Mahashivratri 2022:ఈ ఏడాది శివరాత్రి ఎప్పుడు, శుభ ముహుర్తం, పూజా విధానాలివే...

హిందూ మతం ప్రకారం ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ ఏడాది శుభ ముహుర్తం, పండుగ తేదీ, శివుని పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.

Mahashivratri 2022

2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

Mahashivratri 2022

జ్యోతిష్యశాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం, భోలేనాథుడితో పాటు పార్వతీ దేవికి పూజలు చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, లభించడంతో పాటు శుభఫలితాలొస్తాయి. ఈ సందర్భంగా మహా శివరాత్రి వంటి పవిత్రమైన పండుగ రోజున పూజా విధానం మరియు శుభ ముహుర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

శుభ సమయం..

శుభ సమయం..

2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు ఉదయం 3:16 నుండి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే మార్చి 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు పూర్తవుతుంది.

పూజా సమయం..

పూజా సమయం..

మహా శివరాత్రి రోజున 2022లో మార్చి 1వ తేదీన మంగళవారం నాడు మొదటి ప్రహార్ పూజా సమయం మార్చి 1, 2022 సాయంత్రం 6:21 గంటల నుండి 9:27 గంటల వరకు ఉంటుంది.

రెండో ప్రహార్ యొక్క ఆరాధన సమయం మార్చి 1వ తేదీ రాత్రి 9:27 నుండి అర్ధరాత్రి 12:23 గంటల వరకు

మూడో ప్రహార్ పూజా సమయం మార్చి 2వ తేదీ అర్థరాత్రి 12:24 నుండి ఉదయం 3:39 గంటల వరకు

నాలుగో ప్రహార్ పూజా సమయం మార్చి 2వ తేదీ 3:40 నుండి ఉదయం 6:45 గంటల వరకు

పారాయణ సమయం : మార్చి 2, బుధవారం ఉదయం 6:45 గంటల తర్వాత

మహా శివరాత్రి పూజా విధానం..

మహా శివరాత్రి పూజా విధానం..

దేవతలు మరియు దేవుళ్లందరిలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమని చాలా మంది నమ్ముతారు. కేవలం నీటిని సమర్పించడం ద్వారా పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే శివుడిని బోలేనాథ్ అని కూడా పిలుస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే మహా శివరాత్రి పండుగ కోసం ప్రతి ఒక్క శివ భక్తుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహుర్తంలోనే స్నానం చేయాలి. దీని తర్వాత, పూజా స్థలాన్ని శుద్ధి చేసిన తర్వాత, నీటితో నింపిన కలశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత శివుడు, పార్వతి విగ్రహాలను ప్రతిష్టించాలి. అనంతరం గంధం, అక్షింతలు, లవంగం, యాలకులు, తమలపాకులు, మోలీ, దాతుర, బేలపత్రం, పాలు, పెరుగు, నెయ్యి, తేనే తదితర వాటిని సమర్పించాలి. అప్పుడు శివుడిని స్మరించుకుంటూ శివునికి హారతి ఇవ్వాలి.

శివ కథలు వింటూ..

శివ కథలు వింటూ..

మహా శివరాత్రి రోజున ‘ఓం నమః శివాయః' అనే మంత్రాన్ని జపిస్తూ శివునికి అభిషేకరం చేయాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పరమేశ్వరుడిని పూజించాలి. అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. అలాగే శివకథలు వింటూ మరోసారి రథ రాత్రి, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. మౌనవ్రతం ఉండాలనుకుంటే మరుసటి రోజు సూర్యోదయం వరకూ ‘ఓం నమః శివాయ' మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. ‘పరమాత్మా మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్ణ పూజ కొనసాగించి పూర్తి చేశాను అని వేడుకోవాలి.

FAQs
మహా శివరాత్రి పూజా నియమాలేంటి?

దేవతలు మరియు దేవుళ్లందరిలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమని చాలా మంది నమ్ముతారు. కేవలం నీటిని సమర్పించడం ద్వారా పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే శివుడిని బోలేనాథ్ అని కూడా పిలుస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే మహా శివరాత్రి పండుగ కోసం ప్రతి ఒక్క శివ భక్తుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహుర్తంలోనే స్నానం చేయాలి. దీని తర్వాత, పూజా స్థలాన్ని శుద్ధి చేసిన తర్వాత, నీటితో నింపిన కలశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత శివుడు, పార్వతి విగ్రహాలను ప్రతిష్టించాలి. అనంతరం గంధం, అక్షింతలు, లవంగం, యాలకులు, తమలపాకులు, మోలీ, దాతుర, బేలపత్రం, పాలు, పెరుగు, నెయ్యి, తేనే తదితర వాటిని సమర్పించాలి. అప్పుడు శివుడిని స్మరించుకుంటూ శివునికి హారతి ఇవ్వాలి.

2022లో మహా శివరాత్రి పండుగ ఎప్పుడొచ్చింది?

హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion