Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...
అంగారకుడు ఎరుపు రంగులో ఎందుకని ఎక్కువగా పరిగణించబడతాడో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే అందులో అంగారక గ్రహానికి చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. అన్ని రాశుల వారు అంగారకుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు. పురాణాల ప్రకారం, శివుని దయ వల్ల అంగారకుడు జన్మించాడు.

అందుకే దీన్ని అంగారకుడి మాత్రుమూర్తి అని కూడా అంటారు. మన భారతదేశంలో నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి విభిన్నమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ఎరుపు రంగు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ మేము చెప్పబోయే దేవాలయానికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

అంతేకాదు ఈ గ్రహం ఎర్రగా ఉండటానికి.. ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే అంగారక దోషం ఉండేవారు ఆ గ్రహ విముక్తి కోసం ప్రపంచంలోని నలుమూలల నుండి ఇక్కడకు వస్తారు. ఈ సందర్భంగా ఆ దేవాలయం మరియు అంగారకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

శివుని వరం..
స్కందపురాణాలంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుండి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురడనే రాక్షసుడికి శివుడు వరం ఇచ్చాడు. అనంతరం భక్తుల బాధలను తొలగించేందుకు పరమేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో యుద్ధం చేశారు. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ పోరాటం శివుని చెమట ధారలుగా ప్రవహించింది. ఆ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. ఆ తర్వాత పరమేశ్వరుడు అసురుడిని మట్టుబెట్టి కొత్తగా క్రియేట్ చేసిన అంగారకుడు రాక్షసుని రక్తపు చుక్కలను గ్రహించాడు.

ఎరుపు రంగులో ఎందుకంటే..
ఆ సమయంలో అంగారక భూమి ఎరుపు రంగులో ఉందని చెబుతారు పండితులు. అంతేకాదు.. చాలా దేవాలయాల్లో అంగారకుడిని పరమేశ్వరుని అవతారంగా భావించి ఆరాధిస్తారు. ఇలా అంగారకుడిని ప్రార్థించడం వల్ల ఎవరి జాతకంలో అయినా మంగళ దోషమేదైనా ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు. ఫలితంగా భక్తుల విపత్తులన్నింటినీ ఈ ఆలయం గ్రహిస్తుందని విశ్వసిస్తారు. అంగారకుడిని శివుడు-ప్రుధ్వీ పుత్రుడు అని కూడా అంటారు. అందుకే అంగారకుని ఆలయంలో పరమేశ్వరుడిని పూజిస్తారు.

ప్రత్యేక పూజలు..
ముఖ్యంగా అంగారక చతుర్థి రోజు పరమేశ్వరుని ఆలయంలో యజ్ణయాగాదులు నిర్వహిస్తారు. ఈరోజున అంగారకుడిని ఆరాధించడం ద్వారా ఆయన సంత్రుప్తి చెందుతాడు. అంగారకుని శాంతి కోసం చాలా మంది దూర ప్రాంతాల నుండి ఉజ్జయిని నగరానికి వస్తుంటారు.

ఉజ్జయిని ఎక్కడుందంటే..
పైన చెప్పిన ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక రాజధాని అయిన ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయాన్ని మంగళనాథ్ దేవాలయమని అంటారు. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంగారకుడి తల్లి అని పిలుస్తారు. ఈ ఆలయానికి సరిగ్గా పైన ఉన్న ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని చాలా మంది విశ్వసిస్తారు. మత్స్యపురాణం, స్కంద పురాణాలలో అంగారకుడి గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారమే అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు.



Click it and Unblock the Notifications











