Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్లో పడినట్లే.!
Mahakumbh 2025: ఇంటి దగ్గరే ఈ పని చేస్తే.. మహాకుంభ స్నానానికి సమానమైన పుణ్య ఫలితం
ప్రపంచంలోనే అతిపెద్ద మత కార్యక్రమం ఏదైనా ఉందంటే అది కుంభమేళానే. హిందూ క్యాలెండర్ ప్రకారం సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి, అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి.. పూర్ణ కుంభ మేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 12 పూర్ణ కుంభ మేళాలు పూర్తైన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారు.
ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా(MahaKumbh Mela 2025) నిర్వహించనున్నారు. ఈ మహాకుంభమేళాకి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. చాలా మంది సాధువులు, ఋషులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. మహాకుంభ మేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా
మహాకుంభ సమయంలో రాజ స్నానం చేసే ప్రక్రియ సాధారణ ప్రక్రియ కాదని.. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని.. ఆ సమయంలో గంగాస్నానం చేసేవారికి ఆ శక్తి ప్రయోజనం లభించి మోక్షాన్ని ,పుణ్యాన్ని పొందుతారని, పాపాలు కూడా నశిస్తాయని పండితులు చెబుతారు. అయితే చాలామందికి మహాకుంభమేళా వెళ్లాలని ఉన్నా కూడా కొన్ని కారణాల వెళ్లలేక బాధపడుతుంటారు. అయితే మీరు కూడా వెళ్లాలని కూడా ఉండి కూడా కుదరక వెళ్లలేకపోతే ఇంటి దగ్గరే ఉండి మహాకుంభ స్నానం సమానమైన పుణ్యఫలాన్ని పొందవచ్చు.
ఇంట్లోనే మహాకుంభస్నానం చేసిన పుణాన్ని పొందడం ఎలానో చూడండి
నది-చెరువులో స్నానం చేయడం
మహాకుంభానికి వెళ్లలేని పిల్లలు,వృద్ధులు,మహిళలు ఇలా చాలా మంది ఇంట్లో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా కుంభస్నానానికి సమానమైన పుణ్యాన్ని పొందవచ్చు. కుంభమేళాలో ప్రత్యేక తేదీలలో రాజ స్నానాలు జరుగుతాయి కాబట్టి అదే తేదీలలో అంటే పుష్య పౌర్ణమి (జనవరి 13), మకర సంక్రాంతి(జనవరి 14), మౌని అమావాస్య(జనవరి 29), వసంత పంచమి(ఫిబ్రవరి 3),మాఘ పౌర్ణమి(ఫిబ్రవరి 12), మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) రోజున మీరు గంగామాతను దృష్టిలో ఉంచుకుని మీకు సమీపంలోని నదిలో లేదా చెరువులో స్నానం చేయవచ్చు. దీంతోమహాకుంభస్నానం చేసిన ప్రయోజనాలను ఇంటి దగ్గరే పొందుతారని పండితులు చెబుతున్నారు.
ఇలా చేసినా కూడా ఓకే
నదికి లేదా చెరువుకు కూడా వెళ్ళలేని వారు ఒక బకెట్ నీటిలో కొద్దిగా గంగాజలం వేసి 'గంగా గంగే తీజ్ పూజ తీజ్ జననాం శతే' అనే మంత్రంతో గంగామాతను ఆరాధించాలి. 'రపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులౌకమ్మ స గచ్ఛి" అని చెప్పి నేను మహాకుంభంలోనే స్నానం చేస్తున్నానని స్మరించుకుని స్నానం చేయండి. తద్వారా మహాకుంభ స్నానానికి సమానమైన పుణ్య ఫలితాలను పొందుతారని పండితులు తెలిపారు.



Click it and Unblock the Notifications