Just In
- 1 hr ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 2 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 6 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
- 7 hrs ago కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
శరీరంలోకి వచ్చి ఆవహించే భూత-ప్రేతాత్మను తరిమికొట్టే దేవాలయాలు మీకు తెలుసా?
భయపెట్టే సినిమాలు చూసినప్పుడు మీలో ఎంతమందికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి ? భయపెట్టే సినిమాలు మాములుగా విపరీతమైన ఉద్రేకాన్ని కలిగిస్తాయి. కానీ, వాటిని నిజంగా చూసినప్పుడు మీరు ఏమి చేయలేరు అనే భావన కలిగించేలా ఒక స్థితికి చేరుస్తాయి.
రోమన్ కేథలిక్ మతాధికారులు భూత వైద్యం చేయడంలో విపరీతమైన పేరు గాంచారు అనే సత్యం చాలామందికి తెలుసు.
మన భారత దేశంలో ప్రముఖ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల్లో భూతవైద్యాన్ని బాహాటంగానే నిర్వహిస్తారు. అటువంటి ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ప్రజలు తాము ఎవరో స్వాధీనంలో ఉన్నామని భావించి అటువంటి వాళ్ళ చెర నుండి బయటపడటానికి ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు.
షాక్: మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని తెలిపే సంకేతాలివే.. !!
ఇటువంటి ప్రజలు అనుభవిస్తున్న బాధను గనుక మనం కళ్లారా చూస్తే కన్నీళ్లు ఆగవు మరియు ఆ చూసినప్పుడు కలిగే భావన మనల్ని విపరీతమైన ఆందోళనకు గురిచేస్తుంది. భారత దేశంలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు భూతవైద్యానికి విపరీతమైన పేరు సంపాదించాయి అనే విషయాన్ని మరింత లోతుగా తెలుసుకొనే ముందు ఆ యొక్క ప్రక్రియ గురుంచి మరింత విపులంగా ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు భూత వైద్యం అంటే ఏమిటి ?
కేథలిక్ ఎన్సైక్లోపీడియా ( సమస్త్ర శాస్త్రము) ప్రకారం భూతవైద్యం అంటే " వ్యక్తులు, ప్రదేశాలు లేదా వస్తువులు ఇలా వేటిలోనైనా లేదా వేటికైనా దెయ్యం పట్టిందని లేదా చెడ్డ శక్తులతో నిండిపోయి ఉందని భావిస్తారో లేదా వీరందరూ దుర్భుద్దికి బాధితులుగా లేదా పరికరాలుగా మారుతారో అటువంటి విచిత్ర పరిస్థితి నుండి బయటపడేస్తూ, వాళ్ళల్లో ఉన్న దెయ్యాలను లేదా చెడ్డ శక్తులను లేదా చెడు ఆత్మలను బయటకు పారద్రోలి పరిపూర్ణ మనిషిని చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది".
ప్రపంచంలో దయ్యాలకు ఫేమస్ అయిన సిటీస్..!!
ఎన్ని రకాల భూత వైద్యలు ఉన్నాయో మీకు తెలుసా ?
బాప్తిస్మల్ భూతవైద్యం :
ఈ రకమైన భూత వైద్యంలో, చిన్న పిల్లలు గతజన్మలో చేసిన పాపాల నుండి విముక్తిని కలిగించడానికి బాపిటైజింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ భూత వైద్యం చేస్తారు.
సాధారణ భూతవైద్యం :
ఏదైనా పరిసరాలను లేదా వస్తువులను దెయ్యాల యొక్క ప్రభావం నుండి బయటపడేయటానికి ఈ రకమైన భూత వైద్యాన్ని ఉపయోగిస్తారు.
నిజమైన భూత వైద్యం :
ఈ యొక్క భూతవైద్యం ద్వారా ఏదైనా వ్యక్తి యొక్క శరీరంలో ఉండే భూతాన్ని బయటకు పంపించి, ఆయా వ్యక్తులను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఎవరైతే ఈ యొక్క దెయ్యాల భారినపడి వాటి యొక్క అధీనంలో ఉంటారో, అటువంటి వారి పై ఈ భూత వైద్యాన్ని ప్రయోగించినప్పుడు ఆయా వ్యక్తులకు శారీరిక హాని కలగొచ్చు మరియు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మరణించే అవకాశం కూడా ఉంది.
దెయ్యానికి ఆహారంగా మారడం :
ఎప్పుడైతే దెయ్యం ఒక వ్యక్తిని బాధితుడిగా మార్చి ఆహారంగా తీసుకోవాలని భావిస్తుందో, అటువంటి సందర్భాల్లో విభిన్నమైన భూత వైద్యాన్ని చేయవలసి ఉంటుంది. ఆ సందర్భంలో పూజారి దెయ్యాలతో నేరుగా మాట్లాడి, ఆత్మల నుండి వాటిని పారద్రోలాలని ప్రయత్నిస్తాడు.
ఇప్పుడు మనం భారత దేశంలో ఉండే కొన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాలు ఆచరించే భూతవైద్యం గురించి తెలుసుకుందాం.
శ్రీ మెహేందిపూర్ బాలాజీ :
ఈ పుణ్యక్షేత్రానికి ఒకసారి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడి గాయాలతో కూడిన జ్ఞాపకాలు మిమ్మల్ని అలా వెంటాడుతూనే ఉంటాయి. ఈ దేవాలయం భూత వైద్య ఆచారాలకు ఎంతో పేరుగాంచింది మరియు మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అక్కడ గోడలకు గొలుసు లతో కట్టబడిన వ్యక్తులను చూడవచ్చు. ఆయా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దెయ్యం భారి నుండి తమను తాము కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో బాగా మరుగుతున్న వేడి నీటిని కూడా వారిపై వారే పోసేసుకుంటారు.
హజరత్ సయ్యద్ అలీ మీరా డాటర్ దర్గా, గుజరాత్ :
ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఏ కులం వారైనా వెళ్ళవచ్చు. ఆ పుణ్యక్షేత్రం లోపలికి ఎప్పుడైతే మీరు అడుగుపెడతారో, ఆ సమయంలో దెయ్యం పూనింది అని చెప్పబడే వ్యక్తుల యొక్క అరుపులు మరియు ఏడుపులు విపరీతంగా వినపడుతుంటాయి. ఎవరైతే మరీ ఎక్కువ క్రూరంగా వ్యవహరిస్తుంటారో, అటువంటి వారిని గొలుసు లతో కట్టివేస్తారు మరియు దెయ్యాల భారి నుండి బయటపడటానికి చాలా మంది స్త్రీ పురుషులు అక్కడ నేల పై దొర్లుతూ కనిపిస్తారు.
దేవ్ జి మహారాజ్ మందిర్, మలజ్ పూర్ :
భారత్ దేశంలో ' భూత్ మేళ ' ను ప్రతి సంవత్సరం నిర్వహించే అతి తక్కువ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. తాము ప్రేమించే వ్యక్తుల నుండి భూతాన్ని తరిమివేయాలి లేదా పారద్రోలాలి అనే ఉద్దేశ్యంతో వారికి వ్యాధికి నయంకావలి అనే ఆశతో పౌర్ణమి రోజు రాత్రి ఎంతో మంది వస్తుంటారు. ఈ పుణ్యక్షేత్రంలో ఎవరైతే చెడ్డ శక్తుల భారినపడ్డారో, వారు తమ శరీరం నుండి వాటిని పారద్రోలడానికి కర్పూరాన్ని అరచేతితో పెట్టి వెలిగిస్తారు మరియు అక్కడున్న వ్యక్తులు పవిత్ర చీపుర్లతో వారిని తుడుస్తారు.
దత్తాత్రేయ మందిర్, గంగాపూర్ :
ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉదయం పదకొండున్నర గంటలకు మహామంగల్ హారతి మొదలవుతుంది. ఈ సమయంలో భూతవైద్యం మొదలుపెడతుంటారు. ఎప్పుడైతే ఇది మొదలవుతుందో ఆ సమయంలో చెడ్డ శక్తులు ఆవహించిన వ్యక్తులు బిగ్గరగా అరుస్తూ మరియు కేకలుపెడుతూ దేవుణ్ణి తిడుతూ ఉంటారు. చాలామంది దెయ్యం పట్టిన వ్యక్తులు అక్కడి స్తంభాలను కూడా ఎక్కేస్తుంటారు. ఆ దేవాలయం నుండి తమని పంపించేయాలనే ఉద్దేశ్యంతో ఆయా వ్యక్తులు ఇలా చేస్తుంటారు.
నిజాముద్దీన్ దర్గా, ఢిల్లీ :
దెయ్యం పట్టిన వ్యక్తులను చూడగలను అనే దైర్యం మీలో విపరీతంగా గనుక ఉంటే, మీరు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ దర్గా లో ప్రజలు సూఫీ దేవుడికి ప్రార్ధనలు చేస్తారు. అక్కడ ఉన్న ఖవాలీ లో ఉన్న మందిరం లో ఎక్కడైతే భూత వైద్యం చేస్తుంటారో, అక్కడి నుండి అనూహ్యంగా విపరీతమైన ఏడుపులు మరియు అరుపులు వినపడుతుంటాయి.
Image Courtesy: Exorcism Nights