అలసిన ముఖం ఫ్రెష్ గా కనబడాలంటే...!

Glowing skin
1. తురిమిన క్యారెట్ టీ స్పూన్, ఛీజ్ టీ స్పూన్ కలిపి గుజ్జులా చేయాలి. ఇందులో కొద్దిగా బాదం నూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మృతకణాలను తొలగించి, చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.

2. కొన్ని గులాబీరేకులను పేస్ట్ చేసి, అందులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అర టీ స్పూన్ అలొవెరా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

3. గులాబి రంగుకోసం కాళ్ళు కొంచం ఎత్తు లో ఉన్నాట్లు పడుకోవాలి ... ఇలా చేయడం వలన మెడకు , ముఖానికి, తలకి రక్తం సరఫరా ఎక్కువై గులాబీ రంగు ఛాయా ముఖంపై వెలుగుతుంది. వారానికి మూడు రోజులు చేస్తే సరిపోతుంది.

4. ఒక పాత్రలో రెండు టేబుల్‌ స్పూన్లు పండిన అవకాడో గుజ్జు, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని పదినిమిషాల తర్వాత కడిగేయాలి. మురికిని, మృతకణాలను తొలగించడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.

5. పుచ్చకాయ రసం, కమలా పండు రసం, దోసకాయ గుజ్జు.. ఇలా వేటితోనైనా ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. ఇవి చర్మానికి కాంతిని తెస్తాయి. అయితే జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లను వాడితే మంచిది. అదేవిధంగా సాధారణ, పొడి చర్మానికి దోస, అరటి వంటి తీయని పండ్లను వాడాలి.

Story first published: Wednesday, January 4, 2012, 15:38 [IST]
Desktop Bottom Promotion