Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
వేసవిలో శరీరానికి చల్లదనం..చర్మానికి నిగారింపు...!

1. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా అవుతుంది.
2. పెరుగులో కొద్దిగా పంచదార కానీ లేదా ఉప్మారవ్వగానీ వేసి బాగా కలిపి, ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
3. పెరుగులో శనగపిండి కలిపి నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే చర్మం, ముఖం మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి.
4. ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే మంచి క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.
5. 5 టీ ప్పూన్లు పెరుగులో ఒక టీస్పూన్ పసుపు, మరో టీస్పూన్ చక్కెర కలిపి ముఖానికి పట్టిస్తే ఎండ ప్రభావంతో దెబ్బతిన్న చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తొలిగిపోతాయి.
6. ఎండలో తిరిగి బయటి నుండి ఇంటికి తిరిగి రాగానే ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది.
7. రెండు స్సూన్ల పెరుగులో ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను గోధుమ పిండి కలిపి మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చెమట పొక్కులు పోయి మొహం తేటగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు గోధుమపిండి బదులు శెనగపిండి కలుపుకోవాలి.
8. ఎండవల్ల చర్మం కమిలిపోయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల టమోటారసంలో ఒక టేబుల్ స్పూను పెరుగు కలిపి మొహానికి, చేతులకు పట్టించి పావుగంట తర్వాత చల్లటినీటితో కడగాలి. ఎర్రబడిన చర్మం చల్లబడి మెత్తగా ఉంటుంది.
ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పెరుగు అమోఘంగా చర్మాన్ని శుభ్రపరుస్తుంది కాబట్టి సౌందర్య పోషకులు చాలామంది దీన్ని అందాన్ని పెంచేందుకు సౌందర్య వర్ధినిగా వాడుతారు. ఎండదెబ్బతిని వాడిపోయిన చర్మానికి సహజ కాంతిని కలిగిస్తుంది. పెరుగుతో శరీరంపై మర్దనా చేయడంవల్ల మంచి కాంతి, తెలుపు వస్తుంది. అలాగే కేశాలు(వ్రెంటుకల)రక్షణకు పెరుగును వాడుతారు. పెరుగును తలకు పట్టించి, గంట తరువాత తలస్నానం చేయడం వల్ల కేశాలు నిగనిగలాడడమే కాకుండా ఒత్తుగా మారుతాయి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తొలగి, జుట్టు అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications











