Latest Updates
-
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026
రాత్రి పడుకునే ముందు ముఖానికి ఇవి రాసుకుంటే అందంగా మారిపోతారు, మహేష్ బాబు కూడా పనికిరాడు!
అందంగా కనిపించాలని ఎవరి ఉండదు చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చూపు తమపైనే ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందులో భాగంగా అందంగా కనిపించాలనే తపనతో చాలా మంది నానా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ముఖానికి ఎన్నో రకాల క్రీమ్స్ పూసుకుంటారు. అవేమి మంచి ఫలితాలు ఇవ్వకపోతే నిరాశపడిపోతుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని స్కిన్ కేర్ రొటీన్ మాత్రం తీసుకోరు. అయితే ఈ స్టోరీలో రాత్రి పడుకునే ముందు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటే అందంగా ఉంటారు అనేది తెలుసుకుందాం.
1. కలబంద:
కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, మంటను తగ్గిస్తుంది మరియు చర్మానికి కాంతిని ఇస్తుంది. దీన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకొని ఉదయం కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పొడి చర్మానికి చాలా మంచిది. కొద్దిగా కొబ్బరి నూనెను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
3. తేనె:
తేనె చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.
కొద్దిగా తేనెను ముఖానికి రాసుకొని 15-20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. రోజ్ వాటర్:
రోజ్ వాటర్ చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు చర్మ రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది. పత్తిని రోజ్ వాటర్లో ముంచి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.
5. పెరుగు:
పెరుగు చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, చర్మంపై మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. కొద్దిగా పెరుగును ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
6. విటమిన్ E ఆయిల్:
విటమిన్ E ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు చర్మ కణాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కొద్దిగా విటమిన్ E ఆయిల్ను ముఖానికి రాసుకొని మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.



Click it and Unblock the Notifications











