Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
Ratha saptami 2025: రేపు ఈ సమయంలో ఈ పనులు చేస్తే ఊహించనంత డబ్బు మీ సొంతం.. మీపై సాక్షాత్తు సూర్యుడి అనుగ్రహం!
హిందూ సంప్రదాయాల్లో రథ సప్తమికి విశేషమైన స్థానం ఉంది. ఈ రథసప్తమిని, రథ ఆరోగ్య సప్తమిగా కూడా పిలుస్తారు. ఈరోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజున సూర్యుడిని పూజించడం వలన ఏడు జన్మల పాపాలు తొలిగిపోవడంతో పాటు ఆదాయం పెరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఏడాది పొడవునా వచ్చే రథ సప్తమితో పోలిస్తే, మకర సంక్రాంతి తరువాత వచ్చే రథ సప్తమి నాడు ప్రత్యక్ష దేవుడైన సూర్య భగవానుడిని పూజించడం వలన మంచి ఫలితాలు వస్తాయట. అయితే ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు సూర్యుడిని పూజించాలి? సూర్యుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రథ సప్తమని ఎప్పుడంటే?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రథ సప్తమి రెండు రోజుల్లో వచ్చింది. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో ఈ సప్తమి యొక్క ఘడియలు ఉన్నాయి. కానీ రథ సప్తమిని ఫిబ్రవరి 4వ తేదీనే జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రథ సప్తమిని తిథి ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 7:56 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 5:29 గంటల వరకు ఉంటుంది. కానీ ఫిబ్రవరి 5వ తేదీన సూర్యోదయం 6:36 గంటలకు అవుతుంది. దానికి ముందే రథ సప్తమి తిథి ముగుస్తుండడంతో, ఫిబ్రవరి 5న జరుపుకోలేరు. కేవలం ఫిబ్రవరి 4వ తేదీన మాత్రమే ఈ పండగను జరుపుకునేందుకు వీలుంటుంది. ఆరోజు ఉదయం 7:56 గంటల తరువాత రథ సప్తమిని జరుపుకోవచ్చు.

రథసప్తమి రోజున ఏం చేయాలంటే?
రథసప్తమి పర్వదినంలో ముఖ్యంగా చేయవలసిన పనుల గురించి చెప్పుకుంటే, ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయని వేదాలొ, పురాణాలొ పేర్కొంటున్నారు. ముఖ్యంగా, సూర్యునికి దానం చేసినప్పుడు ఆయన ప్రసన్నుడై, శ్రేష్టమైన ఫలితాలను అనుగ్రహిస్తాడు. రథసప్తమి రోజున పేద బ్రాహ్మణులకు పప్పు, బెల్లం, గోధుమలు, రాగి, ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ఇవ్వడం చాలా ముఖ్యం.
ఈ రోజు ఉదయం నదిలో స్నానమాచరించి, సూర్యుని పూజ చేసి, ఉపవాస దీక్షతో దానధర్మాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల, ఏడు జన్మల పాపాలు నశించి, పుణ్యాల సమృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజున సూర్యునికి ఆరాధన చేస్తే దీర్ఘాయువు, ధనసంపద మరియు కుటుంబసుఖం పొందుతారని శాస్త్రాలొ సూచిస్తారు. ఈ సారి రథసప్తమి నాడు బ్రహ్మయోగం మరియు భరణి నక్షత్రం కూడా ఉన్నందున ఈ రోజు మరింత పవిత్రమైనది అని భావిస్తారు.



Click it and Unblock the Notifications