Latest Updates
-
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా!
నిత్యం యవ్వనంతో ఆకర్షణీయంగా...!

ముఖానికి, చేతులు, మెడకీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని చాయలు కనిపించవు. పైగా ఏళ్లు గడిచినా యౌవనంగా కనిపిస్తారు.
చేతులు ఏ మాత్రం పొడిబారినట్లు అనిపించినా.. ఆ ప్రాంతంలో నిమ్మచెక్క రుద్దుకోవాలి. దీనివల్ల చేతులు మౄఎదుత్వాన్ని పొందుతాయి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే.. లిప్స్టిక్ తప్పనిసరిగా వేసుకోవాలి.
1. జిడ్డు చర్మం ఉన్నవారికి పై పూతలతో ఎంతో మేలు జరుగుతుంది. మంచి గంధం పొడిలో కొద్దిగా పసు పు, బత్తాయి రసం వేసి ముఖం, మెడకు రాయాలి. ఆరాక చల్లని నీటితో కడిగితే ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది. సహజ చర్మతత్వానికైతే బత్తాయి రసం బదులు గులాబీనీటిని తీసుకోవాలి.
2. నాణ్యమైన టోనర్ లేదా గులాబీనీటిని కొద్దిగా ముఖంపై చల్లుకుంటే.. ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది.
3. కొద్దిగా క్రీం తీసుకుని దానికి ఫౌండేషన్ను కలపాలి. దీనివల్ల వేసుకున్న ఫౌండేషన్ కూడా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
4. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్ల రూపంలో తీసుకున్నా... ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.
5. నల్లమచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా పోతాయి. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది.
6. చెంచాచొప్పున వెనిగర్, వేడి నీళ్లు కలిపి మచ్చల మీద రాయాలి.
7. ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదినుంచి పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. ఉల్లిరసానికి చెంచా తేనె కలిపి ముఖం మీద రాయాలి.
9. చెంచాచొప్పున తేనె, ఓట్ మీల్ పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరవాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.
10. నానబెట్టిన బాదం పప్పులను మర్నాడు గ్రైండ్ చేసి.. తేనె నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది స్క్రబ్బర్లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications











