్, రూప్ ఛౌడాస్, భాయ్ దూజ్, దక్షిణ భారతంలో అట్ల తద్ది, నోముల వ్రతాలు, గౌరీ పండుగ, దేశవ్యాప్తంగా దీపావళి, గోవర్దన పూజ వంటివి జరుగుతాయి. గురు పూర్ణమితో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసంలో ఏకాదశితో పవిత్రమైన మరియు శుభకరమైన పనులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఉపవాసం ఉండటం.. కొన్ని ముఖ్యమైన పనులు చేయడం రెట్టింపు ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా ఈ కాలంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.. ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నదిలో స్నానం..
కార్తీక మాసంలో ప్రవహించే నీటిలో లేదా ఏదైనా నదిలో స్నానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో బ్రహ్మ ముహుర్తంలో స్నానం చేస్తే, భూమిపై ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల పుణ్యం లభిస్తుంది. మీకు ఒకవేళ ఇలా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం కుదరకపోతే.. మీరు గంగా జలం కలిపిన నీటిలో బాటిల్ లేదా ఇతర ఏదైనా వస్తువుల్లో నింపుకొని వచ్చి ఆ నీటిని మీ బకెట్లో వేసుకుని స్నానం చేయొచ్చు.

తులసి పూజ..
కార్తీక మాసంలో తులసి చెట్టును పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో తులసి చెట్టును అందంగా అలంకరించి.. ఆ చెట్టుకు చీరను కట్టి.. పసుపు తాడు కట్టడం వల్ల శుభఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని సానుకూల ఫలితాలు వస్తాయని, దీని వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. ఈ నెలలో ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతారు.

దీపారాధన..
కార్తీక మాసం అంటే దీపాలకు ప్రసిద్ధి. ఈ పవిత్రమైన కాలంలో ప్రతిరోజూ సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అదే సమయంలో శ్రీ మహా విష్ణువును స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి పెరుగుతాయని.. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని చాలా మంది నమ్ముతారు.

ఇవి ఎక్కువగా తీసుకోండి..
కార్తీక మాసంలో ఉపవాసం ఉండే వారు బాడీలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ప్రతిరోజూ పాలను తీసుకోవాలి. అందులో పంచదారకు బదులు 50 గ్రాముల బెల్లం కలిపిన పాలను తీసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే మీ రక్తపోటును నియంత్రిస్తుంది.

ఇవి తీసుకోవద్దు..
కార్తీక మాసంలోనే శీతాకాలం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. అందుకే ఈ కాలంలో చల్లని నీటిని తాగడం నివారించండి. ముఖ్యంగా ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పదార్థాలను తినడం నివారించాలి. ఇలా చేయడం వల్ల మీరు దగ్గు మరియు జలుబుకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే మద్యం మరియు పొగ తాగడం, మాంసం తినడం.. చేపలను తినడం వంటివి తగ్గించాలి.

ఈ పనులు చేయకండి..
ఈ పవిత్రమైన మాసంలో నేలపైనే ఎక్కువగా నిద్రించండి. చాలా సహనంతో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కోపంగా ఉండకండి. అహం నుండి చాలా దూరంగా ఉండాలి. ఎవ్వరితోనూ వాదనకు దిగకండి. వీలైనంత మేరకు తక్కువగా మాట్లాడండి. అలాగే ఈ కాలంలో బ్రహ్మచార్యం పాటించాలి. ఒకవేళ మీరు ఈ నియమాలను పాటించకపోతే.. అశుభ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానీయొద్దు.



Click it and Unblock the Notifications