Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మట్టితో ముఖ సౌందర్యం మెరిసే మెరిసే....!

1. మట్టితో ప్యాక్ లు వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలకు కచ్చితంగా తొలగించాలి. ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు నవ్వటం. మాట్లాడటం లాంటి కదలికలు ముఖంలో ఉండకూడదు.
2. నెలలో ఎన్నిసార్లు వేసుకోవాలనేది వయస్సును బట్టి ఉంటుంది. పదిహేనేళ్లలోపు అమ్మాయిలు అస్సులు వాడకూడదు. మరీ తప్పనిసరైతే నెలకోసారి ప్రయత్నించాలి. ఇరవై ఐదేల్ళు దాటిన వాళ్ళు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోవాలి. ముఫ్పై అయిదేళ్లు దాటిని వాళ్లు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోలి. ముప్పై అయిదేళ్లు దాటిన స్త్రీలు నెలకు నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు. యాభై పైబడిన వాళ్ళు ఇలాంటివి వేసుకోకపోవడమే మంచిది.
3. ముఖ్యంగా మెటిమలు ఉన్నచోట ఈ ప్యాక్ వేయకూడదు. కళ్ల అడుగున, కనురెప్పలపైన రాయకూడదు.
మరి మట్టితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం: పూతకోసం వాడే మట్టి ముల్తానీ, చైనా క్లే, వండర్ మట్టి, గ్రీన్ క్టే, బ్లాక్ క్లే..వంటి రాకాల్లో దొరుకుతుంది. దీన్ని చర్మం తత్వాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది.
1. జిడ్డు చర్మతత్వం కలవారు: ఒక టీస్పూను ముల్తానీ మంట్టి, ఒక టీస్పూనునిమ్మరసం, అరచెంచా తేనె, పావు చెంచా పుదీనా పొడి చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు
ఉంటుంది.
2. చైనా క్లేఒకటిన్నర చెంచా, గ్రీన్ టీ డికాషన్ చెంచా, కమలాఫలం తొక్కల పొడి, తేనె అరచెంచా చొప్పున తీసుకుని వీటన్నింటినీ రోజ్ వాటర్ తో మిశ్రమంలా చేసుకుని ముఖానికీ పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
3. సహజ చర్మ తత్వం కలవారు: ముల్తానీ మట్టి ఒక టీస్పూను, పాలమీగడ లేదా పాలు ఒక టీస్పూను, గులాబీ రేకులపొడి అరచెంచా, తేనె ఒక టీస్పూను తీసుకుని పాలు లేదా సోయా పాలతో కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేయాలి.
4. పొడిబారిన చర్మ తత్వానికి: ఈ తరహా చర్మ తత్వం ఉన్న వాళ్లు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కు సేపు ఉంచుకోకూడదు. ఈ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలంటే..వండర్ క్లే కలబంద గుజ్జు ఒక టీస్పూనుచొప్పున, విటమిన్ ఇ మాత్రం ఒకటి తీసుకుని చిక్కని పాలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే మోము మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications