Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుందా? సంచలన విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు
ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు తాగే నీరు కూడా చాలా చాలా ముఖ్యం. గతంలో అందరూ బావి నీళ్లు తాగేటోళ్లు..ఆ తర్వాత కుళాయిల ద్వారా వచ్చే నీటిని నేరుగా తాగేవాళ్లు. అయితే గ్రౌండ్ వాటర్ క్రమంగా కలుషితం అవుతుండటంతో అందరూ వాటర్ ని ఫిల్డర్ చేసుకొని తాగుతుంటారు. అయితే ఫిల్టర్ వాటర్ తాగితే డేంజర్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఫిల్టర్ ప్రక్రియలో భాగంగా వాడే క్లోరిన్ వల్ల వివిధ రకాల క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది.
దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్, టీహెచ్ఎంల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై స్పెయిన్లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. నైట్రేట్ పరిమాణం ఎంత పెరిగితే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు అంత పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

సాధారణంగా తాగే నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. దీని వల్ల నీటిలో ఉండే హానికారక క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే బ్యాక్టీరియాను తొలగిపోతాయని..అయితే నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వాడే క్లోరిన్తో ట్రైహాలోమీథేన్ అనే కారకం ఉత్పత్తి అవుతుందని..ఇది అనేక ఆరోగ్య సమస్యలను,ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్లు తెలిపారు. దీని వల్ల మూత్రాశయ క్యాన్సర్ 33శాతం ముప్పు ఉందని, పెద్దపేగు క్యాన్సర్ 15శాతం వచ్చే అవకాశం పెరుగుతుందట. గర్భిణీలకు గర్భస్రావం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, శిశువుల్లో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
సాధారణంగా పొలాల్లో వాడే ఎరువులు, పశుపెంపకం కేంద్రాల దగ్గర నుంచి వచ్చే వ్యర్థాల్లో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుందని, అది భూగర్భజలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగమైనప్పటికీ మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతోందని సైంటిస్టులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications