తథాస్తు దేవతలు అంటే ఎవరో తెలుసా!..వాళ్లు తిరిగే టైం అదేనంట

సాధారణంగా మనం చాలాసందర్భాలలో ముఖ్యంగా సాయంత్ర వేళల్లో మాట్లాడే సమయంలో ఏవైనా అమంగళకరమైన మాటలు అంటుంటే మన పెద్దలు పైన తథాస్తు దేవలు ఉంటారు,వారు త‌థాస్తు అంటే మ‌న‌కు అంతా చెడే జ‌రుగుతుంద‌ని మనల్ని హెచ్చరించడం చాలా సందర్భాలలో చూసి ఉంటాం. ఇలా ఎందుకు అంటారో చాలామందికి తెలియకపోవచ్చు. మన నోటి గుండా వచ్చే మాటలకు తథాస్తు అని దేవతలు అంటే ఆ విషయం అలాగే జరగుతుందని.. ఆమోద ముద్ర వేయడం ఈ దేవతలు చేసే పని అని చెప్తుంటారు. త‌థ‌ అంటే అప్ర‌కారంగా.. అస్తు అంటే జ‌ర‌గాల్సిందే అని అర్థం.

మ‌నిషి ఏదైనా అన‌రాని మాటను ప‌దే ప‌దే అంటే త‌థాస్తు దేవ‌త‌లు వెంట‌నే త‌థాస్తు అంటారు. ఇలా త‌థాస్తు అనే వారినే త‌థాస్తు దేవ‌త‌లు అని అంటారు. అందుకే మన నోటినుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే వుండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇంత‌కీ త‌థాస్తు దేవ‌త‌లు ఎవ‌రు? ఏ స‌మ‌యంలో త‌థాస్తు దేవ‌త‌లు తిరుగుతారు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

who is tathastu devatas and what time they rome according to puranas
పురాణాల ప్ర‌కారం సూర్యుని భార్య అయిన సంధ్యా దేవి సూర్యుని వేడిని భ‌రించ‌లేక గుర్రం రూపాన్ని దాల్చి కురు దేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యా దేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యా దేవి ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. ఇలా వీరిద్ద‌రి క‌ల‌యిక వల్ల పుట్టిన వారే అశ్వినీ కుమారులు. వీరినే త‌థాస్తు దేవ‌త‌లని, దేవ‌తా వైద్యుల‌ని అంటారు. పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా వీరు జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతి రోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారంట. వీరు చాలా వేగంగా ప్ర‌యాణిస్తూ ఉంటారు.

వీరు ప్ర‌యాణించే మార్గంలో త‌థాస్తు అనుకుంటూ, వేద మంత్రాల‌ను జ‌పిస్తూ ఉంటారు. య‌జ్ఞాలు, యాగాలు జ‌రిగే చోట వీరు ఎక్కువ‌గా సంచ‌రిస్తూ ఉంటారు. అశ్వినీ కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మ‌రో చేత్తో అభ‌య హ‌స్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారని పండితులు చెబుతున్నారు. అశ్వినీ కుమారులు ఎక్కువ‌గా సాయంత్రం స‌మయంలో తిరుగుతూ ఉంటార‌ని న‌మ్ముతుంటారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు వీరు తిరుగుతూ ఉంటార‌ని పురాణాలు కూడా చెబుతున్నాయి.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. మన దగ్గర ఎంత ధనం ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుందట. ఇత‌రుల‌కు హాని చేయ‌కుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి ప‌నుల‌కు మాత్ర‌మే దేవ‌త‌లు త‌థాస్తు అంటార‌ట‌. ఎవ‌రైనా మ‌న‌కు అన్యాయం చేసిన‌ప్పుడు మ‌నం ప‌దే ప‌దే వారి గురించి మ‌నం మాట్లాడుకుంటూ ఉంటాం. త‌థాస్తు దేవ‌త‌లు ఈ మాట‌ల‌ను విని త‌థాస్తు అంటార‌ట‌. దీంతో మ‌న‌కు అన్యాయం చేసిన‌ వారి ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుంది. కాబట్టి ఇత‌రుల గురించైనా లేదా మ‌న‌ గురించైనా మ‌నం చెడుగా మాట్లాడుకోకూడ‌దని పండితులు చెబుతున్నారు.

Story first published: Monday, February 17, 2025, 9:00 [IST]
Desktop Bottom Promotion