క్రీములు వాడకుండా మీ చర్మం కాంతి వంతం..?

With Out Using Creams..?
సైడ్‌ఎఫెక్ట్స్‌కు దారీ తేసే ఎటువంటి రసాయనాలు వాడకుండా మీ చర్మాన్ని మృదువుగా చేసుకోవటం చాలా సులువైన పని. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన వనరులను పుష్కలంగా వినియోగించుకున్నారంటే మీ చర్మ సౌందర్యం ఉట్టిపడటంతో పాటు తాజాదనంతో కళ కళ లాడుతుంది. కెమికల్స్ కలవని సహజ సిద్ధమైన ఔషుదాలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి...

- మొటిమలు రాకుండా ముఖాన్ని కాపాడుకోవాలంటే, నిమ్మరసంలో కీరాదోసరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయండి. అరేంత వరకు ఉంచి చల్లిటి నీటితో శుభ్రం చేసుకోండి.

- పుదీనా ఆకుల రసంలో, బాదం మిశ్రమాన్ని కలిపి గోరువెచ్చని నీటితో ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా ఉండటంతో పాటు మెరుస్తుంటుంది.

- ఎండ భారిన పడి మీ ముఖం కమిలిపోతే, గుడ్డు తెల్లసొనను, తేనె నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.

- నాజూకైన చర్మం కోసం అరటి పండు గుజ్జులో ఆలివ్ నూనెను కలిపి అప్లై చేస్తే సత్వర ఫలితం ఉంటుంది.

- కంటి క్రింద ఏర్పడ్డ నల్లని మచ్చలు పోవాలంటే.. బంగాళదుంప గుజ్జులో కీరాదోసరసాన్నికలిపి మచ్చల భాగంలో అప్లై చేయండి.

Story first published: Tuesday, October 25, 2011, 17:43 [IST]
Desktop Bottom Promotion