Latest Updates
-
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా
కంపూటర్ యుగంలో ఒత్తిడిని పారదోలండిలా....!

ఆ ప్రభావం మెడపైనా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాటే కుర్చీలో కూర్చుని తల వెనక్కి వాల్చాలి. నుదుటిపైన మునివేళ్లతో చాలా సున్నితంగా కాసేపు మర్దన చేయాలి. అలాగే కొద్దిగా గోరువెచ్చని నూనె తీసుకుని తలంగా రాసుకుని వేళ్లతో మర్ధన చేయడం వల్ల ఎంతో మార్పు ఉంటుంది. ఇది మెదడుకు ఉపశమనాన్నిస్తుంది. మెడనొప్పి కూడా తగ్గుతుంది. ఒత్తిడి, అలసట చేత్తో తీసేసినట్లు మాయమవుతుంది. దాంతి విశ్రాంతి లభిస్తుంది.
మనిషిలో ఒత్తిడి ప్రభావం శారీరకంగానే కాదు మనస్సుపైన..అందాన్నీ ప్రభావితం చేస్తుంది. ఏ మాత్రం నిర్ల్యం చేసినా..ఆ సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అలాగని అందం కోసం రకరకాల మాస్క్ లు, ఫేషియల్స్ వేసుకుంటే ఫలితం ఉంటుందనుకోవడం పొరబాటు. నీర్జీవంగా మారిన చర్మంలో మళ్లీ మునుపటి అందం సంతరించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...ముందుగా కుర్చునే విధానంలో చిన్న పాటి మార్పును చేస్తే నిత్యయౌవనంగా కనిపిస్తారు. కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. తలను కొద్దిగా వెనక్కి ఉంచి ముఖం మధ్య భాగం..అంటే చెక్కిళ్ళ నుండి మెడ దాకా మునివేళ్లతో నిధానంగా సవ్య, అపసవ్య దిశలో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటున్నా ఒత్తిడి కారణంగా..మనలోని శక్తి తగ్గుతుంది. పనిచేయాలనే ఆసక్తి లోపిస్తుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారం లేక పోలేదు. అరిపాదాల్లో కాలివేళ్లకు కొద్దిగా అడుగున ప్రెజర్ పాయింట్లు ఉంటాయి. వాటిని బొటనవేళ్లతో నొక్కుతూ మర్ధన చేయాలి. ఈ చికిత్సతో శరీరంలో పేరుకున్న మలినాలు వెలుపలికి వచ్చేస్తాయి. శక్తి అందుతుంది. ఉల్లాసంగానూ ఉంటాం.
తీసుకునే ఆహారం, జీవన శైలి, కాలుష్యం, ఒత్తడి, ఇవన్నీ శరీరంలో విషపదార్థాలు చేరేందుకు కారణమవుతాయి. వాటిని వెలుపలికి నెట్టివేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదనంగా ఈ మర్ధనను ప్రయత్నించవచ్చు. అదెలా అంటే బోర్లా పడుకుని మెడ నుంచి నడం బాగం దాకా చేత్తో కొడుతున్నట్లు చేయాల్సిన మర్ధన ఇది. దీనివల్ల విషపదార్థాలు వెలుపలికి వచ్చేస్తాయి.
అలాగే రక్తప్రసరణ వేగవంతం కావాలన్నా..శరీరీరానికి ప్రాణవాయువు అందాలన్నా..తరచూ మేనికి మర్దన అవసరం..స్నానానికి ఓ అరగంట ముందు శరీరానికి నూనె రాసుకుని మర్దన చేసుకోవచ్చు. దీనివల్ల అదనంగా ఎండార్ఫిన్లు సహజ పెయిన్ కిల్లర్ గా పనిచేసే అమినోయాసిడ్లు విడుదలవుతాయి. కండరాలు, కీళ్ళూ దృడమవుతాయి.



Click it and Unblock the Notifications