Winter solstice 2024: డిసెంబర్ 21న ఆకాశంలో అద్భుతం..రోజంతా చీకట్లు..ఏం జరుగుతుందంటే..

ఈ ఏడాది డిసెంబర్ 21 అంటే శనివారం చాలా చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలో రాత్రి ఎక్కువగా, పగలు తక్కువగా ఉండే రోజు డిసెంబర్ 21నే. డిసెంబర్ 21వ తేదీన పగలు 8 గంటలు మాత్రమే ఉండనుంది.. మిగిలిన 16 గంటలు రాత్రి ఉంటుంది. ఈ రోజుని శీతాకాలపు అయనాంతంగా జరుపుకుంటారు. ఉత్తర అర్ధగోళంలో శీతాకాలపు మొదటి రోజును శీతాకాలపు అయనాంతం అంటారు. శీతాకాలపు అయనాంతం రావడానికి కారణం భూమి తన ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉండడమే. ఈ రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది.

శీతాకాలం అయనాంతం అంటే ఇదే

భూమి దాని అక్షం మీద తిరిగేటప్పుడు దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్నప్పుడు ఒక రోజు వస్తుంది. ఈ కారణంగా డిసెంబర్ 21 సంవత్సరంలో అత్యంత తక్కువ పగలు సమయం, అత్యంత ఎక్కువ రాత్రి సమయం ఉంటుంది. దీన్నే శీతాకాలపు అయనాంతం అంటారు. ఖగోళ శాస్త్రం ప్రకారం శీతాకాలపు అయనాంతం.. శీతాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. శీతాకాలపు అయనాంతం అనేక దేశాలలో ముఖ్యమైన సెలవుదినం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రోజును వివిధ రకాలుగా జరుపుకుంటారు. భోగి మంటలు వెలిగించడం, ఆహారం తినడం, పాడటం, నృత్యం చేయడం, ప్రియమైనవారితో గడపడం వంటివి శీతాకాలపు అయనాంతం వేడుకలో భాగంగా ఉంటాయి.

winter solstice 2024 longest night of the year know december 21 significance

ఉష్ణోగ్రతల్లో తగ్గుదల

డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరతాయి. దీని కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో ఈ రోజున అనేక రకాల పండుగలు జరుపుకుంటారు. శీతాకాలపు అయనాంతం గురించి వివిధ దేశాలు వేర్వేరు నమ్మకాలను కలిగి ఉన్నాయి. చాలా దేశాల్లో ఈ రోజుతో సంబంధం ఉన్న కొన్ని మతపరమైన ఆచారాలు ఉన్నాయి.

భారత్ లో కూడా చాలా ముఖ్యమైనది

సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజునే భూమి తన చుట్టూ తాను నిటారుగా కాకుండా కొంచెం వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో కర్కాటక రేఖ సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఉత్తర ధువంలో ఎండాకాలం వస్తుంది. అప్పుడు ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. శీతాకాలపు అయనాంతంని పోరాట కాలం అని కూడా మనదేశంలో పిలుస్తారు. ఈ రోజున ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణుడికి ఆహారాన్ని సమర్పించి భగవద్గీత పఠించే సంప్రదాయం ఉంది.

డిసెంబర్ 21 తర్వాత నుంచి ఇలా

డిసెంబర్ 21 తర్వాత రాత్రులు తగ్గడం మొదలవుతుంది, పగలు ఎక్కువ అవుతాయి. సాధారణ రోజుల్లో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. సాధారణంగా ఇవి 12-12 గంటలు ఉంటాయి. కానీ డిసెంబర్ 21 తర్వాత రాత్రులు తగ్గుతాయి,పగలు ఎక్కువ అవుతాయి. ఉత్తర అర్ధగోళంలో ఉన్న అన్ని దేశాలలో పగలు ఎక్కువ, రాత్రి తక్కువగా ఉంటుంది.

ఉత్తర అర్ధగోళంలో ఉన్న దేశాలు
ఉత్తర అమెరికా మొత్తం
మధ్య అమెరికా
కరేబియన్

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Friday, December 20, 2024, 18:06 [IST]
Desktop Bottom Promotion