Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
అందానికి దివ్వ ఔషదం పెరుగు

ఆరోగ్యాభివృద్ధికి పెరుగు చక్కని దివ్యౌషధం. ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది. ఆరోగ్యంలోనే కాదు సౌందర్యంలోనూ పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
1. ఒక కప్పు పెరుగులో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి మర్ధన చేసి పావుగంట తర్వాత శుభ్రపరిస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఇది మంచి క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది. అలాగే అరకప్పు పెరుగులో చెంచా తేనె కలిపి గంటపాటు పక్కన ఉంచి ముఖం, మెడకు రాసి చేతులతో బాగా రుద్ది పది నిమిషాలయ్యాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. చర్మం తాజాగా ఉంటుంది.
2. శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పది నిముషాల తర్వాత, పరిశుభ్రమైన నీటితో కడగాలి. కొద్దిరోజులు ఇలా చేసినట్లయితే మొటిమలను దూరం చేసుకోవచ్చు.
3. పొడి చర్మతత్వం ఉన్న వారు పావు కప్పు ఓట్ మీల్ పొడికి తగినంత పెరుగును కలిపి ముఖానికి పూత వేయాలి. దాని మీద తేమ పూర్తిగా ఆరాక కడిగేస్తే ముఖం కొత్త కాంతులను సంతరించుకుంటుంది.
4. ముఖం మీద నల్లని మచ్చలు వున్నట్లయితే ముల్లంగి రసాన్ని తీసి తగినంత మజ్జిగను కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి. మంచి ఫలితం ఉంటుంది.
5. పావు కప్పు అరటిపండు గుజ్జుకు కొద్దిగా పెరుగును కలిపి ముకానికి రాసి బాగా మర్దన చేయాలి. ఇరవై నిమిషాలయ్యాక ముందు గోరువెచ్చటి నీళ్లు, ఆ తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. తగినంత తేమ అందుతుంది.
6. నాలుగు చుక్కలు బాదంనూనె, పన్నీరు, ఒక స్పూన్ మజ్జిగ కలిపి స్నానానికి ముందు శరీరానికి, మెడకు, ముఖానికి రాసుకొని అరగంట తర్వాత టవల్తో తుడుచుకొని స్నానం చేస్తే చర్మసౌందర్యాన్ని పెంచుతుంది.
7. రెండు టీస్పూన్ల పెరుగులో నాలుగు చుక్కల దోసకాయ రసం కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం తుడిచేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల మేను ప్రకాశవంతంగా తయారవుతుంది.
8. ఎండవలన చర్మం కమిలినట్లయితే, రెండు స్పూనుల టమోటా రసంలో ఐదు స్పూన్ల మజ్జిగ కలిపి రాసుకొని కొద్దిసేపయ్యాక కడిగేయాలి. నాలుగు స్పూన్ల మజ్జిగలో కొద్దిగా వెనిగర్ కలిపి కాళ్ళకు పట్టిస్తే బిరుసుతనాన్ని పోగొడుతుంది.



Click it and Unblock the Notifications