Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Sankranti Special: సంక్రాంతి పండుగకు నువ్వులు, బెల్లం ఎందుకు ఉపయోగిస్తారు? శాస్త్రీయ కారణం ఇదిగో...
సంక్రాంతి పండుగకు నువ్వులు, బెల్లం ఎందుకు ఉపయోగిస్తారు? శాస్త్రీయ కారణం ఇదిగో...
సంవత్సరంలో మొదటి పండుగగా పిలువబడే సంక్రాంతిని దక్షిణ భారతదేశంలో విభిన్నంగా జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం ప్రకారం సంక్రాంతిని జరుపుకుంటారు.

సంక్రాంతి అంటే సూర్యుడు తన మార్గాన్ని ఒక రాశి నుండి మరో రాశికి మార్చుకునే ప్రక్రియ. జనవరి 14న పండుగను జరుపుకోవడం ద్వారా ఈ ప్రత్యేక మార్పును స్వాగతించబడుతుంది.
తమిళనాడులో రైతులు తమ పంటలను పండించి, పొంగల్ను తయారు చేసి పండుగలా పంచుకుంటారు, కేరళలో మకర సంక్రాంతిని శబరిమలలో కనిపించే మకర జ్యోతితో జరుపుకుంటారు. గుజరాత్, మహారాష్ట్రల్లో సంక్రాంతికి గాలి పతంగులు ఎగురవేస్తారు. పంజాబ్ మరియు హర్యానాలలో సంక్రాంతిని లోహరిగా జరుపుకుంటారు.

ఆంధ్ర, కర్ణాటకలో
నువ్వులు, బెల్లం ముక్కలను మిక్స్ చేసి స్నేహితులు, బందువులకు పంచి సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండగ రోజున రైతులు పండించిన ధాన్యాన్ని, చెరకును పక్కవాళ్లకు పంచడం ఆనవాయితీ. అంతే కాకుండా నువ్వుల బెల్లం పంచుకోవడం ద్వారా ఆనందాన్ని పంచుకోవడానికి సంక్రాంతి చిహ్నంగా కూడా భావిస్తారు.

అయితే నువ్వులు బెల్లంతో ఎందుకు పంచుకుంటారు?
దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. శీతాకాలంలో ఈ చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి నువ్వులు సహాయపడతాయని చెబుతారు. మారుతున్న వాతావరణంలో శరీరానికి కావాల్సిన పోషకాలను నువ్వులు అందించడమే దీనికి కారణం.

నువ్వులలో ఉండే ప్రొటీన్
నువ్వులలో ఉండే ప్రొటీన్ కండరాలను బలపరుస్తుంది. జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇది వాత దోష నివారణలో సహాయపడుతుంది.

నువ్వులతో పాటు వేరుశనగ, కొబ్బరి, బెల్లం, చెరకు,
నువ్వులతో పాటు వేరుశనగ, కొబ్బరి, బెల్లం, చెరకు, ఆముదం కూడా పంపిణీ చేస్తారు. ఎందుకంటే పచ్చి శెనగపప్పు, కొబ్బరికాయల్లోని ఆయిల్ కంటెంట్ చర్మానికి మేలు చేస్తుంది, ఆయిల్ కంటెంట్ చర్మాన్ని చలి నుంచి కాపాడుతుంది.

బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు
బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. ఈ మిశ్రమం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications