Latest Updates
-
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే!
హిందు సంప్రదాయంలో పంచ మహా పాతకాలు అంటే ఏమిటి?
బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చ
పంచమహా పాతకాలు అంటే బ్రహ్మపురాణంలో వ్యాసుడిలా చెప్పాడు. పాతకాలలో ఐదింటిని ''మహాపాతకాలు'' అని అంటారు . ఈ పంచ మహా పాతకములకు నిష్క్రుతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు ఏవంటే..?

స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము

ఇక బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపాలు క్రమంగా హిరిస్తాయి. అందుకు ఉదాహరణగా కోసల దేశపు రాజు గోహాత్యాపాతంలో ఇరుకొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.
ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించిన్పుడు, రాజు బీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కానీ ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు .

దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలో పడి మరణించింది. బావి చుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు.
ఈ పాపం ఎవరిదనే చర్చసాగింది. అజాగ్రత్తగా ఉన్న పసుశులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరికొందరన్నారు .

ఈ సంగతి తెలిసిన రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే-రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు దక్కుతుంది.
అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుందిజ . కానీ ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును.

పది రోజులు దీక్షతో ఉండి, పుణ్య క్షేత్రాలు దర్శంచి, ఉత్తమ దానములు చేయమని చెప్పారు . రాజు అలాగే చేశాడు.



Click it and Unblock the Notifications











