Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ఈ విషయాలు తెలుసా?
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్నా.. చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా మారింది. పుష్ప సినిమాతో మరింత దగ్గరైంది ఈ కన్నడ బ్యూటీ. తన గ్లామర్ తో, తన నటనతో కుర్ర హృదయాలను దోచుకుంది.

ఏప్రిల్ 5వ తేదీన రష్మిక మందన్నా పుట్టినరోజు. 1996లో జన్మించిన రష్మిక, ఇప్పుడు 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కుర్ర హీరోయిన్ ఇప్పటికే ఎంతో మంది మనసులు గెలుచుకుంది. రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్(కొడుగు) జిల్లాలోని విరాజ్ పేట్ లో 1996 ఏప్రిల్ 5వ తేదీన జన్మించింది. రష్మిక తల్లి పేరు సుమన్, తండ్రి పేరు మదన్ మందన్నా. రష్మికకు షిమాన్ అనే చెల్లులు ఉంది.

రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్ లోనే పాఠశాల విద్య అభ్యసించింది. సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఎం.ఎస్. రామయ్య కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2012 నుండే రష్మిక మోడలింగ్ చేయడం ప్రారంభించింది. పలు ప్రకటనల్లోనూ కనిపించింది. అలా క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డును గెలుచుకుంది.

క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ప్రకటనలో రష్మికను చూసిన కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి తనకు సినిమా అవకాశం ఇచ్చాడు. 2016లో కిరిక్ పార్టీ సినిమాలో రక్షిత్ శెట్టితో కలిసి నటించి తొలిసారి స్క్రీన్ పై కనిపించింది రష్మిక. కిరిక్ పార్టీ హీరో అయిన రక్షిత్ శెట్టితో రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వారు 2018లో తమ నిశ్చితార్థాన్ని క్యాన్సల్ చేసుకున్నారు.

తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాలో నాగ శౌర్య సరసన నటించింది. అదే రష్మిక మందన్నాకు తొలి తెలుగు సినిమా. ఆ మూవీలో రష్మిక అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత తనకు అవకాశాలు రావడం మొదలైంది. చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా మారిపోయింది.

రష్మిక మందన్నా తెలుగులో తీసిన గీతా గోవిందం, పుష్ప సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే తన ఫోకస్ ను బాలీవుడ్ పై పెట్టింది. ఒకవైపు తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్లో అవకాశాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే పలు సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్ లో అవకాశాల కోసం అక్కడి హీరోయిన్లతో గ్లామర్ ప్రదర్శనలో పోటీ పడుతోంది. రష్మిక మందన్నా తన అందాల ఆరబోతలో హద్దులు లేకుండా దూసుకుపోతోంది. వివిధ రకాల ఔట్ఫిట్లు ధరిస్తూ థైస్ షో, నడుము, ఎద అందాల ప్రదర్శనతో కుర్రకారులో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తాజాగా రష్మిక మందన్నా 'రెయిన్ బో' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పింది. ఈ సినిమాను శాంతిరుబన్ డైరెక్ట్ చేయనున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారు.



Click it and Unblock the Notifications