పసిడి వన్నెల మేని మెరుపులు....

Regular Skin Care with Home Remedies
1. ఏ కాలంలో నైనా చర్మం మిలమిల మెరవాలంటే తేనె, నిమ్మరసం, పాలపొడి ఒక్కోక్కటి ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని చిన్న చిన్న బౌల్లో బాగా కలపాలి. ఈ మిశ్రమానికి అర టేబుల్ స్పూన్ బాదం నూనె చేర్చి పేస్టులా తయారు చేసుకొని ముఖానికి పట్టించాలి. అంతే ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగెయ్యాలి. ఇలా చేయడం వల్ల చర్మం కొత్త మెరుపు సంతరించుకుంటుంది.
2. ఏ సీజన్ లో నైనా కమలాపండ్లు అందుబాటులో వుంటాయి. అయితే వేసవి సీజన్ లో ఎక్కువగా లభ్యమౌతాయి. కాబట్టి ఈ కమలాపండ్లతో చక్కటి చర్మ సౌందర్యం ఎలాగో చూద్దాం..కమలాపండు రసం, పెరుగు సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
3. నిమ్మరసం-తేనె, నిమ్మరసం-దోసకాయ రసాలను కూడా ఇలాగే సమపాళ్లలో కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుంది.
4. పచ్చిపాలని సెనగపిండిలో కలిపి ముఖానికి మర్దన చేసి అరగంట తర్వాత శుభ్రం చేసిన చక్కని ఫలితం కనిపిస్తుంది. మృతకణాలు తొలగిపోయి చర్మాన్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది.
5. బొప్పాయి, అరటిపండ్లును కొద్దిగా తీసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి, దానికి కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తు చర్మం మృదువుగా తయారవుతుంది.
6. ఇంట్లో ఓట్స్ ఇంటే కనుక కొద్దిగా పచ్చిపాలను కలిపి ముద్దలా చేసి ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత కడిగిస్తే కొత్తగా కనిపిస్తుంది...

Story first published: Tuesday, March 27, 2012, 16:44 [IST]
Desktop Bottom Promotion