Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
హిందు సంప్రదాయంలో పంచ మహా పాతకాలు అంటే ఏమిటి?
బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చ
పంచమహా పాతకాలు అంటే బ్రహ్మపురాణంలో వ్యాసుడిలా చెప్పాడు. పాతకాలలో ఐదింటిని ''మహాపాతకాలు'' అని అంటారు . ఈ పంచ మహా పాతకములకు నిష్క్రుతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు ఏవంటే..?

స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము

ఇక బుద్ది పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలిజ అలా కాకుండా తెలియక ప్రమాద వశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధానాలున్నాయి. శాస్త్రపకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపాలు క్రమంగా హిరిస్తాయి. అందుకు ఉదాహరణగా కోసల దేశపు రాజు గోహాత్యాపాతంలో ఇరుకొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.
ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించిన్పుడు, రాజు బీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కానీ ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు .

దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలో పడి మరణించింది. బావి చుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు.
ఈ పాపం ఎవరిదనే చర్చసాగింది. అజాగ్రత్తగా ఉన్న పసుశులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరికొందరన్నారు .

ఈ సంగతి తెలిసిన రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే-రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు దక్కుతుంది.
అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుందిజ . కానీ ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును.

పది రోజులు దీక్షతో ఉండి, పుణ్య క్షేత్రాలు దర్శంచి, ఉత్తమ దానములు చేయమని చెప్పారు . రాజు అలాగే చేశాడు.



Click it and Unblock the Notifications