Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
స్క్రబ్బింగ్ తో మేని మెరుపులు...

1. టమోటా, కీర, క్యారెట్టు రసాలను సమపాళ్ళలో కలుపుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్నికలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ముఖం, శరీరం, కాళ్ళు, చేతులకు అరగంటసేపు రుద్దుకోండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం, కాళ్ళు, చేతులు శరీరాన్ని శుభ్రపరచుకోండి. కొన్ని రోజుల్లోనే మీ శరీర చర్మంతోపాటు ముఖంలోను నిగారింపు కనపడుతుంది.
2. సాధారణ చర్మం గలవారు ఓట్ మీల్ పొడిలో పాలను కలిపి ముఖానికి రాయాలి. ఐదు నుంచి పదినిమిషాలు మెల్లగా మర్దనా చేయాలి తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు పాలల్లో దూదిని ముంచి సున్నితంగా ముఖంపై అద్దాలి. మరో అయిదు నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు తప్పనిసరిగా చేస్తే, చర్మం కోమలంగా, కాంతివంతంగా తయారవుతుంది.
3. పొడి చర్మం గలవారు పది బాదం పప్పులను కాసేపు నానేసి గ్రైండ్ చేసుకోండి. దానిని ముఖానికి రాసుకోని ఐదు పది నిమిషాలు మసాజ్ చేసే చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అప్పుడు మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
4. అలాగే అరటిపండు గుజ్జు, ఓట్మీల్ పొడి, తేనే, రోజ్ వాటర్ ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ పైకి, కిందికి మర్దనా చేయాలి. ఆరిన తర్వాత రోజ్ వాటర్ తో తుడవాలి. ఇప్పుడు చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు తప్పనిసరిగా స్క్రబింగ్ చేయాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. జిడ్డు చర్మంకలవారు పొప్పడి పండు గుజ్జు, బియ్యం పిండి కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల చర్మం మీద బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.



Click it and Unblock the Notifications











