Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
భాస్మాసురుడిని అంతమొందించడానికి మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు
ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం. అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం. శాపమిచ్చినప్పుడు శాపంగానూ, వరమిచ్చినప్పుడు వరంగానూ పనిచేయడం సహజం. కానీ ఒక్కోసారి వరాలు శాపాలుగా, శాపాలు వరాలుగా మారుతాయి.
శాపం తిట్టులాంటిది. వరం దీవెన లాంటిది. చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం, పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరం. పాపాలు శాపాలై కాటు వేస్తే, పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి.అదేలాగో తెలుసుకోవాలంటే హిందూ పురాణాల్లోని ఒక కథను మీరు చదివి తెలుసుకోవాల్సిందే. కథేంటంటారా..వరాన్ని, శాపంగా మార్చుకొన్నబస్మాసుర కథ.. ఎలాగో కథ చదవండి...
READ MORE: రామాయణంలో కుంబకర్ణుడి మరణం కథ..!

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
హిందూ పురాణాలలో భాస్మసురిని కధలో శివుడు లేదా భస్మాసురుడు, మోహిని ఉంటారు. భారతీయ పురాణాలలో దేవతలు, రాక్షసుల మధ్య శత్రుత్వం గురించి వివరించబడింది. రాక్షసులు ఎప్పుడూ సమస్యలను సృష్టించే క్రూరమైన, ప్రమాదకరమైనవారైతే, దేవతలు ప్రత్యేకంగా స్వర్గంలో ఉండేవారని భావిస్తారు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
పురాణాల ప్రకారం, అలాంటి రాక్షసులను సంహరించడం దేవతల పని.భస్మాసురుని కధ చాలా పేరుగాంచింది. భస్మాసురుడు శివుని భక్తుడు. అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు కారణంగా, మహాదేవుడు కరుణించి, ఒక వరం కోరుకొమ్మన్నాడు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు, కానీ శివుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన కోరుకున్న వరం పద్ధతిని మార్చుకున్నాడు. భాస్మసురుడి తలను తమ చూపుడు వేలుతో తాకితే, వెంటనే కాలిపోయి, బూడిద (భస్మ) అవుతాడు. అది అతని డిమాండ్. శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
భస్మాసురుడు చాలా సంతోషించి, అధిక సంతోషంతో, మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని తనమీద తనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే, అతను తన బొటన వేలితో శివుని తలను తాకాలి అనుకున్నాడు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
వెంటనే శివుడు కాలిపోయి, బూడిదైతే పార్వతిని చేపట్టాలి అనుకున్నాడు. శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి భస్మాసురుడు అనుసరించాడు. చివరికి, శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి, ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరాడు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
శివుడి సమస్యను విని, మహావిష్ణు అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. విష్ణు మూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి, ముందు దయ్యంగా కనిపిస్తాడు. మోహిని ఎంత అందంగా ఉంటుందంటే, భస్మాసురుడు వెంటనే ఆమెకు ఆకర్షితుడౌతాడు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
భస్మాసురుడు, మోహినిని పెళ్ళిచేసుకోమని కోరతాడు. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం, నృత్యంలో తనకు సాటిగా ఉన్నవాళ్ళను పెళ్లిచేసుకుంటానని చెప్తుంది. భస్మాసురుడు ;అందుకు అంగీకరించి, నృత్యం ప్రారంభిస్తాడు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
భస్మాసురుడు, మోహిని అడుగులకు, అడుగులను కలిపాడు, నృత్యం చేసే సమయంలో, మోహిని తన బొటన వేలిని తన తలకు తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు ఆమెను అనుసరించాడు, అతను తన బొటన వేలిని తన తలపై ఆంచాడు, వెంటనే అతను కాలి, బూడిదైపోయాడు, తన కోరుకున్న వరాన్ని ఈ విధంగా పొందాడు.

మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర
ఈ కధకు సంబంధించి కొద్ది తేడాలు ఉన్నాయి. కానీ కధ సారాంశంలో తేడాలేదు. "కోరుకున్న వరం భస్మాసురుడు పొందాడు" అన్న నానుడి ఈ కధ ఆధారంగా పుట్టింది. తనపన్లు తనకే ఎదురుతిరిగి, విధ్వంసకరంగా మరే లక్షణాన్ని ఇది సూచిస్తుంది.



Click it and Unblock the Notifications











