Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
కుకుంబర్(కీరదోసకాయ) చేసే మేలు అన్నీ ఇన్నీ కాదు..

1. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.
2. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.
3. కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలుగా తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ఉంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది.
4. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్, సిలికాన్ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి.
5. దోసకాయ రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీరా బాగా పని చేస్తుంది.
6. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు.
7. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
8. ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది
9. కీరదోసకాయ, కోడిగుడ్డు తెల్లసొన, టీ స్పూను నిమ్మరసం, గుప్పెడు పుదీనా ఆకులు... అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ను సుమారు పది నిమిషాల సేపు ఫ్రిజ్ లో ఉంచి తీసేయాలి. చల్లగా ఉండగానే ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత ముఖాన్ని చన్నీటితో కడగాలి. ఇలాచేస్తే జిడ్డు పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
10. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.



Click it and Unblock the Notifications











