Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
వేసవిలో భాదించే మొటిమలు...మచ్చలు....

1. ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోవాలి. అలాగే డెయిరీ ఉత్పత్తులను తినకోకూడదు. ఇందులో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లు నేరుగా రక్తంలో కలిసి విషపూరితంగా తయారవుతాయి. కాబట్టి మీరు మొటిమలనుంచి బయటపడాలంటే వీటిని తినడం మానేయండి.
2. ఉదాహరణకు పన్నీర్, పెరుగు, పాలు, చాకొలేట్లు తదితర డెయిరీ ఉత్పత్తులను తినకూడదు. రిఫైండ్ ఫుడ్ మరియు చల్లని పానీయాలను సేవించంకండి. ఊరగాయను తినడం తగ్గించాలి కాని పచ్చడిని ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
3. ప్రతి రోజు దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే శరీరంలోనున్న కొవ్వు బయటికి వచ్చేస్తుంది. భోజనం తిన్న తర్వాత వెంటనే నీటిని త్రాగకండి. నీరు త్రాగాలనిపిస్తే కొద్ది ద్దిగా త్రాగాలి. భోజనం చేసిన అరగంట తర్వాత కడుపారా నీటిని త్రాగితే వీటి మించిన పదార్థం మరొకటి లేదు.
4. ఎండలోకి వెళ్లడం మూలంగా ఈ మచ్చలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఎండలో తిరగడం మానేయాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మచ్చలు పెరగకుండా ఉంటాయి.
5. గుడ్డులోని తెల్లసొన తీసుకుని దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
6. కొంచెం తేనె తీసుకుని అందులో అరటిపండు మెత్తగా గుజ్జులా చేసి కలపాలి. దీనిని ముఖానికి రాసుకుంటే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
7. కొత్తిమీర రసం, ఆలుగడ్డ రసం తీసుకుని వాటికి రెండు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.
8. జిడ్డు చర్మం కలవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా టమాట రసం రాసుకుంటుంటే మొటిమలతో ఏర్పడిన గుంటలు పోతాయి.
9. మొటిమలు వేదిస్తుంటే ఒక పది నిమ్మ ఆకులు తీసుకుని మెత్తగా పేస్టు చేసుకుని, అందులో చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
10. పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్లా చేసుకొని ముఖానికి మాస్క్లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.



Click it and Unblock the Notifications