చర్మం కాంతివంతంగా ఉండాలంటే...హోం ఫేషియల్

At Home Facial will give yourself a light steam treatment... |
1. ఓట్స్‌, పాలు, బాదం, పాలు, పన్నీర్‌ కలిపి ముఖానికి పూసుకుని రెండు నిముషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరుస్తుంది. చర్మం పొడిబారిపోతుంటే రోజూ రాత్రిపడుకునే ముందు ఏదైనా మంచి మాయిశ్చరైజింగ్‌ లోషన్‌ రాసుకోవాలి.

2. స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్‌ ఆయిల్‌ కానీ ఆల్మండ్‌ ఆయిల్‌ కానీ రాసుకుని తరువాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది.

3. బాదంపప్పు నానబెట్టి వాటిపైన తొక్కు తీసి దానిలో కొంచెం గసగసాల పొడి, రెండ మూడు చుక్కల చందనతైలం, పాల మీద మీగడ కలిపి పేస్టులా తయారు చేసుకుని పెట్టుకోవాలి. వారానికి రెండు సార్లైనా ఇది రాసుకుంటూ ఉంటే చర్మం తేమగా, కాంతివంతంగా మెరుస్తుంది.

4. పెసరపిండి, బియ్యంపిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండిపట్టించి అందులో ఓట్‌మీల్‌ పౌడర్‌, నారింజ తొక్కలపొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒకస్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారువుతుంది.

5. పచ్చి బంగాళాదుంపను తరిగి దానికి కొంచెం నిమ్మరసం, ఓట్‌ మీల్‌ పొడి, పాలు, కలపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. బాదం పప్పు పొడి, ఓట్‌ మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా అవుతుంది.

6. క్యారెట్‌ రసంలో కొంత గోధుమ పిండి కలిపి ముఖానికి రాసుకుని ఐదు నిముషాల తరువాత కడిగితే ముఖం, అందంగా మృదువుగా తయారువుతుంది. పొట్లకాయ రసంలో టమోటో రసం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిముషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా మెరుస్తుంది.

Story first published: Tuesday, January 17, 2012, 12:32 [IST]
Desktop Bottom Promotion