Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ రాయి తిరిగితే కోరిక నెరవేరినట్లే..! దర్శిస్తే అష్టదరిద్రాలన్నీ పోతాయ్ ..అరుదైన మరకత శివలింగం
మనదేశంలో గుడులకు కొదవే లేదు. గల్లీకో గుడి ఉంది. అయితే కొన్ని గుళ్లు చాలా పాపులర్ అయ్యాయి. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడం వంటి కారణాలతో చాలా దేవాలయాలు ఫేమస్ అవుతుంటాయి. అలాంటివాటిలో ఒకటి హైదరాబాద్ దగ్గర్లో ఉంది. హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లి దగ్గర్లోని చండిప్పలోని శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి దేవాలయం చాలా చాలా ఫేమస్. దీనికి కారణం ఈ ఆలయంలో మరకత శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది.
క్రీ.శ. 1076 నుండి 1126 మధ్యకాలంలో పశ్చిమ చాళుక్య రాజైన విక్రమాదిత్య పరిపాలించిన సమయంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు సమాచారం. క్రీ.శ. 1101 అక్టోబర్ 23న సోమేశ్వర లింగం ప్రతిష్ఠించబడింది. కాలభైరవుడు ఒక దివ్య,మైన పాము ఈ ఆలయానికి క్షేత్రపాలకులని నమ్ముతారు. కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే 2007లో నరేష్ కుమార్ అనే భక్తుడు దీనిని పునరుద్ధరించడానికి పూనుకున్నారని.. 2012లో ఆలయాన్ని తిరిగి నిర్మించారని సమాచారం.

ఈ ఆలయంలోని మరకత శివలింగం చాలా అరుదైనది, దీనిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మరకతం అంటే బుద్ద గ్రహానికి చెందిన రంగు. పురాణాల ప్రకారం మరకత శివలింగాన్ని పూజించడం వలన కష్టాలు, పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, విద్య అభివృద్ధి చెందుతుంది. రాజు లేదా పాలకులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ లింగానికి అభిషేకం చేయడం, గంధం రాయడం వలన ఔషధ గుణాలు ఉంటాయని నమ్ముతారు. శంకరపల్లి వెళ్ళినప్పుడు ఈ అరుదైన మరకత శివలింగాన్ని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే అష్ఠదరిద్రాలన్నీ పోతాయని చెబుతారు.
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆలయంలో ఓ రాయి ఉంటుంది. దానిపై రెండు చేతుల బొటనవేళ్లు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే ఆ రాయి దానంతట అదే కుడివైపుకు తిరుగుతుందని చాలామంది దానికి సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తమ కోరికలు ఇక్కడ కోరుకున్న తర్వాత నెరవేరాయని చాలామంది భక్తులు చెబుతే ఆ వీడియోల కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ పవర్ ఫుల్ ఆలయాన్ని వీలైతే మీరు ఓ సారి సందర్శిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications