అక్టోబర్ 3వ తేదీ మహాలయ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే, దోషాలుపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది

Mahalaya Amavasya 2024 మన పూర్వికులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం పాపాలు మూటకట్టుకోవడం జరుగుతుంది. పితృ దోషాల వల్ల జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు. కష్టాలు ఎదురైనప్పుడువారి జాతకంలో ఇటువంటి దోషాలను సులభంగా గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడు వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు,పనులు అసంపూర్తిగా ఉండటం, ఇంటా బయట గౌరవ మర్యాదలను కోల్పోవడం, అతి చిన్నవయస్సులోనే వైవిద్యం ఏర్పడుతుంది. కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటారు. పిల్లల వల్ల సమస్యలు, పిల్లలు పుట్టకపోవడ వంటి సవాళ్లను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి కుటుంబంలో సభ్యులు తమ జీవితంలో రుణం తీర్చుకోవాలి. అప్పుడే చనిపోయిన మన పెద్దల నుండి పూర్తీ ఆశీస్సులు పొందుతారుని ముక్తి, మోక్షం లభిస్తుందని అంటారు. పితృ రుణం తీర్చుకోకపోతే వారికి దోషాల నుండి లభించదని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. అందుకు ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య. మహాలయ పక్షం చేయని వారికి అశుభం జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మహాలయ అమాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల దోషాలు తొలగిపోవడంతో పాటు వారి ఆశీస్సులతో అదృష్టం పొందుతారు.

Mahalaya Amavasya 3 October 2024

* ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడం పవిత్ర గంగా స్నానం నదీ స్నానాలు చేసి మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం పొందుతారు. అలాగే నదుల్లో తర్పణాలను వదలడం ద్వారా దోషాలు తొలగిపోతాయి.

* కాకులకు, కుక్కలకు, చీమలకు ఆహారాన్ని అందించడంతో చనిపోయిన మన పూర్వీకుల నుండి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

* మహాలయ అమావాస్య రోజున చనిపోయిన వారికి వారి పేరు మీద అన్నదానం, దాన దర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు.

* దీనితోపాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు. ఇలా వడ్డించే ఆహారం నేరుగా చనిపోయిన మన పూర్వీకులకు అందుతుందని చాాలా మంది నమ్మకం.

* మహాలయ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజును చనిపోయిన వారికోసమనే కేటాయిస్తారు. ఈ రోజున మన చేసే పూజల, స్వీకరించడానికి మన పూర్వీకు భూమిమీద వారి కుటుంబంలోని వారిపై ఆశీసులు కురిపిస్తారనే నమ్మకం ఉంది.

* అమావాస్య రోజు ఎవరైతే వారి కుటుంబంలో చనిపోయినా వారి పితృ దేవళ్లును గుర్తు చేసుకొని పిండప్రధానం, తర్పణాలను వదులుతారో వారికి పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతారు.

మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మ శాంతికి కోసం వారికి నచ్చిన విధం పూజలు తర్పణాలు చేయడం ద్వారా దోషాలు శాపాలు తొలగిపోతాయి.

Desktop Bottom Promotion