Latest Updates
-
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026
మట్టితో ముఖ సౌందర్యం మెరిసే మెరిసే....!

1. మట్టితో ప్యాక్ లు వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలకు కచ్చితంగా తొలగించాలి. ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు నవ్వటం. మాట్లాడటం లాంటి కదలికలు ముఖంలో ఉండకూడదు.
2. నెలలో ఎన్నిసార్లు వేసుకోవాలనేది వయస్సును బట్టి ఉంటుంది. పదిహేనేళ్లలోపు అమ్మాయిలు అస్సులు వాడకూడదు. మరీ తప్పనిసరైతే నెలకోసారి ప్రయత్నించాలి. ఇరవై ఐదేల్ళు దాటిన వాళ్ళు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోవాలి. ముఫ్పై అయిదేళ్లు దాటిని వాళ్లు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోలి. ముప్పై అయిదేళ్లు దాటిన స్త్రీలు నెలకు నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు. యాభై పైబడిన వాళ్ళు ఇలాంటివి వేసుకోకపోవడమే మంచిది.
3. ముఖ్యంగా మెటిమలు ఉన్నచోట ఈ ప్యాక్ వేయకూడదు. కళ్ల అడుగున, కనురెప్పలపైన రాయకూడదు.
మరి మట్టితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం: పూతకోసం వాడే మట్టి ముల్తానీ, చైనా క్లే, వండర్ మట్టి, గ్రీన్ క్టే, బ్లాక్ క్లే..వంటి రాకాల్లో దొరుకుతుంది. దీన్ని చర్మం తత్వాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది.
1. జిడ్డు చర్మతత్వం కలవారు: ఒక టీస్పూను ముల్తానీ మంట్టి, ఒక టీస్పూనునిమ్మరసం, అరచెంచా తేనె, పావు చెంచా పుదీనా పొడి చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు
ఉంటుంది.
2. చైనా క్లేఒకటిన్నర చెంచా, గ్రీన్ టీ డికాషన్ చెంచా, కమలాఫలం తొక్కల పొడి, తేనె అరచెంచా చొప్పున తీసుకుని వీటన్నింటినీ రోజ్ వాటర్ తో మిశ్రమంలా చేసుకుని ముఖానికీ పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
3. సహజ చర్మ తత్వం కలవారు: ముల్తానీ మట్టి ఒక టీస్పూను, పాలమీగడ లేదా పాలు ఒక టీస్పూను, గులాబీ రేకులపొడి అరచెంచా, తేనె ఒక టీస్పూను తీసుకుని పాలు లేదా సోయా పాలతో కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేయాలి.
4. పొడిబారిన చర్మ తత్వానికి: ఈ తరహా చర్మ తత్వం ఉన్న వాళ్లు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కు సేపు ఉంచుకోకూడదు. ఈ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలంటే..వండర్ క్లే కలబంద గుజ్జు ఒక టీస్పూనుచొప్పున, విటమిన్ ఇ మాత్రం ఒకటి తీసుకుని చిక్కని పాలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే మోము మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications