Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మగవారికీ ఉన్నాయి ఫెయిర్ నెస్ టిప్స్...!

అయితే పురుషుల చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానకి ఎక్కువ ఘాడత కలిగిన ఉత్పత్తులును వాడనవసరం లేదు. మీ చర్మసౌందర్యాన్ని తాజాగా ఉంచుకోవడానికి సాధారణ హోం మేడ్ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం...
1. ముఖ్యంగా మగవారి చర్మం తాజాగా ఉండాలంటే ఉదయం పూట షేవింగ్ చేయడం మానేయాలి. వీలైతే రాత్రి సమయంలో షేవింగ్ చేసుకోవడం మంచిది. దాంతో రాత్రి షేవింగ్ చేసిన తర్వతా ముఖ చర్మం పునరావస్తకు చేరుకుని ఉదయాన్నే చూడ్డానికి ఫ్రెష్ గా కనిపిస్తుంది.
2. చర్మం పాలిపోకుండా దృడంగా ఉండటానికి హైడ్రోక్వినోన్, మెర్క్యురీ లేదా స్టెరాయిడ్ వంటి ఉత్పత్తులు చర్మానికి హాని కలుగజేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. చర్మ ఛాయను పెంచుకోవడానికి కొన్ని పద్దతులను ఎక్కువ కాలం పాటించాల్సి ఉంటుంది.
3. ముఖాన్ని మృదువుగా, సున్నితంగా ఉండేట్లు చూడాలంటే ఇంట్లో తయారు చేసుకొనే పద్దతి : బాగా పండిన అరటి పండును గుజ్జులా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మ సౌందర్యం తాజాదనంతో మెరుస్తుంటుంది. బాగా పండిన అరటిపండును ఉపయోగించడం వల్ల చర్మ కాంతిని రెట్టింపు చేస్తుంది.
4. కాంతివంతమైన చర్మసౌందర్యానికి బాదాం, వేప ఆకు, పసుపు, గంధం చెక్క మరియు గసగసాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి. అరగంట తర్వాత ముఖాన్ని తడి చేసి క్లాక్ వైస్ టైప్ లో ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంగా కోమలంగా మెరుస్తుంటుంది.
5. సున్నితమైన చర్మ సౌందర్యానికి నిమ్మరసం, దోసకాయ రసాన్ని సమభాగాల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి, మొత్తం శరీరానికి అప్లై చేసి అరగంట సేపు అలాగే వదిలేసి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం సున్నితంగా మారుతుంది.
6. షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మం సున్నితంగా ఉండేందుకు, చర్మాన్ని కాపేడేందుకు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.



Click it and Unblock the Notifications