అందరిని వణికించే... డయాబెటీస్!

By B N Sharma

Diabetesinj
భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిక్ దేశాల రాజధానిగా ప్రకటించిన తర్వాత దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య మరింత పెరిగింది. చాలా మందిలో అతి చిన్న వయసులోనే అంటే షుమారు 25 సంవత్సరాలకే ఈ వ్యాధి చిహ్నాలు చూపుతున్నాయి. దేశంలో షుమారు 62.4 మిలియన్ల జనాభా డయాబెటీస్ వ్యాధితో బాధ పడుతున్నట్లు తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సంస్ధ నిర్వహించిన ఒక స్టడీ చెపుతోంది.

సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి గతంలో 35 సంవత్సరాల వయసునుండి వ్యాప్తి చెందగా, నేడు అది 25 సంవత్సరాల వయసునుండే ప్రజలను బాధిస్తోందని, దీనికి కారణం నానాటికి మారుతున్న ఆధునిక జీవన విధానం, మరియు ఆహార పోకడలు అని డయాబెటీస్ స్పెషలిస్టులు అంటున్నారు.
డయాబెటీస్ వ్యాధిని కలిగించే కారణాలు వయసు, కుటుంబ నేపధ్యం, అధికబరువు, శారీరక శ్రమ లేకపోవటం, అనారోగ్యకర తిండ్లుగా వీరు వర్ణించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సంస్ధ మేరకు పెరిగిపోతున్న నగర జీవనవిధానం, అధిక ఆదాయాలు కూడా ఈ వ్యాధి పొందటంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. కనుక డయాబెటిక్ రోగులు నిర్దేశిత మందులు వాడుతూ, శరీర బరువు నియంత్రించటానికి శారీరక శ్రమ చేయాలని, ఆరోగ్యకర ఆహారాలను తీసుకుంటూ తమకు గల డయాబెటీస్ నియంత్రించాలి. డయాబెటీస్ లేనివారు ఈ వ్యాధి వారికి రాకుండా జీవన విధానాలు, ఆహారాలు మార్చుకుంటూ తగిన జాగ్రత్తలు పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, December 27, 2011, 12:38 [IST]
Desktop Bottom Promotion