Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చంద్రబింబంలాంటి ముఖానికి ఎంతో చలువన...!?

టమాటా: టమాటాల లోపటి గింజలు తీసి మిక్సీలో మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి, కొద్దిసేపటి తర్వాత తీసి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక మర్ధన చేసి గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. అలసట దూరమై హాయిగా అనిపిస్తుంది. మేని మృదువుగా మారుతుంది.
కలబంద పూత: ఒక్కోసారి ఎండకు ముఖచర్మం ఎర్రగా మారి దద్దుర్లు వచ్చే అవకాశముంటుంది. అప్పుడు నీళ్లతో కడగపోవడం మంచిది. కలబంద గుజ్జును పూతలా వేసి ఐదు నిమిషాలయ్యాక మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి. కొద్దిసేపయ్యాక నీళ్లో దూదిని లేదా స్పాంజిని ముంచి రెండుసార్లు అద్ది.. పొడి వస్త్రంతో తుడుచుకొంట ఇబ్బంది ఉండదు. లేదంటే సమస్య రెంట్టింపుఅవుతుంది.
వెనిగర్ తో ఇలా: వెనిగర్ నీళ్లు సమపాళ్లలో తీసుకొని ఖాళీ స్ప్రేసీసాలో నింపాలి. ముఖం మీద చల్లుకొని దూదితో తుడుచుకోవాలి. అలానే ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్లలో కప్పు వెనిగర్ కలుపుకొంటే బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని ఎండప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
బొప్పాయి హాయి: బొప్పాయి ముక్కలను ఫ్రిజ్ లో ఉంచి మెత్తగా చేసి నాలుగైదు నిమిషాలు మర్దన చేసుకోవాలి. తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మం మీద మృతకణాలు, మురికి తొలగిపోయి.. శుభ్రపడుతుంది. ఈ పండు అన్ని చర్మతత్వాల వారికీ నప్పుతుంది.
క్రీమ్ లకు దూరంగా: నూనెతత్వం ఎక్కువగా ఉండే క్రీమ్ లకు, క్రీమ్ ఆధారిత ఫౌండేషన్ కు దూరంగా ఉండాలి. మేకప్ సాధ్యమైనంత తక్కువగా వేసుకోవాలి. ముఖానికి, చేతులకు విటమిన్ ‘ఇ’తో చేసిన సన్ స్ర్కీన్ ను ఎంచుకుంటే మంచి ఫలితాలుంటాయి.
శరీరానికి సాంత్వన: గోరువెచ్చటి నీళ్లలో అరకప్పు వంట సోడా లేదా ఓట్స్ పొడి కలిపి స్నానం చేస్తే అలసిన శరీరానికి సాంత్వన అందుతుంది. అలానే పుల్లటి పెరుగులో ముల్తానీమట్టి చేర్చి.. ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే మేనికి తేమ అందుతుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.



Click it and Unblock the Notifications











