Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హెడ్ మసాజ్ తో చుండ్రుకు గుడ్ బై.....

1. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా అప్లై చేయాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా చూడాలి. అరగంట అలాగే ఉంచాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
2. గోరువెచ్చని నూనెతో రాత్రిళ్లు హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపొడిని కలిపి తలకు బాగా అప్లై చేసి ఆరాక తలస్నానం చేస్తే చుండ్రుకు గుడ్బై చెప్పవచ్చు. వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు.
3. ఆలివ్ ఆయిల్, బాదం పపðతో తయారు చేసిన నూనెను ఓ పాత్రలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు మర్దన చేయండి. మర్దన చేసిన ఐదు నిముషాల వరకు ఉంచండి. కాసేపయ్యా క తలలో మంట పడుతుంది. గోరువెచ్చని నీటితో తల శుభ్రంగా చేసుకోండి దీంత చుండ్రు మటుమాయం అవుతుంది.
4. రెండు టీస్పూన్ల తేనెకు మూడు టీస్పూన్ల ఆలివ్నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లనుంచి జుట్టుకు బాగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు పోతుంది.
5. పచ్చికొబ్బరిని తీసుకుని సన్నగా తురమాలి. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని పిండి పాలు తీయాలి. ఆ పాలల్లో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. స్నానానికి ముందు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, వేళ్ళతో నెమ్మదిగా రుద్దినట్లుగా మసాజ్ చేయాలి. ఇలా 15 నిమిషాలపాటు చేసిన తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు పూర్తిగా మాయమవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications