Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
స్క్రబ్బింగ్ తో మేని మెరుపులు...

1. టమోటా, కీర, క్యారెట్టు రసాలను సమపాళ్ళలో కలుపుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్నికలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ముఖం, శరీరం, కాళ్ళు, చేతులకు అరగంటసేపు రుద్దుకోండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం, కాళ్ళు, చేతులు శరీరాన్ని శుభ్రపరచుకోండి. కొన్ని రోజుల్లోనే మీ శరీర చర్మంతోపాటు ముఖంలోను నిగారింపు కనపడుతుంది.
2. సాధారణ చర్మం గలవారు ఓట్ మీల్ పొడిలో పాలను కలిపి ముఖానికి రాయాలి. ఐదు నుంచి పదినిమిషాలు మెల్లగా మర్దనా చేయాలి తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు పాలల్లో దూదిని ముంచి సున్నితంగా ముఖంపై అద్దాలి. మరో అయిదు నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు తప్పనిసరిగా చేస్తే, చర్మం కోమలంగా, కాంతివంతంగా తయారవుతుంది.
3. పొడి చర్మం గలవారు పది బాదం పప్పులను కాసేపు నానేసి గ్రైండ్ చేసుకోండి. దానిని ముఖానికి రాసుకోని ఐదు పది నిమిషాలు మసాజ్ చేసే చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అప్పుడు మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
4. అలాగే అరటిపండు గుజ్జు, ఓట్మీల్ పొడి, తేనే, రోజ్ వాటర్ ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ పైకి, కిందికి మర్దనా చేయాలి. ఆరిన తర్వాత రోజ్ వాటర్ తో తుడవాలి. ఇప్పుడు చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు తప్పనిసరిగా స్క్రబింగ్ చేయాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. జిడ్డు చర్మంకలవారు పొప్పడి పండు గుజ్జు, బియ్యం పిండి కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల చర్మం మీద బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.



Click it and Unblock the Notifications