Latest Updates
-
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
నిత్యం యవ్వనంతో ఆకర్షణీయంగా...!

ముఖానికి, చేతులు, మెడకీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని చాయలు కనిపించవు. పైగా ఏళ్లు గడిచినా యౌవనంగా కనిపిస్తారు.
చేతులు ఏ మాత్రం పొడిబారినట్లు అనిపించినా.. ఆ ప్రాంతంలో నిమ్మచెక్క రుద్దుకోవాలి. దీనివల్ల చేతులు మౄఎదుత్వాన్ని పొందుతాయి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే.. లిప్స్టిక్ తప్పనిసరిగా వేసుకోవాలి.
1. జిడ్డు చర్మం ఉన్నవారికి పై పూతలతో ఎంతో మేలు జరుగుతుంది. మంచి గంధం పొడిలో కొద్దిగా పసు పు, బత్తాయి రసం వేసి ముఖం, మెడకు రాయాలి. ఆరాక చల్లని నీటితో కడిగితే ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది. సహజ చర్మతత్వానికైతే బత్తాయి రసం బదులు గులాబీనీటిని తీసుకోవాలి.
2. నాణ్యమైన టోనర్ లేదా గులాబీనీటిని కొద్దిగా ముఖంపై చల్లుకుంటే.. ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది.
3. కొద్దిగా క్రీం తీసుకుని దానికి ఫౌండేషన్ను కలపాలి. దీనివల్ల వేసుకున్న ఫౌండేషన్ కూడా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
4. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్ల రూపంలో తీసుకున్నా... ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.
5. నల్లమచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా పోతాయి. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది.
6. చెంచాచొప్పున వెనిగర్, వేడి నీళ్లు కలిపి మచ్చల మీద రాయాలి.
7. ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదినుంచి పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. ఉల్లిరసానికి చెంచా తేనె కలిపి ముఖం మీద రాయాలి.
9. చెంచాచొప్పున తేనె, ఓట్ మీల్ పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరవాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.
10. నానబెట్టిన బాదం పప్పులను మర్నాడు గ్రైండ్ చేసి.. తేనె నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది స్క్రబ్బర్లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications