Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
వేసవిలో భాదించే మొటిమలు...మచ్చలు....

1. ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోవాలి. అలాగే డెయిరీ ఉత్పత్తులను తినకోకూడదు. ఇందులో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లు నేరుగా రక్తంలో కలిసి విషపూరితంగా తయారవుతాయి. కాబట్టి మీరు మొటిమలనుంచి బయటపడాలంటే వీటిని తినడం మానేయండి.
2. ఉదాహరణకు పన్నీర్, పెరుగు, పాలు, చాకొలేట్లు తదితర డెయిరీ ఉత్పత్తులను తినకూడదు. రిఫైండ్ ఫుడ్ మరియు చల్లని పానీయాలను సేవించంకండి. ఊరగాయను తినడం తగ్గించాలి కాని పచ్చడిని ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
3. ప్రతి రోజు దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే శరీరంలోనున్న కొవ్వు బయటికి వచ్చేస్తుంది. భోజనం తిన్న తర్వాత వెంటనే నీటిని త్రాగకండి. నీరు త్రాగాలనిపిస్తే కొద్ది ద్దిగా త్రాగాలి. భోజనం చేసిన అరగంట తర్వాత కడుపారా నీటిని త్రాగితే వీటి మించిన పదార్థం మరొకటి లేదు.
4. ఎండలోకి వెళ్లడం మూలంగా ఈ మచ్చలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఎండలో తిరగడం మానేయాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మచ్చలు పెరగకుండా ఉంటాయి.
5. గుడ్డులోని తెల్లసొన తీసుకుని దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
6. కొంచెం తేనె తీసుకుని అందులో అరటిపండు మెత్తగా గుజ్జులా చేసి కలపాలి. దీనిని ముఖానికి రాసుకుంటే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
7. కొత్తిమీర రసం, ఆలుగడ్డ రసం తీసుకుని వాటికి రెండు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.
8. జిడ్డు చర్మం కలవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా టమాట రసం రాసుకుంటుంటే మొటిమలతో ఏర్పడిన గుంటలు పోతాయి.
9. మొటిమలు వేదిస్తుంటే ఒక పది నిమ్మ ఆకులు తీసుకుని మెత్తగా పేస్టు చేసుకుని, అందులో చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
10. పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్లా చేసుకొని ముఖానికి మాస్క్లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.



Click it and Unblock the Notifications











