స్క్రబ్బింగ్ తో మేని మెరుపులు...

Scrubbing have always been a Beauty
ప్రకృతిలో మహిళలు అందానికి ప్రతీక. అలాంటి మహిళలు మరింత అందంగా ఉండేందుకు తహతహలాడుతుంటారు. పని ఒత్తిళ్లతో రోజులు బిజీగా మారిపోతున్నాయి. దాంతో పార్లర్‌ల చుట్టూ తిరిగే సమయం లేకుండా పోతుంది. అయితే ఇంట్లోనే ఉంటూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఏయే చర్మం వాళ్లు ఎలాంటి స్క్రబింగ్‌ లు లతో స్త్రీలు తమ సౌందర్యాన్ని ఇనుమడింపచేసుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత అందంగా కనపడుతుంటారు.

1. టమోటా, కీర, క్యారెట్టు రసాలను సమపాళ్ళలో కలుపుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్నికలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ముఖం, శరీరం, కాళ్ళు, చేతులకు అరగంటసేపు రుద్దుకోండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం, కాళ్ళు, చేతులు శరీరాన్ని శుభ్రపరచుకోండి. కొన్ని రోజుల్లోనే మీ శరీర చర్మంతోపాటు ముఖంలోను నిగారింపు కనపడుతుంది.
2. సాధారణ చర్మం గలవారు ఓట్‌ మీల్ పొడిలో పాలను కలిపి ముఖానికి రాయాలి. ఐదు నుంచి పదినిమిషాలు మెల్లగా మర్దనా చేయాలి తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు పాలల్లో దూదిని ముంచి సున్నితంగా ముఖంపై అద్దాలి. మరో అయిదు నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు తప్పనిసరిగా చేస్తే, చర్మం కోమలంగా, కాంతివంతంగా తయారవుతుంది.
3. పొడి చర్మం గలవారు పది బాదం పప్పులను కాసేపు నానేసి గ్రైండ్ చేసుకోండి. దానిని ముఖానికి రాసుకోని ఐదు పది నిమిషాలు మసాజ్ చేసే చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అప్పుడు మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
4. అలాగే అరటిపండు గుజ్జు, ఓట్‌మీల్ పొడి, తేనే, రోజ్‌ వాటర్‌ ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ పైకి, కిందికి మర్దనా చేయాలి. ఆరిన తర్వాత రోజ్‌ వాటర్‌ తో తుడవాలి. ఇప్పుడు చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు తప్పనిసరిగా స్క్రబింగ్ చేయాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. జిడ్డు చర్మంకలవారు పొప్పడి పండు గుజ్జు, బియ్యం పిండి కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల చర్మం మీద బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.

Story first published: Monday, February 6, 2012, 17:19 [IST]
Desktop Bottom Promotion