Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
తథాస్తు దేవతలు అంటే ఎవరో తెలుసా!..వాళ్లు తిరిగే టైం అదేనంట
సాధారణంగా మనం చాలాసందర్భాలలో ముఖ్యంగా సాయంత్ర వేళల్లో మాట్లాడే సమయంలో ఏవైనా అమంగళకరమైన మాటలు అంటుంటే మన పెద్దలు పైన తథాస్తు దేవలు ఉంటారు,వారు తథాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని మనల్ని హెచ్చరించడం చాలా సందర్భాలలో చూసి ఉంటాం. ఇలా ఎందుకు అంటారో చాలామందికి తెలియకపోవచ్చు. మన నోటి గుండా వచ్చే మాటలకు తథాస్తు అని దేవతలు అంటే ఆ విషయం అలాగే జరగుతుందని.. ఆమోద ముద్ర వేయడం ఈ దేవతలు చేసే పని అని చెప్తుంటారు. తథ అంటే అప్రకారంగా.. అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం.
మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు. ఇలా తథాస్తు అనే వారినే తథాస్తు దేవతలు అని అంటారు. అందుకే మన నోటినుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే వుండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇంతకీ తథాస్తు దేవతలు ఎవరు? ఏ సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతారు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ, వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్వినీ కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారని పండితులు చెబుతున్నారు. అశ్వినీ కుమారులు ఎక్కువగా సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు వీరు తిరుగుతూ ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి.
సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. మన దగ్గర ఎంత ధనం ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుందట. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తథాస్తు అంటారట. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తథాస్తు దేవతలు ఈ మాటలను విని తథాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications