కాలమేదైనా...చెరగని అందాలను ప్రదర్శించండి!

By B N Sharma

Preserve your Beauty for ever
కోడిగుడ్డులోని పచ్చసొన, పాల మీగడ పావు టీ స్పూన్, రోజ్‌వాటర్ పావు టీ స్పూన్. ఈ మూడింటిని కలిపి ముఖమునకు పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరిచినచో చర్మం పట్టులా మెరుస్తుంది.

కోడిగుడ్డులోని పచ్చసొన, నారింజ రసం ఒక టీ స్పూన్, రోజ్‌వాటర్ అర టీ స్పూన్, నిమ్మరసం అర టీ స్పూన్. వీటన్నిటిని కలిపి ముఖమునకు మరియు మెడకు పట్టించి 20 నిమిషాల తరువాత చన్నీటితో శుభ్రపరచాలి. ఈ విధంగా వారమునకు ఒక్కసారి చేసినచో చర్మం మెరుగు పడుతుంది.

ఎక్కువసేపు నీటిలో వుండుట వలన పాదాల యందు పగుళ్ళు ఏర్పడి ఎక్కువ బాధను కలిగిస్తుంది. అలాంటి సమయంలో పావు కప్పు పసుపులో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి కలిపి పాదములకు రాసుకొనినచో పగుళ్ళు తగ్గి పాదాలు మృదువుగా మారుతుంది.

కొంచం తేనె తీసుకుని అందులో కాస్త శనగపిండిని కలిపిన మిశ్రమాని తీసుకొని మొటిమలపై పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరిచినచో మొటిమలు తగ్గుముఖము పడుతాయి.

Story first published: Saturday, August 27, 2011, 15:15 [IST]
Desktop Bottom Promotion