Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
సహజ చర్మ సౌందర్యం ఇలా సొంతం...!

సహజ పీలింగ్ ఏజెంట్ గా పనిచేసే బొప్పాయి. మొటిమల తాలూకు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది. బాగా మగ్గిన బొప్పాయి పండు గుజ్జులో రెండుచుక్కల తేనె, కొద్దిగా పాలమీగడ కలిపి ముఖానికి పూతలా వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మృదుత్వాన్ని సంతరిచుకుంటుంది. ఆ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి కొందరికి. ఇలాంటివారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.
కాలంతో నిమత్తం లేకుండా చర్మం పొడిబారుతుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివారు కొద్దిగా బాదం నూనెను చర్మానికి రాసుకుని కాసేపయ్యాక నలుగుతో కడిగేసుకోవాలి. చాలా మార్పు కనిపిస్తుంది.
తరచూ బయట తిరగడం వల్ల చర్మంపై మురికి చేరుతుంది. దీన్ని తొలగించాలంటే.. టమాటా క్లెన్సర్ చక్కని పరిష్కారం. టమాటా గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా మర్ధన చేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే... చర్మం శుభ్ర పడి తాజాధనాన్ని సంతరించుకుంటుంది.
అలాగే రెండుచెంచాలి తేనెలో కొద్దిగా కోడిగుడ్డు సొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. అయితే ..ఈ పూత వేసుకున్నప్పుడు మాట్లాడకూడదు, నవ్వకూడదు. కదలకుండా ఉండాలి. లేదంటే తగ్గుముఖం పట్టాల్సిన ముడతల సమస్య మరింత పెరుగుతుందని మరవకూడదు.
కొందరు పాతికేళ్లకే నలభై ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు. ముడతలు పడిన చరమమం దీనికి కారణం. బొప్పాయిని మొత్తని గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా వరిపిండి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తూ ఉంటే ముడతలు తగ్గి చర్మం బిగుతుంగా మారుతుంది.
మృతకణాల్ని తొలగించాలంటే బంగాళదుంప గుజ్జులో రెండు చెంచాలి ఓట్స్, రెండు చెంచాల పాలు, రెండు చుక్కల తేనె, అరచెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చుని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు... ఈ అన్ని రకాల చర్మతత్వాలవారికి చక్కగా నప్పుతుంది. ఇలా తరచూ చేస్తుంటే మెరిసే మేని మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications











