Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
మీకు నాగదోషం ఉందా.. ఈ ఆలయంలో చేసే పూజతో సమస్య తొలగిపోతుంది
కొంత మంది ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధాలు కుదరవు. సంవత్సరాల తరబడి సంబంధాల కోసం ఎదురుచూసినా ఒక్కటీ సెట్ కాక ఇబ్బంది పడిపోతుంటారు చాలా మంది. 27, 28 సంవత్సరాలకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడితే 30 ఏళ్లు దాటినా ఒక్క సంబంధం కూడా ఖాయం కాదు. మరికొందరేమో పెళ్లయ్యాక పిల్లలు లేక సమస్య ఎదుర్కొంటారు.
ఓ వైపు కుటుంబసభ్యుల ఒత్తిడి, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు. ఏ సమస్యా లేదంటారు.. కానీ గర్భం దాల్చలేరు. ఇవి నాగదోషం వల్ల కలిగే సమస్యలు. పూర్వ జన్మల్లో పాములను చంపిన వార, ఔషాధాలతో సర్పాలను బంధించినవారు, పుట్టలను తవ్వేవారు, పుట్టలను తొలగించి ఇల్లు కట్టుకునే వారికి నాగదోషం తగులుతుందని అంటారు.

నాగదోష సమస్యలు:
నాగ దోషం ఉన్న వారు సంతానం, కుటుంబం, అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని జ్యోతిష్యం చెబుతోంది. నాగదోషం ఉంటే వివాహాలు కూడా కావు. సంతానం కూడా సమయానికి కాక ఇబ్బంది పడతారు. జాతకచక్రంలోని రాహువు లేదా కేతువు 1,2, 5, 7, 8 స్థాన్లోల ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాల్లో ఉంటే నాగదోషం లేదా సర్పదోషం ఉందని అంటారు.
నాగదోషం తొలగిపోవాలంటే నివారణలు, పరిహారాలు చేయడం ముఖ్యం. నాగదోషంతో ఇబ్బంది పడేవారు మోపీదేవి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజ చేస్తే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి నాగదోష నివారణ పూజ కోసం నిత్యం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కృష్ణా జిల్లాలో దివి సీమకు చెందిన మండలం మోపీదేవి. ఈ ప్రాంతం మచిలీపట్నంకు 30 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మోహినీపురమని, సర్పక్షేత్రమని కూడా పిలుస్తారు.
సర్పరూపంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి:
మోపీదేవి ఆలయం విశిష్టమైనది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సర్పరూపంలో వెలిశాడు. అలాగే ఈ ఆలయంలో శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరూ ఒకేచోట కొలువుదీరి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. నాగుల పంచమి రోజుల ఈ విశిష్టత క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు చేస్తుంటారు.
స్వయంభుగా వెలిసిన స్వామివారు:
మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ క్షేత్రం గురించి స్కందపురాణంలోనూ ప్రస్తావించారు. ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. రాహు కేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి వారు పూజలు అందుకుంటున్నారు. ఆలయ గర్భగుడిలో సర్పాల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై శివుడు కనిపిస్తాడు. దీనినే పానపట్టం అని కూడా పిలుస్తుంటారు. స్వామివారి పానపట్టలంలోని ఓ కన్నం నుంచి ఏటా ఒక సారి నాగు పాము బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుందని భక్తులు నమ్ముతారు.
సర్పదోషం, సంతానలేమికి ప్రత్యేక పూజలు:
సర్పదోషంతో బాధపడేవారు, వివాహం జరగకా సమస్య ఎదుర్కొనేవారు, సంతానం లేని దంపతులు, కెరీర్ లో వృద్ధి కోరుకునే వారు, మంచి జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు, వ్యాపార వృద్ధి కోరుకునే వారు ఈ మోపీదేవి ఆలయంలో చేసే ప్రత్యేక పూజల వల్ల విశేషమైన ఫలితం పొందుతారని భక్తుల విశ్వాసం.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications