Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
దీపావళి స్పెషల్: కాలిన గాయాలకు తక్షణ ఉపశమనం కలిగించే కలబంద, పెరుగు, తేనె..
దీపావళి స్పెషల్: కాలిన గాయాలకు తక్షణ ఉపశమనం కలిగించే కలబంద, పెరుగు, తేనె..
సంవత్సరంలో వచ్చే అతి పెద్ద పండుగ దీపావళీ. దేశం మొత్తం చాలా ఉత్సహాంగా, ఆనందోత్సవాలతో 5 రోజు పాటు జరుపుకునే ఈ పండుగ నాడు టపాకాయలను కాల్చడం సంప్రదాయం. దీపావళి రోజున పిల్లలు మరియు పెద్దలు అందరూ క్రాకర్స్ కాల్చడం పరిపాటి. అయితే ఈ ఆనంద సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. టపాకాయలను కాల్చనడం వల్ల ఏర్పడే చిన్న చిన్న కాలిన గాయాలకు వెంటనే చికిత్స చేస్తే కాలిన గాయాలు వెంటనే మానిపోతాయి. మంట నుండి విముక్తి కలిగిస్తాయి.

మీ కాలిన గాయాలకు ఉపశమనం కలిగించడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలున్నాయి. క్రాకర్స్ కాల్చడం వల్ల కాలిన గాయాలు చిన్నవైతే వాటిని ఈ సింపుల్ చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఇవి చాలా ప్రభావంతంగా మరియు సున్నితంగా నయం చేస్తాయి. కాలడం వల్ల చర్మంపై ఏర్పడ్డ బొబ్బలు, చర్మంలో మంట, అసౌకర్యాన్ని వెంటనే తగ్గిస్తాయి. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో మీరే చూడండి.

అలోవెర జెల్ :
అలోవెర జెల్ చాలా ప్రభావవంతమైన హోం రెమెడీ. ఇది చర్మంలో మంటను వెంటనే తగ్గిస్తుంది. దీని ఉండే చల్లబరిచే గుణాలు కాలిన గాయం వల్ల ఏర్పడే చర్మంలో చీకాకును, కాలిన గాయాలను తగ్గిస్తుంది. అందుకోసం అందులో కొద్దిగా చన్నీటిని పోయాలి. తర్వాత అలోవెర ఆకు తీసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచాలి. 5 నిముషాల తర్వాత జెల్ తీసుకుని కాలిన గాయం మీద 10-15నిముషాల పాటు అప్లై చేయాలి.చర్మంపై కాలిన గాయం మంట నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

తేనె:
మరో ప్రభావంతమైన హోం రెమెడీ తేనె. ఇది చాలా సులభంగా అందరి వంటింట్లో ఉండేది. కాలిన వెంటనే ఆ ప్రదేశంలో చల్లటి నీటితో తేనె కలిపి కాలిన గాయాలపై అప్లై చేయాలి.

పెరుగు:
పెరుగును ప్రభావంతమైన ప్రదేశంలో అప్లై చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. కాలిన గాయాల వల్ల ఏర్పడ్డ మచ్చలు, గాయాలను పెరుగు ప్రభావవంతంగా తొలగిస్తుంది. అవసరం అనుకుంటే రోజుకు ఎక్కువ సార్లు అప్లై చేస్తుండండి.

కీర దోసకాయ:
కీరదోసకాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అవసరం అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో కొద్ది సేపు ఉంచాలి. ఇలా చల్లగా ఉన్నది కాలిన గాయాలపై లేపనంగా రాయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పేస్ట్ చేసే సమయం లేకపోతే, స్లైస్ గా కట్ చేసి కాలిన గాయాలపై ఎక్కువ సమయం అప్లై చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీన్ని కాలిన గాయాలపై రోజులో ఎన్నిసార్లైనా మర్ధన చేయవచ్చు.



Click it and Unblock the Notifications











