పీచు పదార్థాలతో షుగర్ వ్యాధి అదుపు!

By B N Sharma

 Control Diabetes With Fibre Foods!
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ పోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలనుబట్టి తెలుస్తోంది. షుగర్ వ్యాధి బారిన పడేందుకు కారణాలను ప్రక్కనపెడితే... వ్యాధిగ్రస్తులు తాము తీసుకునే ఆహార అలవాట్లను మార్చుకోక పోతే చేటు తప్పదంటున్నారు వైద్యులు. ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రత్యామ్నాయంగా ఇన్సులిన్ ఉన్నప్పటికీ, ఆహారపుటలవాట్లను, జీవనశైలిని వ్యాధిననుసరించి ఖచ్చితంగా మార్చుకోవాల్సిందేనంటున్నారు.

ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు... పండ్లు, తాజా కూరగాయలు, చిక్కుడు, బఠాణీ మొదలైన పీచు పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో తినాలి. మామూలుగా ఆహారంలో వచ్చే దానికంటే షుగరువ్యాధి పీడితులు రెండు లేదా మూడు రెట్లు అధికంగా ఉండే పీచు పదార్థాన్ని తీసుకోవాలి. పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పేరుకోవడం తగ్గిపోతుంది.

ఎటువంటి పదార్థాలను తీసుకోవాలి అనే అంశంపై చాలామంది షుగర్ వ్యాధి రోగులు సందేహపడుతూంటారు. అటువంటివారికి వైద్య నిపుణులు, మెంతికూర, పచ్చి బఠాణి, క్యాలీ ఫ్లవర్, పొదీన ఆకు, కందిపప్పు, ముడి పెసలు, కిడ్నీ బీన్స్, క్యాబేజీ, టొమేటో, కార్న్‌ఫ్లేక్స్ వంటి అధిక పీచు పదార్థం కలవాటిని తినాలని చెపుతున్నారు. కనుక ఈ పదార్థాలకు రోజువారీ ఆహారంలో డయాబెటీస్ రోగులు తప్పక చోటివ్వాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, March 31, 2012, 12:01 [IST]
Desktop Bottom Promotion