Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఏపీ ఎన్నికలపై జ్యోతిష్యులు ఏమంటున్నారు..? రాశి చక్రాన్ని బట్టి ఎవరు గెలుస్తారు..?
జ్యోతిష్యులు వ్యక్తుల జాతకాలు మాత్రమే కాదు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును అంచనా వేయగలరు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు రాశులను బట్టి, వారు జాతక చక్రాన్ని బట్టి పరిస్థితిని కాలాన్ని అంచనా వేసి అధికారంలోకి ఎవరు రాబోతున్నారోజ జ్యోతిష్య పండితులు ముందుగానే ఒక అంచనా వేశారు. కేవలం కొందరి జ్యోతిష్యుల మినహా దాదాపు వారు చెప్పిన విధంగానే ఫలితాలు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాయ్. ఈసారి కూడా జ్యోతిష్యులు చెప్పినట్టుగానే జరగనుందా వేచి చూడాలి.
ఎన్నికలపై జ్యోతిష్యం ఏం చెబుతుంది ?
దేశంలో జనరల్ ఎలక్షన్కు సంబంధించిన పోలింగ్ జూన్ 1తో ముగిసిపోయింది. ఇక ఫలితాలు వెలువడ్డం ఒక్కటే వుంది. అటు లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయ్, ఈన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని వుంది. ఈ గ్యాప్లో ఎక్జిట్ పోల్ ఫలాతాలు విడుదలవుతూ వున్నాయ్. కానీ ఎక్జిట్ పోల్స్ కన్నా కూడా జ్యోతిష్యుల పోల్స్కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది.
ఎన్నికల నిబంధలను బట్టి ఎక్జిట్ పోల్స్ను వోటింగ్ పూర్తయ్యే వరకు ఇవ్వరాదు. కానీ జ్యోతిష్య పోల్స్కు ఇలాంటి నిబంధనలు ఏవీ లేకపోవడంతో జ్యోతిష్యులు రాష్ట్ర దేశ ఎన్నికలపై తమ జ్యోతిష్యం ఏమి చెబుతుందో వెళ్లడిస్తున్నారు.
ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే ఆయన సెలబ్రెటీలను జ్యోతిష్యం చెబుతుంటారు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. అలాంటి ప్రముఖ జ్యోతిష్యులు ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. వైసీపీ చాలా తక్కువ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాడు. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాన్ జాతకాలను పరిశీలించి వేణు స్వామి ఈ రిపోర్ట్ ఇచ్చారు.

మరో ప్రముఖ జ్యోతిష్యులు ఉపదృష్ట నాగాదిత్య కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈయన కూడా సెలబ్రెటీలకు జ్యోతిష్యాన్ని చెబుతాడు. ఈయన చెప్పేది వేణు స్వామి చెప్పేదానికి కొంత భిన్నంగా వుంది. ఈ చెప్పిన ప్రకారం టీడీపీ, జనసేన కలిసి అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీకి 100 స్థానాలకు పైగానే ఫలితాలు వస్తాయని అంటున్నారు.
ఇక మరో జ్యోతిష్యుడు కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ కూడా ఏపీ రాష్ట్ర ఫలితాలపై తన అభిప్రాయాన్ని వెళ్లడించారు. ఈయనకు ఎన్నో ఏళ్ల నుంచి పంచాంగం రాయం అనుభవం వుంది. ఈయన లెక్క ప్రకారం వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు.
రాజులు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ రాజ్యం భవిష్యత్తు వుంటుంది. ఎవరు పట్టాభిషక్తులు కావాలన్నది కూడా అప్పటి కాలంలో పండితులు జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకొని చూసేవారు. ఇప్పుడు కూడా ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం జ్యోతిష్యం, గ్రహాల ప్రభావం, రాశి చక్రం ఆధారంగానే వస్తాయ్. దీన్ని ఎవ్వరూ మార్చలేదని ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











