Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
టీజేజ్ లో ముఖంపై రంధ్రాలు...?

1. ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ ని ముంచి ముఖమంతా తుడిచి 20 నిమిషాల తర్వాత తిరిగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి స్కిన్ టోనర్లా పనిచేయడమే కాకుండా దీన్ని క్రమం తప్పకుండా రెండు వారాలపాటు ఉదయం, సాయంత్రం చేస్తే ముఖంపైన జిడ్డు, రంధ్రాలు, మొటిమల తాలూకు నల్లమచ్చలు, యాక్నే సమస్య లు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
2. ప్రతీ రెండు రోజులకోసారి ముఖానికి ఆవిరిపట్టాలి. దీని వల్ల ముఖంపై మొటిమలు రాకుండా వుంటాయి. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకుని ఆయిల్ కణాలు కరిగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టడం పూర్తయిన తర్వాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. దీని వల్ల తెరుచుకున్న చర్మ కణాలు తిరిగి మూసుకుపోతాయి.
3. అందం, ఆరోగ్యాలనిచ్చే ఏకైక సాధనం మంచి నీరు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరాన్ని శుద్ధి చేసి మొటిమలు రాకుండా కాపాడుతుంది. దాంతో రంధ్రాలు ఏర్పడకుండా ఉంటాయి.
4. గోరు ఉప్పు నీటితో రోజూ ఉదయం, సాయంత్రం ముఖం కడగండి. దుమ్ము, మురికి దరిచేరుకుండా చేస్తుంది.
5. పొప్పడి పండు గుజ్జును మర్దనా చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొట్టడమే కాదు, ముఖానికి నునుపుగా ఉంచుతుంది.
6. రోజ్ వాటర్ ను తీసుకుని, అంతే మోతాదులో కీర పేస్ట్ ను నిమ్మరసంలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమం మొటిమలపై ప్రభావం చూపుతుంది.
7. క్యారెట్ జ్యూస్ ముఖానికి మర్దనా చేయడం వల్ల ముఖంపై మొటిమలను, వాటి తాలూకు మచ్చలను పోగొట్టవచ్చు.
8. కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి కొంచెం పసుపుకు ఒక టీస్పూన్ హనీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల బారి నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications