Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
సహజ చర్మ సౌందర్యం ఇలా సొంతం...!

సహజ పీలింగ్ ఏజెంట్ గా పనిచేసే బొప్పాయి. మొటిమల తాలూకు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది. బాగా మగ్గిన బొప్పాయి పండు గుజ్జులో రెండుచుక్కల తేనె, కొద్దిగా పాలమీగడ కలిపి ముఖానికి పూతలా వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మృదుత్వాన్ని సంతరిచుకుంటుంది. ఆ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి కొందరికి. ఇలాంటివారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.
కాలంతో నిమత్తం లేకుండా చర్మం పొడిబారుతుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివారు కొద్దిగా బాదం నూనెను చర్మానికి రాసుకుని కాసేపయ్యాక నలుగుతో కడిగేసుకోవాలి. చాలా మార్పు కనిపిస్తుంది.
తరచూ బయట తిరగడం వల్ల చర్మంపై మురికి చేరుతుంది. దీన్ని తొలగించాలంటే.. టమాటా క్లెన్సర్ చక్కని పరిష్కారం. టమాటా గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా మర్ధన చేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే... చర్మం శుభ్ర పడి తాజాధనాన్ని సంతరించుకుంటుంది.
అలాగే రెండుచెంచాలి తేనెలో కొద్దిగా కోడిగుడ్డు సొన కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. అయితే ..ఈ పూత వేసుకున్నప్పుడు మాట్లాడకూడదు, నవ్వకూడదు. కదలకుండా ఉండాలి. లేదంటే తగ్గుముఖం పట్టాల్సిన ముడతల సమస్య మరింత పెరుగుతుందని మరవకూడదు.
కొందరు పాతికేళ్లకే నలభై ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు. ముడతలు పడిన చరమమం దీనికి కారణం. బొప్పాయిని మొత్తని గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా వరిపిండి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తూ ఉంటే ముడతలు తగ్గి చర్మం బిగుతుంగా మారుతుంది.
మృతకణాల్ని తొలగించాలంటే బంగాళదుంప గుజ్జులో రెండు చెంచాలి ఓట్స్, రెండు చెంచాల పాలు, రెండు చుక్కల తేనె, అరచెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చుని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు... ఈ అన్ని రకాల చర్మతత్వాలవారికి చక్కగా నప్పుతుంది. ఇలా తరచూ చేస్తుంటే మెరిసే మేని మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications