Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
సహజ చర్మ సౌందర్యం ఇలా సొంతం...!

సహజ పీలింగ్ ఏజెంట్ గా పనిచేసే బొప్పాయి. మొటిమల తాలూకు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది. బాగా మగ్గిన బొప్పాయి పండు గుజ్జులో రెండుచుక్కల తేనె, కొద్దిగా పాలమీగడ కలిపి ముఖానికి పూతలా వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మృదుత్వాన్ని సంతరిచుకుంటుంది. ఆ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి కొందరికి. ఇలాంటివారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.
కాలంతో నిమత్తం లేకుండా చర్మం పొడిబారుతుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివారు కొద్దిగా బాదం నూనెను చర్మానికి రాసుకుని కాసేపయ్యాక నలుగుతో కడిగేసుకోవాలి. చాలా మార్పు కనిపిస్తుంది.
తరచూ బయట తిరగడం వల్ల చర్మంపై మురికి చేరుతుంది. దీన్ని తొలగించాలంటే.. టమాటా క్లెన్సర్ చక్కని పరిష్కారం. టమాటా గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా మర్ధన చేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే... చర్మం శుభ్ర పడి తాజాధనాన్ని సంతరించుకుంటుంది.
అలాగే రెండుచెంచాలి తేనెలో కొద్దిగా కోడిగుడ్డు సొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. అయితే ..ఈ పూత వేసుకున్నప్పుడు మాట్లాడకూడదు, నవ్వకూడదు. కదలకుండా ఉండాలి. లేదంటే తగ్గుముఖం పట్టాల్సిన ముడతల సమస్య మరింత పెరుగుతుందని మరవకూడదు.
కొందరు పాతికేళ్లకే నలభై ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు. ముడతలు పడిన చరమమం దీనికి కారణం. బొప్పాయిని మొత్తని గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా వరిపిండి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తూ ఉంటే ముడతలు తగ్గి చర్మం బిగుతుంగా మారుతుంది.
మృతకణాల్ని తొలగించాలంటే బంగాళదుంప గుజ్జులో రెండు చెంచాలి ఓట్స్, రెండు చెంచాల పాలు, రెండు చుక్కల తేనె, అరచెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చుని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు... ఈ అన్ని రకాల చర్మతత్వాలవారికి చక్కగా నప్పుతుంది. ఇలా తరచూ చేస్తుంటే మెరిసే మేని మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications