Latest Updates
-
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా?
వేసవిలో భాదించే మొటిమలు...మచ్చలు....

1. ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోవాలి. అలాగే డెయిరీ ఉత్పత్తులను తినకోకూడదు. ఇందులో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లు నేరుగా రక్తంలో కలిసి విషపూరితంగా తయారవుతాయి. కాబట్టి మీరు మొటిమలనుంచి బయటపడాలంటే వీటిని తినడం మానేయండి.
2. ఉదాహరణకు పన్నీర్, పెరుగు, పాలు, చాకొలేట్లు తదితర డెయిరీ ఉత్పత్తులను తినకూడదు. రిఫైండ్ ఫుడ్ మరియు చల్లని పానీయాలను సేవించంకండి. ఊరగాయను తినడం తగ్గించాలి కాని పచ్చడిని ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
3. ప్రతి రోజు దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే శరీరంలోనున్న కొవ్వు బయటికి వచ్చేస్తుంది. భోజనం తిన్న తర్వాత వెంటనే నీటిని త్రాగకండి. నీరు త్రాగాలనిపిస్తే కొద్ది ద్దిగా త్రాగాలి. భోజనం చేసిన అరగంట తర్వాత కడుపారా నీటిని త్రాగితే వీటి మించిన పదార్థం మరొకటి లేదు.
4. ఎండలోకి వెళ్లడం మూలంగా ఈ మచ్చలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఎండలో తిరగడం మానేయాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మచ్చలు పెరగకుండా ఉంటాయి.
5. గుడ్డులోని తెల్లసొన తీసుకుని దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
6. కొంచెం తేనె తీసుకుని అందులో అరటిపండు మెత్తగా గుజ్జులా చేసి కలపాలి. దీనిని ముఖానికి రాసుకుంటే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
7. కొత్తిమీర రసం, ఆలుగడ్డ రసం తీసుకుని వాటికి రెండు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.
8. జిడ్డు చర్మం కలవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా టమాట రసం రాసుకుంటుంటే మొటిమలతో ఏర్పడిన గుంటలు పోతాయి.
9. మొటిమలు వేదిస్తుంటే ఒక పది నిమ్మ ఆకులు తీసుకుని మెత్తగా పేస్టు చేసుకుని, అందులో చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
10. పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్లా చేసుకొని ముఖానికి మాస్క్లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.



Click it and Unblock the Notifications











