Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ముడతలు..జిడ్డు సమస్య కి మట్టితో నివారణ...

1. జిడ్డు చర్మం కలవారు: టీ స్పూన్ ముల్తానీమట్టి, నిమ్మరసం, తేనె, పుదీనా పొడి సమపాళ్ళలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు ఉంటుంది.
2. చైనా క్లే ఒకటిన్నర చెంచా, గ్రీన్ టీ డికాక్షన్ టీస్పూన్, కమలాఫలం తొక్కల పొడి, తేనె సమంగా తీసుకుని వీటన్నింటినీ రోజ్వాటర్ తో మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంటతర్వాత కడిగేయాలి. చర్మం మరీ జిడ్డుగా ఉంటే.. ఐదు రోజులకోసారి వేసుకోవచ్చు. జిడ్డు తక్కువగా ఉంటే.. నెలకు మూడుసార్లు రాసుకోవచ్చు. చర్మంలో మొటిమలు, జిడ్డు తగ్గడమే కాదు.. అందంగానూ మారుతుంది.
3. సహజ చర్మం కలవారు: ముల్తానీమట్టి టీస్పూన్ లో, పాలమీగడ లేదా పాలు టీస్పూన్, గులాబీ రేకలపొడి టీస్పూన్, తేనె టీస్పూన్తీసుకుని పాలు లేదా సోయా పాలతో కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. వండర్ క్లే బాదం పొడి టీస్పూన్, పాలు రెండు టీస్పూన్ , మామిడిగుజ్జుటీస్పూన్ తీసుకుని వీటన్నింటినీ కలిపి చర్మానికి పూతలా రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి.
5. ముల్తానీమట్టి, టమాటాగుజ్జు, కీరదోస రసం చెంచా చొప్పున తీసుకుని అరచెంచా తేనె కలిపి రాసుకోవాలి. పదినిమిషాల తరవాత కడిగేస్తే చాలు.
6. పొడిబారిన చర్మానికి: ఈ తరహా చర్మ తత్వం ఉన్నవాళ్లు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచుకోకూడదు. వండర్ క్లే, కలబంద గుజ్జు చెంచా చొప్పున, విటమిన్ ఇ మాత్ర ఒకటి తీసుకుని చిక్కని పాలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే మోము మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications