Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...
అంగారకుడు ఎరుపు రంగులో ఎందుకని ఎక్కువగా పరిగణించబడతాడో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే అందులో అంగారక గ్రహానికి చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. అన్ని రాశుల వారు అంగారకుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు. పురాణాల ప్రకారం, శివుని దయ వల్ల అంగారకుడు జన్మించాడు.

అందుకే దీన్ని అంగారకుడి మాత్రుమూర్తి అని కూడా అంటారు. మన భారతదేశంలో నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి విభిన్నమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ఎరుపు రంగు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ మేము చెప్పబోయే దేవాలయానికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

అంతేకాదు ఈ గ్రహం ఎర్రగా ఉండటానికి.. ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే అంగారక దోషం ఉండేవారు ఆ గ్రహ విముక్తి కోసం ప్రపంచంలోని నలుమూలల నుండి ఇక్కడకు వస్తారు. ఈ సందర్భంగా ఆ దేవాలయం మరియు అంగారకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

శివుని వరం..
స్కందపురాణాలంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుండి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురడనే రాక్షసుడికి శివుడు వరం ఇచ్చాడు. అనంతరం భక్తుల బాధలను తొలగించేందుకు పరమేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో యుద్ధం చేశారు. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ పోరాటం శివుని చెమట ధారలుగా ప్రవహించింది. ఆ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. ఆ తర్వాత పరమేశ్వరుడు అసురుడిని మట్టుబెట్టి కొత్తగా క్రియేట్ చేసిన అంగారకుడు రాక్షసుని రక్తపు చుక్కలను గ్రహించాడు.

ఎరుపు రంగులో ఎందుకంటే..
ఆ సమయంలో అంగారక భూమి ఎరుపు రంగులో ఉందని చెబుతారు పండితులు. అంతేకాదు.. చాలా దేవాలయాల్లో అంగారకుడిని పరమేశ్వరుని అవతారంగా భావించి ఆరాధిస్తారు. ఇలా అంగారకుడిని ప్రార్థించడం వల్ల ఎవరి జాతకంలో అయినా మంగళ దోషమేదైనా ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు. ఫలితంగా భక్తుల విపత్తులన్నింటినీ ఈ ఆలయం గ్రహిస్తుందని విశ్వసిస్తారు. అంగారకుడిని శివుడు-ప్రుధ్వీ పుత్రుడు అని కూడా అంటారు. అందుకే అంగారకుని ఆలయంలో పరమేశ్వరుడిని పూజిస్తారు.

ప్రత్యేక పూజలు..
ముఖ్యంగా అంగారక చతుర్థి రోజు పరమేశ్వరుని ఆలయంలో యజ్ణయాగాదులు నిర్వహిస్తారు. ఈరోజున అంగారకుడిని ఆరాధించడం ద్వారా ఆయన సంత్రుప్తి చెందుతాడు. అంగారకుని శాంతి కోసం చాలా మంది దూర ప్రాంతాల నుండి ఉజ్జయిని నగరానికి వస్తుంటారు.

ఉజ్జయిని ఎక్కడుందంటే..
పైన చెప్పిన ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక రాజధాని అయిన ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయాన్ని మంగళనాథ్ దేవాలయమని అంటారు. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంగారకుడి తల్లి అని పిలుస్తారు. ఈ ఆలయానికి సరిగ్గా పైన ఉన్న ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని చాలా మంది విశ్వసిస్తారు. మత్స్యపురాణం, స్కంద పురాణాలలో అంగారకుడి గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారమే అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు.



Click it and Unblock the Notifications