Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
కార్తీకమాసం స్పెషల్.. ఈరోజు ఈ విధంగా దీపం వెలిగించి, ఈ వస్తువులు దానం చేయాలి.. అష్ట ఐశ్వర్యాలు మీకే సొంతం!
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తుంటారు. దేవుడి స్వరూపంగా భావించే ఈ నెలలో హిందువులు ఎక్కువాగా శివుడు, విష్ణువు ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. ప్రతిరోజూ ఇంట్లో పూజలు చేయడంతో పాటు ఆలయాల్లో కూడా కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చూపుకుంటారు. అయితే ఈ కార్తీకమాసంలో కార్తీక శనివారం కూడా అత్యంత ప్రముఖమైనది.
ఈరోజున భగవంతుని అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. అలాగే కొన్ని పరిహారాలు చేయాలి. అలా చేయడం వల్ల భగవంతుని అనుగ్రహంతో పాటు శనీశ్వరుడు దోషాలు కూడా తొలిగిపోతాయి. అయితే ఆ పరిహారాలు ఏంటి? ఏ విధమైన దీపం వెలిగించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శని దేవాలయాన్ని సందర్శించడం
ఈ కార్తీక శనివారం రోజున శని దోషం ఉన్నవారు శని ఆలయాన్ని సందర్శించి, నువ్వుల నూనెలో మీ ముఖాన్ని చూసి, ఆ నూనెను ఇతరులకు దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా శని దోషాలు తొలిగిపోవడంతో పాటు కష్టాలు తగ్గుతాయి.
శివుడి అభిషేకం
ఈ కార్తీక శనివారం రోజు మహా శివుడికి అభిషేకం చేయడంతో పాటు శివ మంత్రాలను పఠించాలి. ఓం నమఃశివాయా అనే మంత్రాన్ని జపించడంతో పాటు, శివ పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహంతో శనిదోషాలు తొలిగిపోతాయి.
దానం చేయడం..
ఈ కార్తీక శనివారం రోజున మీకు తోచినంత మీ శక్తి మేరకు దానం చేయండి. దానం చేసే వ్యక్తులంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం. అందుకే దానం చేయడం వల్ల ఆ వ్యక్తులపై శని తన ప్రేమను చూపించి, తన చెడు ప్రభావాన్ని తొలగించుకుంటాడు. నువ్వుల నూనె, అన్నదానం, నువ్వులు, వస్త్రాలు, నల్ల తివాచి దానం చేస్తే శ్రేయస్కరంగా ఉంటుంది.
మర్రిచెట్టు కింద దీపం వెలిగించడం..
ఈ కార్తీక శనివారం రోజున మర్రిచెట్టు కింద నువ్వుల దీపం వెలిగిస్తే గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా దీపం వెలిగించడం వల్ల శని దోషం ఉంటే ఆ దోషాలు తగ్గుతాయి. శనిదోషం ఉన్న వ్యక్తులు కేవలం కార్తీక శనివారం రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారం ఇలా దీపం వెలిగిస్తే ప్రయోజనం లభిస్తుంది.
ఏ రాశుల వారికి శని దోషం ఉందంటే..
మకర, కుంభ, మీన రాశులలో శని దోషం నడుస్తోంది. ఈ రాశికి శనిదోషం ఉండటం వల్ల ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి వారికి 2025లో శని దోషం ముగుస్తుంది. అప్పుడు మకర రాశి జీవితంలో సానుకూల మార్పు ఉంటుంది.
కార్తీకమాసంలో దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు?
కార్తీక మాసంలో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తుంటారు. దీపం వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహం మనపై ఉంటుంది. ప్రతికూలత తొలగిపోతుంది, జీవితంలో ఆనందం శాంతి నెలకొంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications











