Latest Updates
-
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది!
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.!
జులై 25న శనివారం తొలి ఏకాదశి పర్వదినం. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకం. ఆ రోజు శ్రీ విష్ణుమూర్తి క్షీర సాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలల తర్వాత మేల్కొంటారు. అందుకే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి, స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం సమర్పిస్తారు. లక్ష్మీదేవితో పాటు తులసీ దేవి పూజ కూడా ప్రత్యేకం. మరి ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టుకోవాలి, తులసి పూజ ఎలా చేసుకోవాలి.. నియమాలు చూద్దాం..

పేలాల లడ్డూ ప్రసాదం
తొలి ఏకాదశి నాడు శ్రీమహా విష్ణుమూర్తిని పూజించిన అనంతరం స్వామి వారికి ఇష్టమైన లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. జొన్న, మొక్కజొన్న పేలాల పిండి లడ్డూలు, రవ్వ లడ్డూలు, బియ్యపు పిండి లడ్డూలను బెల్లంతో తయారుచేసి నివేదిస్తారు. వీటిని విష్ణుమూర్తికి ఇష్టమైనవిగా పరిగణిస్తారు.
తులసీ పూజ
తొలి ఏకాదశి రోజు లక్ష్మీదేవి స్వరూపమైన తులసీ పూజకు ప్రత్యేకత ఉంది. ఈ రోజు తులసీ దేవిని ఆరాధిస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించిన ముందుగా శ్రీ మహా విష్ణువుని పూజించాలి. అనంతరం తులసి మొక్క చుట్టూ ప్రదేశాన్ని శుభ్రం చేసి నీటితో అభిషేకించిన అనంతరం నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి పూలు, నైవేద్యం సమర్పించాలి.

పూజలో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి విష్ణు మంత్రాలను జపిస్తూ పూజించాలి. అనంతరం శ్రీ మహా విష్ణువుకి తులసీ దళాలను సమర్పించాలి. ఇలా చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. నిస్వార్థం లేని కోరికలను మీ మనసులో స్వామి వారికి విన్నవించుకోవాలి. సాయంత్రం సమయంలోనూ ఇలా దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి, ధైర్యం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధించి, కుటుంబంలో సుఖ శాంతులు, సంతోషం వర్ధిల్లుతాయని పండితులు సూచిస్తున్నారు.
ఉపవాస విరమణ
తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసే వారు మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమించాలి. ఆ రోజు అవసరంలో ఉన్న వారికి దానం చేయడం పుణ్యఫలాలను ఇస్తుంది. గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాల వంటి ఆహార పదార్థాలను దానం చేయడం ద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. పండ్లు, వస్త్రాలను దానం చేయండి. అవసరంలో ఉన్న వారికి పసుపు రంగు వస్తువులు దానం చేయడం శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. గోవులకు సేవ చేయడం, ఆధ్యాత్మిక భావనలో ఉండటం సుఖశాంతులను ఇస్తుంది.



Click it and Unblock the Notifications