Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
టీజేజ్ లో ముఖంపై రంధ్రాలు...?

1. ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ ని ముంచి ముఖమంతా తుడిచి 20 నిమిషాల తర్వాత తిరిగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి స్కిన్ టోనర్లా పనిచేయడమే కాకుండా దీన్ని క్రమం తప్పకుండా రెండు వారాలపాటు ఉదయం, సాయంత్రం చేస్తే ముఖంపైన జిడ్డు, రంధ్రాలు, మొటిమల తాలూకు నల్లమచ్చలు, యాక్నే సమస్య లు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
2. ప్రతీ రెండు రోజులకోసారి ముఖానికి ఆవిరిపట్టాలి. దీని వల్ల ముఖంపై మొటిమలు రాకుండా వుంటాయి. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకుని ఆయిల్ కణాలు కరిగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టడం పూర్తయిన తర్వాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. దీని వల్ల తెరుచుకున్న చర్మ కణాలు తిరిగి మూసుకుపోతాయి.
3. అందం, ఆరోగ్యాలనిచ్చే ఏకైక సాధనం మంచి నీరు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరాన్ని శుద్ధి చేసి మొటిమలు రాకుండా కాపాడుతుంది. దాంతో రంధ్రాలు ఏర్పడకుండా ఉంటాయి.
4. గోరు ఉప్పు నీటితో రోజూ ఉదయం, సాయంత్రం ముఖం కడగండి. దుమ్ము, మురికి దరిచేరుకుండా చేస్తుంది.
5. పొప్పడి పండు గుజ్జును మర్దనా చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొట్టడమే కాదు, ముఖానికి నునుపుగా ఉంచుతుంది.
6. రోజ్ వాటర్ ను తీసుకుని, అంతే మోతాదులో కీర పేస్ట్ ను నిమ్మరసంలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమం మొటిమలపై ప్రభావం చూపుతుంది.
7. క్యారెట్ జ్యూస్ ముఖానికి మర్దనా చేయడం వల్ల ముఖంపై మొటిమలను, వాటి తాలూకు మచ్చలను పోగొట్టవచ్చు.
8. కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల బారి నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications











