2025లో ఆ నెలలోనే భూమి అంతం.. ఆ తరువాత పెద్ద వైరస్ కూడా.. వణుకు పుట్టిస్తున్న ఆమె జ్యోష్యం!

ప్రపంచం ఇప్పటికే యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలతో అస్తవస్త్యమవుతోంది. ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆర్ధిక మద్యం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇటువైపు భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడం వంటి ఆందోళనలు ఎన్నో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆందోళనకరమైన జోస్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. తన భవిష్యవాణులతో ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేసిన బాబా వంగా తర్వాత.. ఇప్పుడు జపాన్‌కు చెందిన ర్యో టసుకీ అనే మాంగా కళాకారిణి తన భవిష్యత్ అంచనాలతో దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. త్వరలోనే భూమి అంతం జరగబోతుందని చెప్పారు. అసలు ఆమె ఏం ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొత్త మహమ్మారి ముప్పు?

ర్యో టసుకీ తన 1999లో రాసిన "ది ఫ్యూచర్ ఐ సా" అనే మాంగా పుస్తకంలో కరోనా మహమ్మారి రాబోతుందని ఊహించినట్లు చర్చలు ఉన్నాయి. ఇప్పుడు, అదే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని, 2030 ప్రాంతంలో మహమ్మారి మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇది కేవలం ఊహా కాని, గతంలో ఆమె చెప్పిన కొన్ని అంచనాలు నిజమైన నేపథ్యంలో ఈసారి కూడా తీవ్రతర చర్చకు దారితీస్తోంది.

Ryo Tatsuki who is famous as japan baba vanga predicted the world would end in july Know more here

2025లో ప్రళయం సంభవిస్తుందా?

ర్యో టసుకీ అభిప్రాయం ప్రకారం, 2025లో భూమి భారీ భౌగోళిక, వాతావరణ మార్పులతో ఎదుర్కొనబోతుందని అంచనా. ప్రత్యేకించి జూలై నెలలో సునామీ వంటి మహావిపత్తులు సంభవించే అవకాశం ఉందని ఆమె ఊహించింది. ఇది గతంలో 2011లో జరిగిన జపాన్ గ్రేట్ ఈస్ట్ భూకంపాన్ని తలపిస్తుందని కొందరు భావిస్తున్నారు.

వ్యాధులు మళ్ళీ ముప్పు తెచ్చేనా?

ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఇప్పటికే H5N1 బర్డ్ ఫ్లూ, మీజిల్స్, ఎబోలా వంటి కొత్త ముప్పులపై అప్రమత్తమవుతున్నారు. "డిసీజ్ X" అనే గుర్తింపు లేని మహమ్మారి వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి. ఇదే నేపధ్యంలో, ర్యో టసుకీ జోస్యం పై ఆసక్తి పెరుగుతోంది.

ర్యో టసుకీ ఎవరు?

ర్యో టసుకీ ఒక మాంగా కళాకారిణి మాత్రమే కాదు, తన కలల ద్వారా భవిష్యత్ సంఘటనలను అంచనా వేసిన దివ్య దృష్టి కలిగినవారిగా పేరుపొందారు. అయితే, ఆమె గురించి స్పష్టమైన సమాచారమేమీ లభించలేదు. ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో కనిపించకపోవడం కూడా ఆమె చుట్టూ గుట్టు రహస్యాలను పెంచింది.

జోస్యాల్లో నిజమెంత?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ర్యో టసుకీ అంచనాల్లో కొంత అతిశయోక్తి ఉంది. 2025లో మహా విపత్తులు తప్పవని చెప్పినా, ఆమె రచనల్లో స్పష్టమైన తేదీలు లేదా సైన్సిఫిక్ ఆధారాలు లేవు. కాబట్టి, శాస్త్రీయ పద్ధతులను, అధికారిక హెచ్చరికలను నమ్మడం చాలా ముఖ్యం.

ముగింపు

ర్యో టసుకీ జోస్యం నిజమా కాదా అనేది చెప్పడం కష్టం. కానీ, భూమి మార్పులు, పర్యావరణ సమస్యలు, వ్యాధుల పునరావృతం వంటి విషయాల్లో శాస్త్రీయ చైతన్యం అవసరం. మహమ్మారులు మరియు ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భావోద్వేగాలను పక్కనబెట్టి, విజ్ఞానం ఆధారంగా ముందుకు సాగుదాం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Sunday, April 27, 2025, 16:52 [IST]
Desktop Bottom Promotion