Latest Updates
-
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే!
టీజేజ్ లో ముఖంపై రంధ్రాలు...?

1. ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ ని ముంచి ముఖమంతా తుడిచి 20 నిమిషాల తర్వాత తిరిగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి స్కిన్ టోనర్లా పనిచేయడమే కాకుండా దీన్ని క్రమం తప్పకుండా రెండు వారాలపాటు ఉదయం, సాయంత్రం చేస్తే ముఖంపైన జిడ్డు, రంధ్రాలు, మొటిమల తాలూకు నల్లమచ్చలు, యాక్నే సమస్య లు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
2. ప్రతీ రెండు రోజులకోసారి ముఖానికి ఆవిరిపట్టాలి. దీని వల్ల ముఖంపై మొటిమలు రాకుండా వుంటాయి. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకుని ఆయిల్ కణాలు కరిగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టడం పూర్తయిన తర్వాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. దీని వల్ల తెరుచుకున్న చర్మ కణాలు తిరిగి మూసుకుపోతాయి.
3. అందం, ఆరోగ్యాలనిచ్చే ఏకైక సాధనం మంచి నీరు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరాన్ని శుద్ధి చేసి మొటిమలు రాకుండా కాపాడుతుంది. దాంతో రంధ్రాలు ఏర్పడకుండా ఉంటాయి.
4. గోరు ఉప్పు నీటితో రోజూ ఉదయం, సాయంత్రం ముఖం కడగండి. దుమ్ము, మురికి దరిచేరుకుండా చేస్తుంది.
5. పొప్పడి పండు గుజ్జును మర్దనా చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొట్టడమే కాదు, ముఖానికి నునుపుగా ఉంచుతుంది.
6. రోజ్ వాటర్ ను తీసుకుని, అంతే మోతాదులో కీర పేస్ట్ ను నిమ్మరసంలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమం మొటిమలపై ప్రభావం చూపుతుంది.
7. క్యారెట్ జ్యూస్ ముఖానికి మర్దనా చేయడం వల్ల ముఖంపై మొటిమలను, వాటి తాలూకు మచ్చలను పోగొట్టవచ్చు.
8. కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల బారి నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications