Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
Ratha saptami 2025: రేపు ఈ సమయంలో ఈ పనులు చేస్తే ఊహించనంత డబ్బు మీ సొంతం.. మీపై సాక్షాత్తు సూర్యుడి అనుగ్రహం!
హిందూ సంప్రదాయాల్లో రథ సప్తమికి విశేషమైన స్థానం ఉంది. ఈ రథసప్తమిని, రథ ఆరోగ్య సప్తమిగా కూడా పిలుస్తారు. ఈరోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజున సూర్యుడిని పూజించడం వలన ఏడు జన్మల పాపాలు తొలిగిపోవడంతో పాటు ఆదాయం పెరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఏడాది పొడవునా వచ్చే రథ సప్తమితో పోలిస్తే, మకర సంక్రాంతి తరువాత వచ్చే రథ సప్తమి నాడు ప్రత్యక్ష దేవుడైన సూర్య భగవానుడిని పూజించడం వలన మంచి ఫలితాలు వస్తాయట. అయితే ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు సూర్యుడిని పూజించాలి? సూర్యుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రథ సప్తమని ఎప్పుడంటే?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రథ సప్తమి రెండు రోజుల్లో వచ్చింది. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో ఈ సప్తమి యొక్క ఘడియలు ఉన్నాయి. కానీ రథ సప్తమిని ఫిబ్రవరి 4వ తేదీనే జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రథ సప్తమిని తిథి ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 7:56 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 5:29 గంటల వరకు ఉంటుంది. కానీ ఫిబ్రవరి 5వ తేదీన సూర్యోదయం 6:36 గంటలకు అవుతుంది. దానికి ముందే రథ సప్తమి తిథి ముగుస్తుండడంతో, ఫిబ్రవరి 5న జరుపుకోలేరు. కేవలం ఫిబ్రవరి 4వ తేదీన మాత్రమే ఈ పండగను జరుపుకునేందుకు వీలుంటుంది. ఆరోజు ఉదయం 7:56 గంటల తరువాత రథ సప్తమిని జరుపుకోవచ్చు.

రథసప్తమి రోజున ఏం చేయాలంటే?
రథసప్తమి పర్వదినంలో ముఖ్యంగా చేయవలసిన పనుల గురించి చెప్పుకుంటే, ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయని వేదాలొ, పురాణాలొ పేర్కొంటున్నారు. ముఖ్యంగా, సూర్యునికి దానం చేసినప్పుడు ఆయన ప్రసన్నుడై, శ్రేష్టమైన ఫలితాలను అనుగ్రహిస్తాడు. రథసప్తమి రోజున పేద బ్రాహ్మణులకు పప్పు, బెల్లం, గోధుమలు, రాగి, ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ఇవ్వడం చాలా ముఖ్యం.
ఈ రోజు ఉదయం నదిలో స్నానమాచరించి, సూర్యుని పూజ చేసి, ఉపవాస దీక్షతో దానధర్మాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల, ఏడు జన్మల పాపాలు నశించి, పుణ్యాల సమృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజున సూర్యునికి ఆరాధన చేస్తే దీర్ఘాయువు, ధనసంపద మరియు కుటుంబసుఖం పొందుతారని శాస్త్రాలొ సూచిస్తారు. ఈ సారి రథసప్తమి నాడు బ్రహ్మయోగం మరియు భరణి నక్షత్రం కూడా ఉన్నందున ఈ రోజు మరింత పవిత్రమైనది అని భావిస్తారు.



Click it and Unblock the Notifications











