Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
రాత్రి పడుకునే ముందు ముఖానికి ఇవి రాసుకుంటే అందంగా మారిపోతారు, మహేష్ బాబు కూడా పనికిరాడు!
అందంగా కనిపించాలని ఎవరి ఉండదు చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చూపు తమపైనే ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందులో భాగంగా అందంగా కనిపించాలనే తపనతో చాలా మంది నానా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ముఖానికి ఎన్నో రకాల క్రీమ్స్ పూసుకుంటారు. అవేమి మంచి ఫలితాలు ఇవ్వకపోతే నిరాశపడిపోతుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని స్కిన్ కేర్ రొటీన్ మాత్రం తీసుకోరు. అయితే ఈ స్టోరీలో రాత్రి పడుకునే ముందు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటే అందంగా ఉంటారు అనేది తెలుసుకుందాం.
1. కలబంద:
కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, మంటను తగ్గిస్తుంది మరియు చర్మానికి కాంతిని ఇస్తుంది. దీన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకొని ఉదయం కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పొడి చర్మానికి చాలా మంచిది. కొద్దిగా కొబ్బరి నూనెను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
3. తేనె:
తేనె చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.
కొద్దిగా తేనెను ముఖానికి రాసుకొని 15-20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. రోజ్ వాటర్:
రోజ్ వాటర్ చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు చర్మ రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది. పత్తిని రోజ్ వాటర్లో ముంచి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.
5. పెరుగు:
పెరుగు చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, చర్మంపై మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. కొద్దిగా పెరుగును ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
6. విటమిన్ E ఆయిల్:
విటమిన్ E ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు చర్మ కణాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కొద్దిగా విటమిన్ E ఆయిల్ను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.



Click it and Unblock the Notifications