Latest Updates
-
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్షేక్, మాక్టెయిల్.. ఈ ఫ్రూట్స్తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.!
వేసవిలో శరీరానికి చల్లదనం..చర్మానికి నిగారింపు...!

1. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా అవుతుంది.
2. పెరుగులో కొద్దిగా పంచదార కానీ లేదా ఉప్మారవ్వగానీ వేసి బాగా కలిపి, ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
3. పెరుగులో శనగపిండి కలిపి నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే చర్మం, ముఖం మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి.
4. ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే మంచి క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.
5. 5 టీ ప్పూన్లు పెరుగులో ఒక టీస్పూన్ పసుపు, మరో టీస్పూన్ చక్కెర కలిపి ముఖానికి పట్టిస్తే ఎండ ప్రభావంతో దెబ్బతిన్న చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తొలిగిపోతాయి.
6. ఎండలో తిరిగి బయటి నుండి ఇంటికి తిరిగి రాగానే ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది.
7. రెండు స్సూన్ల పెరుగులో ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను గోధుమ పిండి కలిపి మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చెమట పొక్కులు పోయి మొహం తేటగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు గోధుమపిండి బదులు శెనగపిండి కలుపుకోవాలి.
8. ఎండవల్ల చర్మం కమిలిపోయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల టమోటారసంలో ఒక టేబుల్ స్పూను పెరుగు కలిపి మొహానికి, చేతులకు పట్టించి పావుగంట తర్వాత చల్లటినీటితో కడగాలి. ఎర్రబడిన చర్మం చల్లబడి మెత్తగా ఉంటుంది.
ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పెరుగు అమోఘంగా చర్మాన్ని శుభ్రపరుస్తుంది కాబట్టి సౌందర్య పోషకులు చాలామంది దీన్ని అందాన్ని పెంచేందుకు సౌందర్య వర్ధినిగా వాడుతారు. ఎండదెబ్బతిని వాడిపోయిన చర్మానికి సహజ కాంతిని కలిగిస్తుంది. పెరుగుతో శరీరంపై మర్దనా చేయడంవల్ల మంచి కాంతి, తెలుపు వస్తుంది. అలాగే కేశాలు(వ్రెంటుకల)రక్షణకు పెరుగును వాడుతారు. పెరుగును తలకు పట్టించి, గంట తరువాత తలస్నానం చేయడం వల్ల కేశాలు నిగనిగలాడడమే కాకుండా ఒత్తుగా మారుతాయి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తొలగి, జుట్టు అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications