Mahashivaratri:శివరాత్రి రోజున ఈ పూజలు చేయకుంటే ప్రాణాపాయం తప్పదు..!

మహాశివరాత్రి పండగ ఈ ఏడాది ఫిబ్రవరి 18న వస్తుంది. శనివారం కావడంతో చాలామంది శివభక్తులు ఈ పండగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మహాశివరాత్రి రోజున పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దుష్ప్రభావాలు తగ్గుతాయి. జ్యోతిష్య శాస్త్రం కూడా ఇదే బోధిస్తోంది. అయితే ఎలాంటి పూజలు చేసి ఈ దుష్ప్రభావాలకు చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహాలు శాంతించాలంటే...

గ్రహాలు శాంతించాలంటే...

మహాశివరాత్రి రోజును హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున శివుడు-పార్వతీదేవీల వివాహం జరిగిందని హిందువులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి రోజున పరమశివుడిని, పార్వతీదేవీలను పూజించడం వల్ల కష్టాలు తొలిగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు స్నానం చేసి పూజలు నిర్వహించి దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.

త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో, విశ్వాన్ని నాశనం చేయగల శక్తి పరమశివుడికి ఉంది. అయితే శివుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా అనేక రకాల దోషాలు, గ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శివుడిని పూజించడం వల్ల నాలుగు ప్రధాన గ్రహాల నుంచి ఎదురయ్యే కీడు లేదా దుష్పలితాలు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

శని రాహువుల నుంచి ఎదురయ్యే కీడు

శని రాహువుల నుంచి ఎదురయ్యే కీడు

మహాశివరాత్రి రోజున శివుడిని పూజించి శివలింగానికి చెరుకు రసం, నల్ల నువ్వులు సమర్పిస్తే శని గ్రహం శాంతిస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. శని గ్రహం ఆగ్రహం నుంచి విముక్తి పొందవచ్చని శాస్త్రం స్పష్టం చేస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు నుంచి ఎదురయ్యే కీడులు తొలిగిపోవాలంటే మహాశివరాత్రి పర్వదినాన దుర్వ, కుశాలను నీటిలో కలిపి శివుని ప్రతిష్టిస్తే దుష్ఫలితాలు తొలిగిపోతాయట. అంతేకాదు ఇదే రోజున పంచాక్షరీ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించాలని పండితులు చెబుతున్నారు.

శివుడితో పాటు చంద్రుడిని...

శివుడితో పాటు చంద్రుడిని...

శివుడు చంద్రుడిని తలపై ధరించాడు. అందుకే మహాశివరాత్రి పండగ రోజున శివుడితో పాటుగా చంద్రదేవున్ని కూడా పూజించడం ముఖ్యం. నిశిత వేలలో వీలైతే చంద్రునికి వెండి పాత్రతో పాలు సమర్పించాలి. అంతేకాదు రుద్రాక్ష జపమాలతో " ఓం శ్రీ శ్రీ శ్రేయోన్ సః " అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది.జ్యోతిషశాస్త్రంలో మంగళ్ దోషం చాలా ప్రతికూలంగా పరిగణించబడుతుంది. ఈ లోపం కారణంగా, వ్యక్తి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ దోషం పోగొట్టుకోవడానికి మహాశివరాత్రి రోజున గంగాజలంలో ఎర్రని పువ్వులు, ఎర్రచందనం, బెల్లం కలిపి శివునికి అభిషేకం చేయండి. అలాగే, ఈ సమయంలో కనీసం 108 సార్లు 'ఓం నమో భగవతే రుద్రాయ నమః' అని జపించండి.

మంగళదోషం తొలిగిపోవాలంటే..

మంగళదోషం తొలిగిపోవాలంటే..

జ్యోతిష్య శాస్త్రంలో మంగళదోషం చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. ఈ దోషం ఉన్న వారు ఎన్నో సమస్యల సుడిగుండాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ దోషం తొలిగిపోవాలంటే మహాశివరాత్రి రోజున ఎర్ర రంగులో ఉన్న పువ్వులు, ఎర్రచందనం, బెల్లంను గంగాజలంలో కలిపి ఆ పరమశివునికి అభిషేకం చేయాలి. అలాగే 108 సార్లు " ఓం నమో భగవతే రుద్రాయ నమః" అని జపించాలి. ఇలా చేస్తే దోషం తొలిగిపోయి అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Story first published: Thursday, February 16, 2023, 14:41 [IST]
Desktop Bottom Promotion