Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హిందు సంప్రదాయంలో పంచ మహా పాతకాలు అంటే ఏమిటి?
బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చ
పంచమహా పాతకాలు అంటే బ్రహ్మపురాణంలో వ్యాసుడిలా చెప్పాడు. పాతకాలలో ఐదింటిని ''మహాపాతకాలు'' అని అంటారు . ఈ పంచ మహా పాతకములకు నిష్క్రుతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు ఏవంటే..?

స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము

ఇక బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపాలు క్రమంగా హిరిస్తాయి. అందుకు ఉదాహరణగా కోసల దేశపు రాజు గోహాత్యాపాతంలో ఇరుకొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.
ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించిన్పుడు, రాజు బీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కానీ ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు .

దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలో పడి మరణించింది. బావి చుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు.
ఈ పాపం ఎవరిదనే చర్చసాగింది. అజాగ్రత్తగా ఉన్న పసుశులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరికొందరన్నారు .

ఈ సంగతి తెలిసిన రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే-రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు దక్కుతుంది.
అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుందిజ . కానీ ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును.

పది రోజులు దీక్షతో ఉండి, పుణ్య క్షేత్రాలు దర్శంచి, ఉత్తమ దానములు చేయమని చెప్పారు . రాజు అలాగే చేశాడు.



Click it and Unblock the Notifications











