Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
Diabetes: ఇక నో టెన్షన్..షుగర్ పేషెంట్లకు తీపి వార్త..ఎయిమ్స్ సంచలన రిపోర్ట్
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలోనే అత్యధికమంది డయాబెటిస్ లేదా మధుమేహ పేషెంట్లు ఉంటారు. 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు భారత్ లో ఉన్నారు. అందుకే మన దేశాన్ని డయాబెటిస్ వరల్డ్ అని కూడా అంటారు. రక్తంలో చక్కెర పెరుగుదల కారణంగా ఈ వ్యాధి వస్తుంది. డయాబెటీస్ ఒక్కసారి అటాక్ అయ్యిందంటే దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇప్పటిదాకా లేదు. ఈ వ్యాధిని కేవలం నియంత్రించగలం అంతే. అయితే ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు మధుమేహంపై చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యోగా ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చని ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. రోజుకు 50 నిమిషాల పాటు యోగా చేస్తే షుగర్ లెవల్స్ అదుపులో ఉంచచ్చని ఈ పరిశోధనలో తేలింది. ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడికల్ సైన్సెస్,ఇతర డిపార్ట్ మెంట్ ల డాక్టర్లు కలిసి ఈ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ కి షుగర్ కంట్రోల్ మందులతో పాటు యోగా..మరో గ్రూపు వ్యక్తులకు మెడిసిన్స్ మాత్రమే ఇచ్చారు. మూడు నెలల పాటు ఇలా పరీక్షించి చూడగా.. యోగా చేయని వారి కంటే మెడిసిన్ వాడుతూ యోగా చేసిన వారి షుగర్ లెవెల్స్ వేగంగా అదుపులో ఉన్నాయని పరిశోధనలో తేలింది. యోగా ద్వారా HBA1C లెవల్స్ ని నియంత్రించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ఈ పరిశోధన వివరాలను ఉంచారు.

యోగా అందరికీ ప్రయోజనకరమని సాక్షాత్తూ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పలు సందర్భాలలో చెప్పారు. ఇప్పుడు షుగర్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేయగలదని పరిశోధనలు రుజువు చేశాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో యోగాను చేర్చుకోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు కొత్తగా లేదా ప్రెష్ గా యోగా ప్రారంభించేటట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు తీవ్రమైన అనారోగ్యం ఉంటే యోగా ప్రారంభించే ముందు డాక్టర్ ని సంప్రదించండి. మీ శరీరానికి అనుగుణంగా యోగా చేయండి.
డయాబెటిస్ ను నియంత్రించే కొన్ని ఆసనాలు
మకరాసనం
మకర అంటే మొసలి. ఈ భంగిమ కూడా మొసలి ఆకారంలోనే ఉంటుంది. అందుకే దీన్ని మకరాసనం అంటారు. ఈ ఆసనడం వేయడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. డయబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది.
భుజంగాసనం
దీనిని కోబ్రా పోజ్ లేదా సర్పాసనం అని కూడా అంటారు. డయాబెటిస్ ను నియంత్రించడంలో భుజంగాసనం చాలా బాగా పని చేస్తుంది. డయాబెటిస్ తో బాధ పడేవారు తరచూ ఈ ఆసనం వేయడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
ధనురాసనం
దీనిని విల్లు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం కూడా మధుమేహ నియంత్రణకు హెల్ప్ అవుతుంది.
పశ్చిమోత్తనాసనం
ఇన్సులిన్ ఉత్పత్తికి బాధ్యత వహించే ప్యాంక్రియాస్ వంటి ఉదర అవయవాలను ఉత్తేజపరచడంలో పశ్చిమోత్తనాసనం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications