Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చంద్రబింబంలాంటి ముఖానికి ఎంతో చలువన...!?

టమాటా: టమాటాల లోపటి గింజలు తీసి మిక్సీలో మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి, కొద్దిసేపటి తర్వాత తీసి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక మర్ధన చేసి గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. అలసట దూరమై హాయిగా అనిపిస్తుంది. మేని మృదువుగా మారుతుంది.
కలబంద పూత: ఒక్కోసారి ఎండకు ముఖచర్మం ఎర్రగా మారి దద్దుర్లు వచ్చే అవకాశముంటుంది. అప్పుడు నీళ్లతో కడగపోవడం మంచిది. కలబంద గుజ్జును పూతలా వేసి ఐదు నిమిషాలయ్యాక మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి. కొద్దిసేపయ్యాక నీళ్లో దూదిని లేదా స్పాంజిని ముంచి రెండుసార్లు అద్ది.. పొడి వస్త్రంతో తుడుచుకొంట ఇబ్బంది ఉండదు. లేదంటే సమస్య రెంట్టింపుఅవుతుంది.
వెనిగర్ తో ఇలా: వెనిగర్ నీళ్లు సమపాళ్లలో తీసుకొని ఖాళీ స్ప్రేసీసాలో నింపాలి. ముఖం మీద చల్లుకొని దూదితో తుడుచుకోవాలి. అలానే ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్లలో కప్పు వెనిగర్ కలుపుకొంటే బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని ఎండప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
బొప్పాయి హాయి: బొప్పాయి ముక్కలను ఫ్రిజ్ లో ఉంచి మెత్తగా చేసి నాలుగైదు నిమిషాలు మర్దన చేసుకోవాలి. తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మం మీద మృతకణాలు, మురికి తొలగిపోయి.. శుభ్రపడుతుంది. ఈ పండు అన్ని చర్మతత్వాల వారికీ నప్పుతుంది.
క్రీమ్ లకు దూరంగా: నూనెతత్వం ఎక్కువగా ఉండే క్రీమ్ లకు, క్రీమ్ ఆధారిత ఫౌండేషన్ కు దూరంగా ఉండాలి. మేకప్ సాధ్యమైనంత తక్కువగా వేసుకోవాలి. ముఖానికి, చేతులకు విటమిన్ ‘ఇ’తో చేసిన సన్ స్ర్కీన్ ను ఎంచుకుంటే మంచి ఫలితాలుంటాయి.
శరీరానికి సాంత్వన: గోరువెచ్చటి నీళ్లలో అరకప్పు వంట సోడా లేదా ఓట్స్ పొడి కలిపి స్నానం చేస్తే అలసిన శరీరానికి సాంత్వన అందుతుంది. అలానే పుల్లటి పెరుగులో ముల్తానీమట్టి చేర్చి.. ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే మేనికి తేమ అందుతుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.



Click it and Unblock the Notifications