Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
తథాస్తు దేవతలు అంటే ఎవరో తెలుసా!..వాళ్లు తిరిగే టైం అదేనంట
సాధారణంగా మనం చాలాసందర్భాలలో ముఖ్యంగా సాయంత్ర వేళల్లో మాట్లాడే సమయంలో ఏవైనా అమంగళకరమైన మాటలు అంటుంటే మన పెద్దలు పైన తథాస్తు దేవలు ఉంటారు,వారు తథాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని మనల్ని హెచ్చరించడం చాలా సందర్భాలలో చూసి ఉంటాం. ఇలా ఎందుకు అంటారో చాలామందికి తెలియకపోవచ్చు. మన నోటి గుండా వచ్చే మాటలకు తథాస్తు అని దేవతలు అంటే ఆ విషయం అలాగే జరగుతుందని.. ఆమోద ముద్ర వేయడం ఈ దేవతలు చేసే పని అని చెప్తుంటారు. తథ అంటే అప్రకారంగా.. అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం.
మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు. ఇలా తథాస్తు అనే వారినే తథాస్తు దేవతలు అని అంటారు. అందుకే మన నోటినుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే వుండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇంతకీ తథాస్తు దేవతలు ఎవరు? ఏ సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతారు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ, వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్వినీ కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారని పండితులు చెబుతున్నారు. అశ్వినీ కుమారులు ఎక్కువగా సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు వీరు తిరుగుతూ ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి.
సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. మన దగ్గర ఎంత ధనం ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుందట. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తథాస్తు అంటారట. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తథాస్తు దేవతలు ఈ మాటలను విని తథాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











