Latest Updates
-
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...
అంగారకుడు ఎరుపు రంగులో ఎందుకని ఎక్కువగా పరిగణించబడతాడో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే అందులో అంగారక గ్రహానికి చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. అన్ని రాశుల వారు అంగారకుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు. పురాణాల ప్రకారం, శివుని దయ వల్ల అంగారకుడు జన్మించాడు.

అందుకే దీన్ని అంగారకుడి మాత్రుమూర్తి అని కూడా అంటారు. మన భారతదేశంలో నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి విభిన్నమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ఎరుపు రంగు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ మేము చెప్పబోయే దేవాలయానికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

అంతేకాదు ఈ గ్రహం ఎర్రగా ఉండటానికి.. ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే అంగారక దోషం ఉండేవారు ఆ గ్రహ విముక్తి కోసం ప్రపంచంలోని నలుమూలల నుండి ఇక్కడకు వస్తారు. ఈ సందర్భంగా ఆ దేవాలయం మరియు అంగారకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

శివుని వరం..
స్కందపురాణాలంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుండి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురడనే రాక్షసుడికి శివుడు వరం ఇచ్చాడు. అనంతరం భక్తుల బాధలను తొలగించేందుకు పరమేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో యుద్ధం చేశారు. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ పోరాటం శివుని చెమట ధారలుగా ప్రవహించింది. ఆ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. ఆ తర్వాత పరమేశ్వరుడు అసురుడిని మట్టుబెట్టి కొత్తగా క్రియేట్ చేసిన అంగారకుడు రాక్షసుని రక్తపు చుక్కలను గ్రహించాడు.

ఎరుపు రంగులో ఎందుకంటే..
ఆ సమయంలో అంగారక భూమి ఎరుపు రంగులో ఉందని చెబుతారు పండితులు. అంతేకాదు.. చాలా దేవాలయాల్లో అంగారకుడిని పరమేశ్వరుని అవతారంగా భావించి ఆరాధిస్తారు. ఇలా అంగారకుడిని ప్రార్థించడం వల్ల ఎవరి జాతకంలో అయినా మంగళ దోషమేదైనా ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు. ఫలితంగా భక్తుల విపత్తులన్నింటినీ ఈ ఆలయం గ్రహిస్తుందని విశ్వసిస్తారు. అంగారకుడిని శివుడు-ప్రుధ్వీ పుత్రుడు అని కూడా అంటారు. అందుకే అంగారకుని ఆలయంలో పరమేశ్వరుడిని పూజిస్తారు.

ప్రత్యేక పూజలు..
ముఖ్యంగా అంగారక చతుర్థి రోజు పరమేశ్వరుని ఆలయంలో యజ్ణయాగాదులు నిర్వహిస్తారు. ఈరోజున అంగారకుడిని ఆరాధించడం ద్వారా ఆయన సంత్రుప్తి చెందుతాడు. అంగారకుని శాంతి కోసం చాలా మంది దూర ప్రాంతాల నుండి ఉజ్జయిని నగరానికి వస్తుంటారు.

ఉజ్జయిని ఎక్కడుందంటే..
పైన చెప్పిన ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక రాజధాని అయిన ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయాన్ని మంగళనాథ్ దేవాలయమని అంటారు. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంగారకుడి తల్లి అని పిలుస్తారు. ఈ ఆలయానికి సరిగ్గా పైన ఉన్న ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని చాలా మంది విశ్వసిస్తారు. మత్స్యపురాణం, స్కంద పురాణాలలో అంగారకుడి గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారమే అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు.



Click it and Unblock the Notifications