Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
స్క్రబ్బింగ్ తో మేని మెరుపులు...

1. టమోటా, కీర, క్యారెట్టు రసాలను సమపాళ్ళలో కలుపుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్నికలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ముఖం, శరీరం, కాళ్ళు, చేతులకు అరగంటసేపు రుద్దుకోండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం, కాళ్ళు, చేతులు శరీరాన్ని శుభ్రపరచుకోండి. కొన్ని రోజుల్లోనే మీ శరీర చర్మంతోపాటు ముఖంలోను నిగారింపు కనపడుతుంది.
2. సాధారణ చర్మం గలవారు ఓట్ మీల్ పొడిలో పాలను కలిపి ముఖానికి రాయాలి. ఐదు నుంచి పదినిమిషాలు మెల్లగా మర్దనా చేయాలి తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు పాలల్లో దూదిని ముంచి సున్నితంగా ముఖంపై అద్దాలి. మరో అయిదు నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు తప్పనిసరిగా చేస్తే, చర్మం కోమలంగా, కాంతివంతంగా తయారవుతుంది.
3. పొడి చర్మం గలవారు పది బాదం పప్పులను కాసేపు నానేసి గ్రైండ్ చేసుకోండి. దానిని ముఖానికి రాసుకోని ఐదు పది నిమిషాలు మసాజ్ చేసే చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అప్పుడు మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
4. అలాగే అరటిపండు గుజ్జు, ఓట్మీల్ పొడి, తేనే, రోజ్ వాటర్ ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ పైకి, కిందికి మర్దనా చేయాలి. ఆరిన తర్వాత రోజ్ వాటర్ తో తుడవాలి. ఇప్పుడు చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు తప్పనిసరిగా స్క్రబింగ్ చేయాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. జిడ్డు చర్మంకలవారు పొప్పడి పండు గుజ్జు, బియ్యం పిండి కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల చర్మం మీద బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.



Click it and Unblock the Notifications