Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మగవారికీ ఉన్నాయి ఫెయిర్ నెస్ టిప్స్...!

అయితే పురుషుల చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానకి ఎక్కువ ఘాడత కలిగిన ఉత్పత్తులును వాడనవసరం లేదు. మీ చర్మసౌందర్యాన్ని తాజాగా ఉంచుకోవడానికి సాధారణ హోం మేడ్ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం...
1. ముఖ్యంగా మగవారి చర్మం తాజాగా ఉండాలంటే ఉదయం పూట షేవింగ్ చేయడం మానేయాలి. వీలైతే రాత్రి సమయంలో షేవింగ్ చేసుకోవడం మంచిది. దాంతో రాత్రి షేవింగ్ చేసిన తర్వతా ముఖ చర్మం పునరావస్తకు చేరుకుని ఉదయాన్నే చూడ్డానికి ఫ్రెష్ గా కనిపిస్తుంది.
2. చర్మం పాలిపోకుండా దృడంగా ఉండటానికి హైడ్రోక్వినోన్, మెర్క్యురీ లేదా స్టెరాయిడ్ వంటి ఉత్పత్తులు చర్మానికి హాని కలుగజేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. చర్మ ఛాయను పెంచుకోవడానికి కొన్ని పద్దతులను ఎక్కువ కాలం పాటించాల్సి ఉంటుంది.
3. ముఖాన్ని మృదువుగా, సున్నితంగా ఉండేట్లు చూడాలంటే ఇంట్లో తయారు చేసుకొనే పద్దతి : బాగా పండిన అరటి పండును గుజ్జులా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మ సౌందర్యం తాజాదనంతో మెరుస్తుంటుంది. బాగా పండిన అరటిపండును ఉపయోగించడం వల్ల చర్మ కాంతిని రెట్టింపు చేస్తుంది.
4. కాంతివంతమైన చర్మసౌందర్యానికి బాదాం, వేప ఆకు, పసుపు, గంధం చెక్క మరియు గసగసాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి. అరగంట తర్వాత ముఖాన్ని తడి చేసి క్లాక్ వైస్ టైప్ లో ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంగా కోమలంగా మెరుస్తుంటుంది.
5. సున్నితమైన చర్మ సౌందర్యానికి నిమ్మరసం, దోసకాయ రసాన్ని సమభాగాల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి, మొత్తం శరీరానికి అప్లై చేసి అరగంట సేపు అలాగే వదిలేసి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం సున్నితంగా మారుతుంది.
6. షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మం సున్నితంగా ఉండేందుకు, చర్మాన్ని కాపేడేందుకు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.



Click it and Unblock the Notifications