Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుందా? సంచలన విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు
ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు తాగే నీరు కూడా చాలా చాలా ముఖ్యం. గతంలో అందరూ బావి నీళ్లు తాగేటోళ్లు..ఆ తర్వాత కుళాయిల ద్వారా వచ్చే నీటిని నేరుగా తాగేవాళ్లు. అయితే గ్రౌండ్ వాటర్ క్రమంగా కలుషితం అవుతుండటంతో అందరూ వాటర్ ని ఫిల్డర్ చేసుకొని తాగుతుంటారు. అయితే ఫిల్టర్ వాటర్ తాగితే డేంజర్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఫిల్టర్ ప్రక్రియలో భాగంగా వాడే క్లోరిన్ వల్ల వివిధ రకాల క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది.
దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్, టీహెచ్ఎంల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై స్పెయిన్లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. నైట్రేట్ పరిమాణం ఎంత పెరిగితే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు అంత పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

సాధారణంగా తాగే నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. దీని వల్ల నీటిలో ఉండే హానికారక క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే బ్యాక్టీరియాను తొలగిపోతాయని..అయితే నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వాడే క్లోరిన్తో ట్రైహాలోమీథేన్ అనే కారకం ఉత్పత్తి అవుతుందని..ఇది అనేక ఆరోగ్య సమస్యలను,ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్లు తెలిపారు. దీని వల్ల మూత్రాశయ క్యాన్సర్ 33శాతం ముప్పు ఉందని, పెద్దపేగు క్యాన్సర్ 15శాతం వచ్చే అవకాశం పెరుగుతుందట. గర్భిణీలకు గర్భస్రావం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, శిశువుల్లో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
సాధారణంగా పొలాల్లో వాడే ఎరువులు, పశుపెంపకం కేంద్రాల దగ్గర నుంచి వచ్చే వ్యర్థాల్లో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుందని, అది భూగర్భజలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగమైనప్పటికీ మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతోందని సైంటిస్టులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications