పాదాల పగుళ్లు మాయం చేసే ఎఫెక్టివ్ టిప్స్

By Swathi

పాదాలు చిట్లిపోయి చిరాగ్గా కనిపిస్తున్నాయా ? ఎలాంటి చెప్పులు వేసుకున్నా.. మీ పాదాల మీ అందాన్ని దెబ్బతీస్తున్నాయా ? చలికాలంలో అందరినీ వేధించే సమస్యే ఇది. చర్మం పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం, పాదాలు పగలడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే.. పాదాల పగుళ్లకు చెక్ పెట్టడానికి కెమికల్ క్రీమ్స్ కంటే.. ఇంట్లోనే చక్కటి పరిష్కారాలు పాటించడం చాలా మంచిది.

coconut oil

కొబ్బరినూనె:
పాదాల పగుళ్లకు చెక్ పెట్టడానికి సులువైన మార్గం కొబ్బరినూనె. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సహజసిద్ధమైన సౌందర్యాన్నిస్తుంది. ప్రతి రోజూ రెగ్యులర్ గా పాదాలకు రాత్రిపూట కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల మీ పాదాలు స్మూత్ గా తయారవుతాయి. ఇది చిటికెలో మీ పాదాల పగుళ్లను మాయం చేస్తుంది.

ఆలివ్ ఆయిల్:
పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆలివ్ నూనె రాసుకోవాలి. తర్వాత సాక్స్ వేసుకుని పడుకుంటే.. ఉదయానికి చర్మం స్మూత్ గా తయారవుతుంది. ఉదయాన్నే ఫ్యూమిన్ స్టోన్ తో రుద్దుకోవడం వల్ల పాదాలలో ఉండే డెడ్ స్కిన్ ఊడిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.

mehandi

గోరింటాకు:
గోరింటాకు పాదాల పగుళ్లు మటుమాయం చేయడంలో చక్కగా పనిచేస్తుంది. గోరింటాకును రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని తర్వాత కడిగేస్తే.. పగుళ్లు తగ్గిపోతాయి. గోరింటాకు శరీరంలో ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు పాదాలు పగుళ్లు కనిపిస్తాయి.

Story first published: Thursday, January 7, 2016, 20:30 [IST]
Desktop Bottom Promotion