Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
చంద్రబింబంలాంటి ముఖానికి ఎంతో చలువన...!?

టమాటా: టమాటాల లోపటి గింజలు తీసి మిక్సీలో మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి, కొద్దిసేపటి తర్వాత తీసి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక మర్ధన చేసి గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. అలసట దూరమై హాయిగా అనిపిస్తుంది. మేని మృదువుగా మారుతుంది.
కలబంద పూత: ఒక్కోసారి ఎండకు ముఖచర్మం ఎర్రగా మారి దద్దుర్లు వచ్చే అవకాశముంటుంది. అప్పుడు నీళ్లతో కడగపోవడం మంచిది. కలబంద గుజ్జును పూతలా వేసి ఐదు నిమిషాలయ్యాక మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి. కొద్దిసేపయ్యాక నీళ్లో దూదిని లేదా స్పాంజిని ముంచి రెండుసార్లు అద్ది.. పొడి వస్త్రంతో తుడుచుకొంట ఇబ్బంది ఉండదు. లేదంటే సమస్య రెంట్టింపుఅవుతుంది.
వెనిగర్ తో ఇలా: వెనిగర్ నీళ్లు సమపాళ్లలో తీసుకొని ఖాళీ స్ప్రేసీసాలో నింపాలి. ముఖం మీద చల్లుకొని దూదితో తుడుచుకోవాలి. అలానే ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్లలో కప్పు వెనిగర్ కలుపుకొంటే బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని ఎండప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
బొప్పాయి హాయి: బొప్పాయి ముక్కలను ఫ్రిజ్ లో ఉంచి మెత్తగా చేసి నాలుగైదు నిమిషాలు మర్దన చేసుకోవాలి. తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మం మీద మృతకణాలు, మురికి తొలగిపోయి.. శుభ్రపడుతుంది. ఈ పండు అన్ని చర్మతత్వాల వారికీ నప్పుతుంది.
క్రీమ్ లకు దూరంగా: నూనెతత్వం ఎక్కువగా ఉండే క్రీమ్ లకు, క్రీమ్ ఆధారిత ఫౌండేషన్ కు దూరంగా ఉండాలి. మేకప్ సాధ్యమైనంత తక్కువగా వేసుకోవాలి. ముఖానికి, చేతులకు విటమిన్ ‘ఇ’తో చేసిన సన్ స్ర్కీన్ ను ఎంచుకుంటే మంచి ఫలితాలుంటాయి.
శరీరానికి సాంత్వన: గోరువెచ్చటి నీళ్లలో అరకప్పు వంట సోడా లేదా ఓట్స్ పొడి కలిపి స్నానం చేస్తే అలసిన శరీరానికి సాంత్వన అందుతుంది. అలానే పుల్లటి పెరుగులో ముల్తానీమట్టి చేర్చి.. ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే మేనికి తేమ అందుతుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.



Click it and Unblock the Notifications