Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
నిత్యం యవ్వనంతో ఆకర్షణీయంగా...!

ముఖానికి, చేతులు, మెడకీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని చాయలు కనిపించవు. పైగా ఏళ్లు గడిచినా యౌవనంగా కనిపిస్తారు.
చేతులు ఏ మాత్రం పొడిబారినట్లు అనిపించినా.. ఆ ప్రాంతంలో నిమ్మచెక్క రుద్దుకోవాలి. దీనివల్ల చేతులు మౄఎదుత్వాన్ని పొందుతాయి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే.. లిప్స్టిక్ తప్పనిసరిగా వేసుకోవాలి.
1. జిడ్డు చర్మం ఉన్నవారికి పై పూతలతో ఎంతో మేలు జరుగుతుంది. మంచి గంధం పొడిలో కొద్దిగా పసు పు, బత్తాయి రసం వేసి ముఖం, మెడకు రాయాలి. ఆరాక చల్లని నీటితో కడిగితే ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది. సహజ చర్మతత్వానికైతే బత్తాయి రసం బదులు గులాబీనీటిని తీసుకోవాలి.
2. నాణ్యమైన టోనర్ లేదా గులాబీనీటిని కొద్దిగా ముఖంపై చల్లుకుంటే.. ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది.
3. కొద్దిగా క్రీం తీసుకుని దానికి ఫౌండేషన్ను కలపాలి. దీనివల్ల వేసుకున్న ఫౌండేషన్ కూడా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
4. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్ల రూపంలో తీసుకున్నా... ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.
5. నల్లమచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా పోతాయి. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది.
6. చెంచాచొప్పున వెనిగర్, వేడి నీళ్లు కలిపి మచ్చల మీద రాయాలి.
7. ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదినుంచి పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. ఉల్లిరసానికి చెంచా తేనె కలిపి ముఖం మీద రాయాలి.
9. చెంచాచొప్పున తేనె, ఓట్ మీల్ పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరవాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.
10. నానబెట్టిన బాదం పప్పులను మర్నాడు గ్రైండ్ చేసి.. తేనె నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది స్క్రబ్బర్లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications