Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అందానికి దివ్వ ఔషదం పెరుగు

ఆరోగ్యాభివృద్ధికి పెరుగు చక్కని దివ్యౌషధం. ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది. ఆరోగ్యంలోనే కాదు సౌందర్యంలోనూ పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
1. ఒక కప్పు పెరుగులో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి మర్ధన చేసి పావుగంట తర్వాత శుభ్రపరిస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఇది మంచి క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది. అలాగే అరకప్పు పెరుగులో చెంచా తేనె కలిపి గంటపాటు పక్కన ఉంచి ముఖం, మెడకు రాసి చేతులతో బాగా రుద్ది పది నిమిషాలయ్యాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. చర్మం తాజాగా ఉంటుంది.
2. శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పది నిముషాల తర్వాత, పరిశుభ్రమైన నీటితో కడగాలి. కొద్దిరోజులు ఇలా చేసినట్లయితే మొటిమలను దూరం చేసుకోవచ్చు.
3. పొడి చర్మతత్వం ఉన్న వారు పావు కప్పు ఓట్ మీల్ పొడికి తగినంత పెరుగును కలిపి ముఖానికి పూత వేయాలి. దాని మీద తేమ పూర్తిగా ఆరాక కడిగేస్తే ముఖం కొత్త కాంతులను సంతరించుకుంటుంది.
4. ముఖం మీద నల్లని మచ్చలు వున్నట్లయితే ముల్లంగి రసాన్ని తీసి తగినంత మజ్జిగను కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి. మంచి ఫలితం ఉంటుంది.
5. పావు కప్పు అరటిపండు గుజ్జుకు కొద్దిగా పెరుగును కలిపి ముకానికి రాసి బాగా మర్దన చేయాలి. ఇరవై నిమిషాలయ్యాక ముందు గోరువెచ్చటి నీళ్లు, ఆ తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. తగినంత తేమ అందుతుంది.
6. నాలుగు చుక్కలు బాదంనూనె, పన్నీరు, ఒక స్పూన్ మజ్జిగ కలిపి స్నానానికి ముందు శరీరానికి, మెడకు, ముఖానికి రాసుకొని అరగంట తర్వాత టవల్తో తుడుచుకొని స్నానం చేస్తే చర్మసౌందర్యాన్ని పెంచుతుంది.
7. రెండు టీస్పూన్ల పెరుగులో నాలుగు చుక్కల దోసకాయ రసం కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం తుడిచేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల మేను ప్రకాశవంతంగా తయారవుతుంది.
8. ఎండవలన చర్మం కమిలినట్లయితే, రెండు స్పూనుల టమోటా రసంలో ఐదు స్పూన్ల మజ్జిగ కలిపి రాసుకొని కొద్దిసేపయ్యాక కడిగేయాలి. నాలుగు స్పూన్ల మజ్జిగలో కొద్దిగా వెనిగర్ కలిపి కాళ్ళకు పట్టిస్తే బిరుసుతనాన్ని పోగొడుతుంది.



Click it and Unblock the Notifications