Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
ఒంటె మూత్రం తాగితే ఆ వ్యాధులన్నీ నయమైపోతాయా? సైన్స్ చెప్పిన నిజం ఏంటంటే..
మన దేశంలో గోమూత్రాన్ని తాగేవాళ్లు చాలామందే ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే అరబ్ దేశాల్లో వందల ఏళ్ల నుంచి బంటె మూత్రం గురించి ఓ నమ్మకం బలంగా పాతుకుపోయింది. ఒంటె మూత్రాన్ని తాగడం ద్వారా క్యాన్సర్, హెపటైటిస్ వంటి భయంకరమైన వ్యాధులను సైతం ఇది నయం అయిపోతాయని వారు నమ్ముతారు. ఈ ఆచారానికి మత గ్రంథమైన హదీసులో ప్రవక్త మహమ్మద్ అనారోగ్యంతో ఉన్నవారికి ఒంటె పాలు, మూత్రం తాగమని సలహా ఇచ్చినట్లు ఉన్న ఒక ప్రస్తావన ఆధారం. ఇటీవల ఒక వైరల్ వీడియో ఈ సంప్రదాయాన్ని మళ్ళీ ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.
ఈ నమ్మకం వెనుక ఉన్న నిజమెంత?
మోడ్రన్ సైన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఒంటె మూత్రం తాగడం కేవలం నిరుపయోగం మాత్రమే కాదు, ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేస్తున్నాయి. 2015లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) అనే భయంకరమైన శ్వాసకోశ వ్యాధి విజృంభించినప్పుడు WHO ఒక కీలక సూచన చేసింది. పచ్చి ఒంటె పాలు, మూత్రం తాగడం మానుకోవాలని హెచ్చరించింది. ఎందుకంటే ఈ MERS వైరస్ ఒంటెల నుంచే మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల రేటు 35శాతం వరకు ఉండటం దీని తీవ్రతకు అద్దం పడుతుంది.

2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఒంటె మూత్రం తాగిన ఇద్దరు క్యాన్సర్ రోగులు బ్రూసెల్లోసిస్ అనే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. దీనివల్ల తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనపడి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఒంటె మూత్రంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని కొన్ని ప్రయోగశాల పరీక్షలు సూచించినా వాటికి మనుషులపై నిరూపితమైన క్లినికల్ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.
విశ్వాసానికి, విజ్ఞానానికి మధ్య సంఘర్షణ
ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. కొందరు దీనిని మత విశ్వాసంగా సమర్థిస్తుంటే.. మరికొందరు ఇది అశాస్త్రీయం, ప్రమాదకరం అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటూ కొందరు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
.
ఆరోగ్య సమస్యలే కాకుండా పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటె మూత్రాన్ని విచ్చలవిడిగా సేకరించి, సరైన శుద్ధి ప్రక్రియ లేకుండా పారవేయడం వల్ల పర్యావరణ వ్యవస్థలకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











