Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
Ratha saptami 2025: రేపు ఈ సమయంలో ఈ పనులు చేస్తే ఊహించనంత డబ్బు మీ సొంతం.. మీపై సాక్షాత్తు సూర్యుడి అనుగ్రహం!
హిందూ సంప్రదాయాల్లో రథ సప్తమికి విశేషమైన స్థానం ఉంది. ఈ రథసప్తమిని, రథ ఆరోగ్య సప్తమిగా కూడా పిలుస్తారు. ఈరోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజున సూర్యుడిని పూజించడం వలన ఏడు జన్మల పాపాలు తొలిగిపోవడంతో పాటు ఆదాయం పెరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఏడాది పొడవునా వచ్చే రథ సప్తమితో పోలిస్తే, మకర సంక్రాంతి తరువాత వచ్చే రథ సప్తమి నాడు ప్రత్యక్ష దేవుడైన సూర్య భగవానుడిని పూజించడం వలన మంచి ఫలితాలు వస్తాయట. అయితే ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు సూర్యుడిని పూజించాలి? సూర్యుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రథ సప్తమని ఎప్పుడంటే?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రథ సప్తమి రెండు రోజుల్లో వచ్చింది. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో ఈ సప్తమి యొక్క ఘడియలు ఉన్నాయి. కానీ రథ సప్తమిని ఫిబ్రవరి 4వ తేదీనే జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రథ సప్తమిని తిథి ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 7:56 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 5:29 గంటల వరకు ఉంటుంది. కానీ ఫిబ్రవరి 5వ తేదీన సూర్యోదయం 6:36 గంటలకు అవుతుంది. దానికి ముందే రథ సప్తమి తిథి ముగుస్తుండడంతో, ఫిబ్రవరి 5న జరుపుకోలేరు. కేవలం ఫిబ్రవరి 4వ తేదీన మాత్రమే ఈ పండగను జరుపుకునేందుకు వీలుంటుంది. ఆరోజు ఉదయం 7:56 గంటల తరువాత రథ సప్తమిని జరుపుకోవచ్చు.

రథసప్తమి రోజున ఏం చేయాలంటే?
రథసప్తమి పర్వదినంలో ముఖ్యంగా చేయవలసిన పనుల గురించి చెప్పుకుంటే, ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయని వేదాలొ, పురాణాలొ పేర్కొంటున్నారు. ముఖ్యంగా, సూర్యునికి దానం చేసినప్పుడు ఆయన ప్రసన్నుడై, శ్రేష్టమైన ఫలితాలను అనుగ్రహిస్తాడు. రథసప్తమి రోజున పేద బ్రాహ్మణులకు పప్పు, బెల్లం, గోధుమలు, రాగి, ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ఇవ్వడం చాలా ముఖ్యం.
ఈ రోజు ఉదయం నదిలో స్నానమాచరించి, సూర్యుని పూజ చేసి, ఉపవాస దీక్షతో దానధర్మాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల, ఏడు జన్మల పాపాలు నశించి, పుణ్యాల సమృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజున సూర్యునికి ఆరాధన చేస్తే దీర్ఘాయువు, ధనసంపద మరియు కుటుంబసుఖం పొందుతారని శాస్త్రాలొ సూచిస్తారు. ఈ సారి రథసప్తమి నాడు బ్రహ్మయోగం మరియు భరణి నక్షత్రం కూడా ఉన్నందున ఈ రోజు మరింత పవిత్రమైనది అని భావిస్తారు.



Click it and Unblock the Notifications











